Andhra News: పులివెందుల తెదేపా అభ్యర్థిని ఖరారు చేసిన చంద్రబాబు
కడపజిల్లా పులివెందుల శాసనసభ స్థానానికి వచ్చే ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా మరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి)ని పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు.
ఈనాడు, అమరావతి: కడపజిల్లా పులివెందుల శాసనసభ స్థానానికి వచ్చే ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా మరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి)ని పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. పులివెందుల నియోజకవర్గ నాయకులతో మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు అభ్యర్థిపై స్పష్టతనిచ్చారు. గత ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసి, ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ సతీష్రెడ్డి మళ్లీ పార్టీలోకి వస్తారని ప్రచారం జరుగుతోందని కొందరు నేతలు ప్రస్తావించారు. ఎవరు వచ్చినా రాబోయే ఎన్నికల్లో అక్కడ బీటెక్ రవి పోటీచేస్తారని చంద్రబాబు స్పష్టం చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బీటెక్ రవి పులివెందుల ఇన్ఛార్జిగానూ కొనసాగుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం