మళ్లీ పుస్తకాల పండగ!

సాహితీ ప్రియులను అలరించే పుస్తకాల పండగ మళ్లీ వస్తోంది. కరోనా వల్ల రెండేళ్లుగా నిలిచిపోయిన ఈ పుస్తక ప్రదర్శనను ఈ ఏడాది నిర్వహించేందుకు హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ సన్నాహాలు చేస్తోంది. 300 స్టాళ్లలో వివిధ భాషలకు చెందిన లక్షలాది పుస్తకాలు ఏటా ఇక్కడ కొలువు తీరుతాయి.

Updated : 28 Nov 2021 04:40 IST

రెండేళ్ల తర్వాత హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌  
డిసెంబరు 18 నుంచి 27 వరకు నిర్వహణ  

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: సాహితీ ప్రియులను అలరించే పుస్తకాల పండగ మళ్లీ వస్తోంది. కరోనా వల్ల రెండేళ్లుగా నిలిచిపోయిన ఈ పుస్తక ప్రదర్శనను ఈ ఏడాది నిర్వహించేందుకు హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ సన్నాహాలు చేస్తోంది. 300 స్టాళ్లలో వివిధ భాషలకు చెందిన లక్షలాది పుస్తకాలు ఏటా ఇక్కడ కొలువు తీరుతాయి. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా డిసెంబరు 18 నుంచి 27 వరకు 34వ జాతీయ పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నట్లు హెచ్‌బీఎఫ్‌ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్‌ వెల్లడించారు. శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 12.30 నుంచి 9 గంటల దాకా, ఇతర రోజుల్లో మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 దాకా ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రదర్శనకు ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా సహకరిస్తామని తెలంగాణ సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. శనివారం హెచ్‌బీఎఫ్‌ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌, నటుడు ఆర్‌.నారాయణమూర్తి మంత్రిని కలిసి.. పుస్తక ప్రదర్శనకు సహకరించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని