Azadi Ka Amrit Mahotsav: మీ తుపాకీ గుండు... నా బోడిగుండు!
ఆంధ్రావనిలో బ్రిటిష్పై పోరాటం అనగానే చప్పున ప్రకాశం పంతులు గుర్తుకొస్తారు... కాల్చండంటూ పోలీసులకు ఛాతీ చూపించిన ఆయన సాహసం జ్ఞప్తికొస్తుంది. అలాంటి సాహసమే చేసిన విస్మృత వీరనారి... కోటమర్తి కనకమహాలక్ష్మి.
ఆంధ్రావనిలో బ్రిటిష్పై పోరాటం అనగానే చప్పున ప్రకాశం పంతులు గుర్తుకొస్తారు... కాల్చండంటూ పోలీసులకు ఛాతీ చూపించిన ఆయన సాహసం జ్ఞప్తికొస్తుంది. అలాంటి సాహసమే చేసిన విస్మృత వీరనారి... కోటమర్తి కనకమహాలక్ష్మి.
సహాయ నిరాకరణ ఉద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజులవి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకా శృంగవృక్షంలో ఓ సాయంత్రాన సభ జరుగుతోంది. సుమారు మూడువేల మంది ప్రజలనుద్దేశించి... ఓ వితంతువు తెల్లటి ఖాదీ వస్త్రాన్ని తలపై ధరించి అనర్గళంగా ప్రసంగిస్తున్నారు. పద్యాలు, శ్లోకాలు, రామాయణ, మహాభారతాల్లోని ఉపమానాలను స్వాతంత్య్రోద్యమానికి అన్వయిస్తూ... బ్రిటిష్ ప్రభుత్వ దురాగతాలను ఎండగడుతూ... ప్రజల్ని ఉత్తేజపరుస్తున్న వేళ... పోలీసులు చుట్టుముట్టారు. దీంతో సభలో గందరగోళం. సామాన్య ప్రజల్ని పోలీసులు ఏమీ చేయకముందే ఆమె తెలివిగా వారి దృష్టినంతటినీ తనవైపునకు మళ్లించారు. ‘పోలీసులను చూసి బెదరకండి. వారూ మన సోదరులే’ అంటూ ‘ఇన్స్పెక్టర్... మీ తుపాకీ గుండు గట్టిదో... నా బోడిగుండు గట్టిదో చూద్దాం రండి’ అంటూ నెత్తిపై వస్త్రాన్ని తొలగించి... తల ముందుకు వంచారు. ఏం చేయాలో తోచని పోలీసులు కనక మహాలక్ష్మిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. 6 నెలల పాటు కారాగారశిక్ష విధించి... వేలూరు జైలుకు తరలించారు.
భీమవరం తాలూకాలోని గునుపూడి గ్రామంలో ఓ సంప్రదాయ కుటుంబంలో 1860 సెప్టెంబరు 30న 14వ సంతానంగా జన్మించారు కనకమహాలక్ష్మి. చిరుప్రాయంలోనే అదే గ్రామానికి చెందిన కోటమర్తి సూర్యనారాయణ మూర్తికి రెండో భార్యగా వెళ్లాల్సి వచ్చింది. భర్త నుంచి శృత పాండిత్యం అబ్బిన ఆమెకు 30 ఏళ్లకే ఆరుగురు సంతానంతో పాటు వైధవ్యం ప్రాప్తించింది. ఒంటరి జీవన పోరాటం సాగించిన ఆమె... ఆనాటి సామాజిక అవలక్షణాలపైనా పోరాటం చేశారు. ఒకవైపు పిల్లలను ఆదర్శపౌరులుగా తీర్చిదిద్దుతూనే... స్వాతంత్య్రోద్యమంలో భాగమయ్యారు. చరఖాపై నూలు తీస్తూ... ఖద్దరు ధరించి ఇంటింటికీ వెళ్లి ఖద్దరు విక్రయించేవారు. హరిజనవాడలకు వెళ్లి పిల్లలకు స్వయంగా స్నానాలు చేయించి శుచి, శుభ్రత నేర్పేవారు. రోగులకు దగ్గరుండి సపర్యలు చేసేవారు. ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తుంటే... బోగీలోని నిండు చూలాలైన హరిజన యువతికి పురిటినొప్పులు వచ్చాయి. ఆమెను పక్క స్టేషన్లోనే దింపి చెట్టుకిందే... తన వద్ద ఉన్న చీరను అడ్డుగా పెట్టి... పురుడు పోసి... సామాజిక సేవను చాటుకున్నారు కనకమహాలక్ష్మి. చురుకుదనం, ఉత్సాహం, నిబద్ధత కారణంగా ఆమె పశ్చిమగోదావరి జిల్లా స్వాతంత్య్రోద్యమ ప్రచార ప్రబోధకురాలిగా నియమితులయ్యారు. మరింత బాధ్యతతో అనేక మందిని ఉద్యమం వైపు నడిపించారు. యువతను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారనే ఆరోపణలపై కనకమహాలక్ష్మిని అరెస్టు చేసి... 1932లో ఏడాది పాటు కారాగారశిక్ష విధించింది బ్రిటిష్ ప్రభుత్వం. రెండో ప్రపంచ యుద్ధంలో భారతీయులను భాగం చేసినందుకు నిరసనగా వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు మరో ఆరునెలలు జైలులో గడపాల్సి వచ్చింది.
స్వాతంత్య్రం వచ్చాక కూడా... ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో కనకమహాలక్ష్మి పాల్గొన్నారు. 1952లో స్వామి సీతారాం భీమవరంలో సత్యాగ్రహ శిబిరం నిర్వహిస్తే... కనకమహాలక్ష్మి ఏడురోజుల పాటు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా కఠిన నిరాహార దీక్ష చేశారు. నెహ్రూతో సంప్రదింపులకు దిల్లీ వెళ్లారు కూడా! సామాజికంగా, కుటుంబపరంగా కష్టాలు ఎదురైనా... వాటన్నింటినీ దాటుకుంటూ తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన ఈ అచ్చతెలుగు స్వాతంత్య్ర సమరయోధురాలు 1962 జనవరి 12న 102వ ఏట కన్నుమూశారు.
- రామోజీ విజ్ఞాన కేంద్రం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!