UPSC: సివిల్స్ అభ్యర్థులకు ఆ సడలింపులు ఇవ్వలేం: కేంద్రం
UPSC CSE: సివిల్స్ పరీక్షలు రాసే అభ్యర్థుల వయో పరిమితి సడలించడం కుదరదని కేంద్రం తేల్చి చెప్పింది.
దిల్లీ: దేశ అత్యున్నత సర్వీసుల్లో ఉద్యోగుల ఎంపికకు నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష(UPSC CSE)కు సంబంధించి ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండవని కేంద్రం తేల్చి చెప్పింది. కరోనా మహమ్మారి, ఆ తర్వాత విధించిన లాక్డౌన్ కారణంగా ఒక ఏడాది కోల్పోయిన అభ్యర్థులకు వయో సడలింపు ఇచ్చే ప్రతిపాదన ఉందా? అని కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా అడిగిన ప్రశ్నకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ప్రయత్నాల సంఖ్య, వయో పరిమితికి సంబంధించి ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో మార్పులు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన నిబంధనలకు అనుగుణంగానే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE)ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఏటా నిర్వహిస్తుందని మంత్రి చెప్పారు. కొందరు అభ్యర్థులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, డిపార్ట్మెంట్ సంబంధిత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వ్యక్తం చేసిన అభిప్రాయాలను సిబ్బంది, శిక్షణ శాఖ పరిశీలించిందని.. అయితే, CSE పరీక్ష రాసేందుకు అభ్యర్థులు హాజరయ్యేందుకు ఉన్న అవకాశాలు, వయో పరిమితి విషయంలో ఇప్పటికే ఉన్న నిబంధనల్లో సడలింపులు ఇవ్వడానికి వీలు పడటంలేదన్నారు. అలాగే, సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలకు తేదీలు నిర్ణయించడంతో పాటు పరీక్ష కేంద్రాలను యూపీఎస్సీనే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. సివిల్స్ ప్రిలిమ్స్ 2023 పరీక్ష మే 28న జరగ్గా.. జూన్ 12న ఫలితాలు విడుదల చేసినట్టు మంత్రి వెల్లడించారు. ఈ పరీక్షలో 14,624 మంది అర్హత సాధించారని.. ఫెయిల్ అయిన కొందరు అభ్యర్థులు న్యాయస్థానాలను ఆశ్రయించారని మంత్రి చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ అంటే బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరతకుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
-
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు