వరద బాధితులకు ప్రభాస్‌ ఆపన్నహస్తం

నటనలోనే కాదు... చేయూత అందించడంలోనూ తాను బాహుబలే అని మరోసారి నిరూపించారు అగ్ర కథానాయకుడు ప్రభాస్‌. విపత్తుల, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆయన

Published : 08 Dec 2021 04:18 IST

సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం

ఈనాడు, హైదరాబాద్‌: నటనలోనే కాదు... చేయూత అందించడంలోనూ తాను బాహుబలే అని మరోసారి నిరూపించారు అగ్ర కథానాయకుడు ప్రభాస్‌. విపత్తుల, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆయన ఆపన్నహస్తం అందిస్తూ పెద్ద మనసుని చాటుతుంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ వరద బాధితుల సహాయార్థం ప్రభాస్‌ రూ.కోటి విరాళం ప్రకటించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలతో వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు కథానాయకులు విరాళాలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళం అందజేయనున్నట్టు మంగళవారం ప్రభాస్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని