మళ్లీ పుస్తకాల పండగ!
సాహితీ ప్రియులను అలరించే పుస్తకాల పండగ మళ్లీ వస్తోంది. కరోనా వల్ల రెండేళ్లుగా నిలిచిపోయిన ఈ పుస్తక ప్రదర్శనను ఈ ఏడాది నిర్వహించేందుకు హైదరాబాద్ బుక్ఫెయిర్ సన్నాహాలు చేస్తోంది. 300 స్టాళ్లలో వివిధ భాషలకు చెందిన లక్షలాది పుస్తకాలు ఏటా ఇక్కడ కొలువు తీరుతాయి.
రెండేళ్ల తర్వాత హైదరాబాద్ బుక్ ఫెయిర్
డిసెంబరు 18 నుంచి 27 వరకు నిర్వహణ
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: సాహితీ ప్రియులను అలరించే పుస్తకాల పండగ మళ్లీ వస్తోంది. కరోనా వల్ల రెండేళ్లుగా నిలిచిపోయిన ఈ పుస్తక ప్రదర్శనను ఈ ఏడాది నిర్వహించేందుకు హైదరాబాద్ బుక్ఫెయిర్ సన్నాహాలు చేస్తోంది. 300 స్టాళ్లలో వివిధ భాషలకు చెందిన లక్షలాది పుస్తకాలు ఏటా ఇక్కడ కొలువు తీరుతాయి. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా డిసెంబరు 18 నుంచి 27 వరకు 34వ జాతీయ పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నట్లు హెచ్బీఎఫ్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ వెల్లడించారు. శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 12.30 నుంచి 9 గంటల దాకా, ఇతర రోజుల్లో మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 దాకా ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రదర్శనకు ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా సహకరిస్తామని తెలంగాణ సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శనివారం హెచ్బీఎఫ్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, నటుడు ఆర్.నారాయణమూర్తి మంత్రిని కలిసి.. పుస్తక ప్రదర్శనకు సహకరించాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్