OTS: సచివాలయాల ఉద్యోగుల మెడపై ఓటీఎస్‌ కత్తి

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారుపై కలెక్టర్లు కసరత్తు ప్రారంభించారు. ప్రత్యేకించి పేదల గృహాల క్రమబద్ధీకరణకు ఉద్దేశించిన ఏకకాల పరిష్కారం (ఓటీఎస్‌) కోసం

Updated : 29 Jun 2022 07:01 IST

ప్రొబేషన్‌ ఖరారు చేసేందుకు వడపోత ప్రారంభించిన కలెక్టర్లు

ఈనాడు, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారుపై కలెక్టర్లు కసరత్తు ప్రారంభించారు. ప్రత్యేకించి పేదల గృహాల క్రమబద్ధీకరణకు ఉద్దేశించిన ఏకకాల పరిష్కారం (ఓటీఎస్‌) కోసం వసూలు చేసి జమ చేయని కోట్లాది రూపాయలపై ఆరా తీస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలశాఖ రాష్ట్ర కార్యాలయం నుంచి జిల్లాలకు వెళ్లిన సమాచారం ఆధారంగా కలెక్టర్లు ఆ ఉద్యోగులతో లెక్కలు తేల్చే పనిలో పడ్డారు. ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి జమ చేయని ఉద్యోగుల ప్రొబేషన్‌ నిలిపివేయాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ను నెలాఖరులోగా ఖరారు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండేళ్ల సర్వీసు పూర్తవ్వని, పూర్తయినా శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వని ఉద్యోగులను ప్రొబేషన్‌కు ఎలాగూ దూరంగా పెట్టనున్నారు. ఓటీఎస్‌ బకాయిలపైనా లెక్కలు తేల్చని ఉద్యోగులను పక్కన పెట్టి మిగిలిన వారికి ప్రొబేషన్‌ను ఖరారు చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఓటీఎస్‌ వ్యవహారాన్ని మెడపై కత్తిలా వేలాడదీయడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని