పేద విద్యార్థులకు ఉపకారం

ప్రతిభ ఉండి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు చదువలేకపోతుంటారు చాలామంది పేద విద్యార్థులు.

Published : 03 Jan 2024 00:06 IST

ఎల్‌ఐసీ గోల్డెన్‌ జూబ్లీ స్కాలర్‌షిప్‌  

ప్రతిభ ఉండి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు చదువలేకపోతుంటారు చాలామంది పేద విద్యార్థులు. ఇలాంటివారికి గోల్డెన్‌ జూబ్లీ స్కాలర్‌షిప్‌ స్కీం-2023  పేరుతో ఉపకారవేతనాన్ని అందిస్తోంది- లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ). అర్హులైన విద్యార్థులు జనవరి 14 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

జనరల్‌ స్కాలర్‌షిప్‌

2022-23 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్‌/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2,50,000 మించకూడదు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/ సంస్థల్లో ఏదైనా డిగ్రీ, మెడిసిన్‌, ఇంజినీరింగ్‌, ఇంటిగ్రేటెడ్‌, డిప్లొమా, వృత్తి విద్య లేదా తత్సమానమైన కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉపకార వేతనం అందుతుంది.

ఎంపికైతే: జనరల్‌ స్కాలర్‌షిప్‌నకు మెడిసిన్‌ విద్యార్థులకైతే ఏటా రూ.40వేలు ఇస్తారు. మూడు విడతలు (రూ.12000/ రూ.12000/ రూ.16000) చొప్పున అందుతుంది. ఇంజినీరింగ్‌ విద్యార్థులైతే  ఏడాదికి రూ.30 వేలు ఇస్తారు. మూడు విడతల్లో (రూ.9000/ రూ.9000/ రూ.12000) చెల్లిస్తారు. డిగ్రీ, ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు, డిప్లొమా, ఒకేషనల్‌ కోర్సులు చేసేవారికైతే ఆ కోర్సు పూర్తయ్యేవరకు  ఏటా రూ.20వేల చొప్పున ఇస్తారు.  ఈ మొత్తాన్ని మూడు విడతల్లో (రూ.6000/ రూ.6000/ రూ.8000) బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.

స్పెషల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌

పదో తరగతి తర్వాత బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి ఇది ఉద్దేశించింది. 2022-23 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి తల్లిదండ్రుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2,50,000 మించకూడదు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/ సంస్థల్లో ఇంటర్మీడియట్‌, ఒకేషనల్‌, డిప్లొమా, ఐటీఐ కోర్సు అభ్యసిస్తున్న బాలికలకు ఉపకారవేతనం అందుతుంది.

ఎంపికైతే:  స్పెషల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కీమ్‌ కింద ఎంపికైన విద్యార్థినులకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఇస్తారు. పదో తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్‌, ఒకేషనల్‌/ డిప్లొమా కోర్సులను పూర్తి చేసేందుకు ఈ మొత్తాన్ని మూడు విడతల్లో (రూ.4500/ రూ.4500/ రూ.6000) చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కనీస అర్హతగా పేర్కొన్న టెన్త్‌ లేదా ఇంటర్‌లో పొందిన మార్కుల మెరిట్‌, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా అభ్యర్థులను స్కాలర్‌ షిష్‌నకు ఎంపిక చేస్తారు. తక్కువ ఆదాయ వర్గాలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 14-01-2024.

వెబ్‌సైట్‌: https://licindia.in/documents/d/guest/gjf-scholarship-scheme-2023


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని