Rakesh Jhunjhunwala: ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
బిగ్బుల్ దివంగత రాకేశ్ ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటన్ షేరు ఒక్క రోజులో రూ. వందల కోట్ల నష్టాన్ని తీసుకొచ్చింది.
ఇంటర్నెట్డెస్క్: భారత మార్కెట్లో బిగ్బుల్గా పేరున్న దివంగత రాకేశ్ ఝున్ఝున్వాలా(Rakesh Jhunjhunwala)ను సంపన్నుడిగా మార్చిన షేర్లలో టైటాన్ కూడా ఒకటని పరిశీలకులు చెబుతారు. అదే షేరు సోమవారం ఆ కుటుంబానికి భారీ నష్టాన్ని మిగిల్చింది.
టాటా గ్రూప్నకు చెందిన టైటాన్ కంపెనీ సోమవారం మార్చి త్రైమాసిక ఫలితాలు నిరాశపర్చాయి. షేరు ఒక దశలో 7.87% నష్టపోయి రూ.3,257.05కు చేరింది. చివరకు 7.18% కోల్పోయి రూ.3,281.65 దగ్గర స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.22,527.56 కోట్లు పతనమై రూ.2.91 లక్షల కోట్లకు చేరింది. ఈ కంపెనీలో రాకేశ్ సతీమణి రేఖా ఝున్ఝున్వాలాకు దాదాపు 5.35 శాతం వాటాలున్నాయి. వీటి విలువ రూ.16,792 కోట్లు. తాజాగా విలువ పతనంతో వీటి విలువ రూ.15,986 కోట్లకు చేరింది. దీంతో వీరి కుటుంబం రూ.806 కోట్ల నష్టాన్ని మూటగట్టుకొన్నట్లైంది.
2002-2003లో రాకేశ్ ఒక్కో షేరును సగటున రూ.3 దగ్గర కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆ షేరు విలువ ఎక్కడా తగ్గలేదు. కొన్ని వందల రెట్లు పెరిగింది. ఆయన మరణం వేళకు ఈ కంపెనీలో ఆయన కుటుంబ వాటా దాదాపు 5శాతం పైగానే ఉంది. చాలా ఇంటర్వ్యూల్లో కూడా టైటాన్ షేర్పై ఆయన తనకు ఉన్న ప్రేమను దాచుకొనేవారు కాదు. తనకు బాగా కలిసొచ్చిన స్టాక్గా దానిని అభివర్ణించేవారు. ఇక రాకేశ్ సతీమణి రేఖా ఈ ఏడాది మార్చిలో వార్తల్లో నిలిచారు. తమ బంగ్లా నుంచి సముద్రాన్ని వీక్షించేందుకు అడ్డం రావచ్చనే అనుమానంతో ఏకంగా తొమ్మిది ప్లాట్లను రూ.118 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ఫలితంగా ఆ ఫ్లాట్ల పునర్నిర్మాణ ప్రక్రియను షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వాయిదా వేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
Tecno: టెక్నో కెమన్ సిరీస్లో రెండు కొత్త మొబైల్స్ను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేద్దాం.. -
‘3 ఇడియట్స్’ సీన్తో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా..
Sundar Pichai: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత వినియోగం పెరుగుతున్న తరుణంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సలహా అందించారు. -
ప్రత్యేక ట్రేడింగ్ సెషన్.. సెన్సెక్స్ 88+, నిఫ్టీ @ 22,500
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం కొంతసేపు పనిచేశాయి. ఈ ప్రత్యేక సెషన్లో సూచీలు లాభపడ్డాయి. -
నవ లిమిటెడ్.. రుణ రహితం
ఫెర్రో అల్లాయ్స్, మైనింగ్, విద్యుదుత్పత్తిలో నిమగ్నమై ఉన్న నవ లిమిటెడ్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.951.6 కోట్ల ఆదాయాన్ని, రూ.255.1 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
వసూళ్లు 27%.. వదులుకుంది 73%
నిరర్థక ఆస్తులుగా మారిన రుణాల నుంచి వసూళ్లకు చేపట్టిన దివాలా పరిష్కార ప్రక్రియ, ఆర్థిక సంస్థలకు ఎంతగా ఉపయోగ పడుతోందో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. -
నలుపు రంగులో అపాచీ ఆర్టీఆర్ 160
టీవీఎస్ మోటార్ తన ‘అపాచీ 160 ఆర్టీఆర్’ బైక్లో బ్లాక్ డార్క్ ఎడిషన్ (నలుపు రంగు)ను తీసుకొచ్చింది. -
టీవీ ఛానళ్లతో పాటు ఓటీటీ ప్రసారాలూ.. స్మార్ట్ ప్లస్ను ఆవిష్కరించిన డిష్ టీవీ
టీవీ ఛానళ్లతోపాటు, ఓటీటీ ప్రసారాలూ అందించే స్మార్ట్ ప్లస్ సేవలు ప్రారంభిస్తున్నట్లు డైరెక్ట్-టు-హోమ్ సేవలను అందించే డిష్ టీవీ ప్రకటించింది. -
2031కి రిటైల్ విపణి రెట్టింపు
భారత వినియోగ వస్తు- సేవల విపణి 2031 కల్లా రెట్టింపు కావొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. -
మదుపర్ల సంపద రూ.410 లక్షల కోట్లకు
వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీ లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. అయితే విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగడంతో లాభాలు పరిమితమయ్యాయి. -
ప్రస్తుత కంపెనీలకూ ప్రోత్సాహకాలు!
విద్యుత్ వాహన (ఈవీ) నూతన విధానాన్ని అనుసరించి, పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న సంస్థలకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. -
విదేశీ ఫండ్ల ఆస్తుల్లో 20% వరకే మన మార్కెట్లకు! : సెబీ ప్రతిపాదన
మ్యూచువల్ ఫండ్లలో విదేశీ పెట్టుబడులను మరింత సులభతరం చేసే దిశగా మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కొన్ని చర్యలను ప్రతిపాదించింది. -
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
కారు కొంటే బీమా - నిర్వహణ ఖర్చుల వంటివి తప్పవు. మరో కొత్త మోడల్ కొనుగోలుకు పాత కారు విక్రయించాలంటే తగిన ధర వస్తుందో రాదో అనే బెంగ ఒకటి. -
సంక్షిప్త వార్తలు(5)
కేన్సర్ వ్యాధి చికిత్సలో వినియోగించే కాబోజాంటినిబ్ ట్యాబ్లెట్లను హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఉత్పత్తి చేసి, జైడస్ లైఫ్సైన్సెస్కు సరఫరా చేయనుంది. -
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
Apple: దివ్యాంగులు కూడా ఐఫోన్, ఐప్యాడ్లను సులువుగా వినియోగించేందుకు వీలుగా యాపిల్ కొత్త ఫీచర్లును త్వరలోనే తీసుకురానున్నట్లు వెల్లడించింది. -
ఆరోగ్యకరమైన ఆహారం.. జొమాటోలో కొత్త ఫీచర్
Zomato: జొమాటోలో కొత్త ఫీచర్ని తీసుకొచ్చినట్లు కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఇంతకీ ఆ ఫీచర్ ఎలా ఉపయోగపడనుందంటే..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం
-
చైనా సైబర్ ముఠా చేతిలో ఏపీ వాసులు.. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల మోసం