కాపులంతా పవన్‌ అంటుంటే.. ఆయన చంద్రబాబు అంటున్నారు: మంత్రి అంబటి

‘మా కాపులందరూ పవన్‌ కల్యాణ్‌.. పవన్‌ కల్యాణ్‌ అని అంటున్నారు.. ఆయనేమో చంద్రబాబు అంటున్నారు’ అని జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

Updated : 12 May 2022 07:34 IST

గోళ్లపాడు (ముప్పాళ్ల), న్యూస్‌టుడే: ‘మా కాపులందరూ పవన్‌ కల్యాణ్‌.. పవన్‌ కల్యాణ్‌ అని అంటున్నారు.. ఆయనేమో చంద్రబాబు అంటున్నారు’ అని జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో బుధవారం నిర్వహించిన ‘గడపకు గడపకు మన ప్రభుత్వం’ సభలో ఆయన మాట్లాడారు. ‘వెంటనే తాను సీఎం కావాలని.. క్విట్‌ జగన్‌ అని చంద్రబాబు అంటున్నారు. ఆయన ప్రజలకు మేలు.. సేవ చేసి ప్రధానమంత్రిగా కూర్చున్నా మాకు అభ్యంతరం లేదు. పవన్‌ కల్యాణ్‌, సీపీఐ, భాజపాల మెడలపై కూర్చుని అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రజాదరణ, విశ్వాసంతో సింహంలా జగన్‌మోహన్‌రెడ్డి ఒంటరిగా ఎన్నికలకు సిద్ధమయ్యారు. మూడేళ్లలో ప్రభుత్వం ప్రజలకు 1.39 లక్షల కోట్ల లబ్ధి చేకూర్చింది. రానున్న రెండేళ్లలో మరో రూ.లక్ష కోట్లు అందించనుంది’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని