icon icon icon
icon icon icon

Komatireddy: జూన్‌ 5న కాంగ్రెస్‌లోకి 25 మంది భారాస ఎమ్మెల్యేలు: మంత్రి కోమటిరెడ్డి

తనకు పదవులపై ఆశలేదని.. రానున్న పదేళ్లూ రేవంత్‌రెడ్డే సీఎం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పునరుద్ఘాటించారు.

Published : 08 May 2024 14:22 IST

హైదరాబాద్‌: తనకు పదవులపై ఆశలేదని.. రానున్న పదేళ్లూ రేవంత్‌రెడ్డే సీఎం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దిల్లీ మద్యం కేసులో అరెస్టయి జైలులో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత తెలంగాణ పరువు తీస్తున్నారని విమర్శించారు. త్వరలోనే భారాస దుకాణం ఖాళీ అవుతుందన్నారు. ఆ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు జూన్‌ 5న కాంగ్రెస్‌లో చేరతారని కోమటిరెడ్డి చెప్పారు. ఆరుగురు భారాస ఎంపీ అభ్యర్థులు తనను సంప్రదించారన్నారు. డీలిమిటేషన్‌తో రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 154కి చేరుతుందని.. అందులో 125 చోట్ల కాంగ్రెస్‌ గెలుస్తుందని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img