కాపులంతా పవన్ అంటుంటే.. ఆయన చంద్రబాబు అంటున్నారు: మంత్రి అంబటి
‘మా కాపులందరూ పవన్ కల్యాణ్.. పవన్ కల్యాణ్ అని అంటున్నారు.. ఆయనేమో చంద్రబాబు అంటున్నారు’ అని జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
గోళ్లపాడు (ముప్పాళ్ల), న్యూస్టుడే: ‘మా కాపులందరూ పవన్ కల్యాణ్.. పవన్ కల్యాణ్ అని అంటున్నారు.. ఆయనేమో చంద్రబాబు అంటున్నారు’ అని జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో బుధవారం నిర్వహించిన ‘గడపకు గడపకు మన ప్రభుత్వం’ సభలో ఆయన మాట్లాడారు. ‘వెంటనే తాను సీఎం కావాలని.. క్విట్ జగన్ అని చంద్రబాబు అంటున్నారు. ఆయన ప్రజలకు మేలు.. సేవ చేసి ప్రధానమంత్రిగా కూర్చున్నా మాకు అభ్యంతరం లేదు. పవన్ కల్యాణ్, సీపీఐ, భాజపాల మెడలపై కూర్చుని అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ప్రజాదరణ, విశ్వాసంతో సింహంలా జగన్మోహన్రెడ్డి ఒంటరిగా ఎన్నికలకు సిద్ధమయ్యారు. మూడేళ్లలో ప్రభుత్వం ప్రజలకు 1.39 లక్షల కోట్ల లబ్ధి చేకూర్చింది. రానున్న రెండేళ్లలో మరో రూ.లక్ష కోట్లు అందించనుంది’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం