బ్రేకింగ్

breaking
10 May 2024 | 19:47 IST

కారు షెడ్డుకు పోయింది.. మళ్లీ రాదు: రేవంత్‌

షాద్‌నగర్‌: భాజపా మాటలు నమ్మి రాష్ట్రాన్ని ఆగం చేసుకోవద్దని తెలంగాణ ప్రజలకు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో మతచిచ్చుపెట్టి శాంతిభద్రతలు చెడగొట్టాలని చూస్తోందని విమర్శించారు. షాద్‌నగర్‌ బహిరంగ సభలో రేవంత్‌ ప్రసంగించారు. ‘‘మతకలహాల వల్లే ఉత్తర్‌ప్రదేశ్‌కు పెట్టుబడులు రావడం లేదు.హైదరాబాద్‌లో ప్రశాంత పరిస్థితులు ఉండబట్టే.. నగర ఖ్యాతి అంతర్జాతీయంగా పెరిగింది. దానిని కుంగదీసేందుకు భాజపా కుట్రలు చేస్తోంది. షెడ్డుకు పోయిన కారు.. మళ్లీ తిరిగిరాదు. కారుకు తుప్పుపట్టినందువల్లే కేసీఆర్‌ బస్సెక్కి తిరుగుతున్నారు’’ అని ఎద్దేవా చేశారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని