బ్రేకింగ్

breaking
10 May 2024 | 16:29 IST

జగనన్నా.. పైసా సాయం కోరినట్టు నిరూపించగలరా?:షర్మిల

కడప: తాను అడిగిన ప్రశ్నలకు వైఎస్‌ జగన్‌ సూటిగా సమాధానం చెప్పాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్‌ చేశారు. కడపలో విలేకరులతో మాట్లాడుతూ ఆమె కంటతడి పెట్టుకున్నారు. ‘‘రాజకీయ కాంక్షతోనే కడపలో పోటీ  చేశానని జగన్‌ అంటున్నారు. నన్ను రాజకీయాల్లోకి  తెచ్చింది జగనన్న కాదా? జైల్లో ఉన్నప్పుడు నన్ను పాదయాత్ర చేయమన్నది ఆయన కాదా? నా భర్త, పిల్లల్ని వదిలేసి వేల కి.మీ పాదయాత్ర చేశా. మీ భవిష్యత్‌ కోసం కాలికి గాయమైనా వెనక్కి తగ్గలేదు. రాజకీయ కాంక్ష ఉంటే అప్పుడే పార్టీని హైజాక్‌ చేసేదాన్ని కదా? మీ నుంచి పైసా సాయం కోరినట్టయినా నిరూపించగలరా?’’ అని షర్మిల ప్రశ్నించారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని