గురువుల ఫ్యాక్టరీ... నాగులాపల్లి బడి

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 28 Oct 2025 05:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం నాగులాపల్లి గురువుల గ్రామంగా పేరుగాంచింది. ప్రతి డీఎస్సీలో ఇక్కడి నుంచి పదుల సంఖ్యలో టీచర్‌ కొలువులు సాధిస్తున్నారు. ఎలాంటి శిక్షణకు వెళ్లకుండానే గ్రామానికి చెందిన సీనియర్‌ ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు పాటిస్తూ విజయం సాధించడం స్థానిక యువత ప్రత్యేకత. కొలువులు సాధించిన వారందరూ ఇదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తిచేయడం మరో విశేషం. నాగులాపల్లిలో 1893లో ప్రాథమిక పాఠశాలను స్థాపించారు. 132 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పాఠశాలలో చదువుకున్న 133 మంది ఉపాధ్యాయులయ్యారు. మరికొందరు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల నిర్వహించిన డీఎస్సీలోనూ ఎనిమిది మంది గురువులయ్యారు. వీరంతా ఈ బడిని దేవాలయంగా భావిస్తుంటారు. కొన్నాళ్ల క్రితం పాత భవనం తొలగించి నూతన భవనం నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న అబ్బిరెడ్డి అప్పారావురెడ్డి కూడా ఈ పాఠశాల విద్యార్థే. 

న్యూస్‌టుడే, కొత్తపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని