SS Rajamouli: ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
ఇంకా చాలా వేదికల ద్వారా ‘బాహుబలి’ని తీసుకొస్తామని అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు.
హైదరాబాద్: ‘బాహుబలి’ ప్రపంచాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో యానిమేషన్ సిరీస్ను తీసుకొస్తున్నామని అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli) అన్నారు. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ (Baahubali: Crown of Blood) పేరుతో డిస్నీ+హాట్స్టార్ వేదికగా మే 17వ తేదీ నుంచి ఈ యానిమేషన్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈక్రమంలో హైదరాబాద్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళితో పాటు, నిర్మాత శోభు యార్లగడ్డ, హెడ్ కంటెంట్ డిస్నీ+హాట్ స్టార్ గౌరవ్ బెనర్జీ, గ్రాఫిక్ ఇండియా సీఈవో శరత్ దేవరాజన్, నటుడు శరద్ ఖేల్కర్లు పాల్గొన్నారు.
అందరినీ అలరిస్తుంది..
ఈసందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. యానిమేషన్ సిరీస్ గురించి అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘బాహుబలి’ని ముందుకుతీసుకెళ్లే బాధ్యతను వేరొకరికి అప్పగించడం కఠినమైన నిర్ణయం. ఆ సినిమా తీసేటప్పుడే అనేక మార్గాల్లో బాహుబలి ప్రపంచాన్ని ఆవిష్కరించాలనుకున్నాం. సరైన సమయంలో సరైన వ్యక్తులు, టీమ్ మాకు దొరికింది. యానిమేషన్ సిరీస్ గురించి వాళ్లు మాతో పంచుకున్న ఆలోచనలు అద్భుతంగా ఉన్నాయి. పిల్లలనే కాదు, అందరినీ అలరించేలా యానిమేషన్ సిరీస్ తీయొచ్చని వివరించారు. ఈ ఫార్మాట్లో సిరీస్ చేయాలనుకున్నప్పుడు మరోసారి ‘బాహుబలి’ మొత్తాన్ని సమీక్షించాం. పాత్రలు, వాటి మధ్య సంఘర్షణ ఇలా అనేక అంశాలను పరిశీలించాం. బాహుబలి ప్రపంచాన్ని వేరే వేదిక ద్వారా తీసుకొస్తున్నప్పుడు కథను ఎన్ని రకాలుగానైనా రాయొచ్చు. కానీ, ఆత్మ మాత్రం చెడిపోకుండా చూడాలి. ఆ పాత్రలపై నాకున్న ప్రేమను వాళ్లు అర్థం చేసుకున్నారు. స్టోరీ, పాత్రలు చాలా చక్కగా క్రియేట్ చేశారు. అది చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది’’
థియేటర్లో ‘బాహుబలి’ చూసింది 10 కోట్ల మందే!
‘‘బాహుబలి’ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దేశంలో 140 కోట్ల మంది ప్రజలుంటే, 120 కోట్ల మంది సినిమాలు చూస్తారనుకుందాం. కానీ, బాహుబలిని థియేటర్లో చూసింది దాదాపు 10 కోట్ల మంది మాత్రమే. అంటే 10 కోట్ల టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దానర్థం 110 కోట్ల మంది థియేటర్లో చూడలేదు. బహుశా, టెలివిజన్, ఓటీటీలో చూసి ఉంటారు. ప్రతిఒక్కరూ సినిమాను ఏదో ఒక మాధ్యమం ద్వారా చూస్తారు. కథలు చూసే విధానం ఒక్కొక్కరికీ ఒక్కోలా నచ్చుతుంది. అందరూ రెగ్యులర్ సినిమాలు మాత్రమే చూడరు. కేవలం యానిమేషన్ మూవీలను మాత్రమే ఆస్వాదించేవాళ్లూ ఉంటారు. ఆ ఆలోచనతోనే బాహుబలి ఈ మాధ్యమం ద్వారా తీసుకొస్తున్నాం. సినిమా తీయాలంటే చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. డైలాగ్స్, ఫైట్స్, పాటలు ఇలా ఆలోచలన్నీ దాని చుట్టూనే ఉంటాయి. కానీ, యానిమేషన్లో అది వర్కవుట్ కాదు. సీజన్లు చూసే కొద్దీ మీరు యానిమేషన్ సిరీస్కు కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా బాహుబలి, కట్టప్ప పోటీ పడే సీన్స్ అలరిస్తాయి. ఇది బాహుబలి ప్రీక్వెల్ కాదు. సీక్వెల్ కాదు. బాహుబలి కథ మధ్యలో ఏం జరిగిందా? అన్నది మీరు చూస్తారు. సినిమాలో కొన్ని చోట్ల కథను పెంచే అవకాశం ఉంటుంది. కానీ, నిడివి, ఇతర కారణాల వల్ల అది తెరపై చూపించలేం. ఆ మధ్యలో ఏం జరిగిందా? అన్న దానిని ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’లో చూపించబోతున్నాం’’
వాళ్లూ ధోనీ అభిమానులై ఉంటారు
‘‘యానిమేషన్ సిరీస్లో ‘బాహుబలి’ పాత్రలో ధోనీ పోలికలు కనిపిస్తున్నాయని అన్నారు. అది కావాలని చేయలేదు. క్రియేట్ చేసిన వాళ్లు నాలాగా ధోనీ అభిమానులై ఉంటారు (నవ్వులు) మన కథ మరింత ముందుకు వెళ్లాంటే, దానిపై మనకున్న ఈగోను, ప్రేమను తగ్గించుకోవాలి. అన్నీ మనమే చేయలేం కదా. అందుకే ఆలోచించి తీసుకున్న నిర్ణయమే. డబ్బింగ్, దర్శకత్వం, కథా రచనను క్రియేటర్స్ సృజన మేరకు వదిలేయాలి. కథలోని ఆత్మ తప్ప ఇతర విషయాలను పట్టించుకోకూడదు’’
పూర్తి యానిమేషన్ మూవీ చేయాలని ఉంది
‘‘హాలీవుడ్ దర్శకుల్లా నాకూ యానిమేషన్ మూవీ చేయాలని ఉంది. ‘ఈగ’ అందులోని భాగమే. భవిష్యత్లో చేసే అవకాశం వచ్చినప్పుడు ఈ సిరీస్ ద్వారా నేర్చుకున్న అంశాలు నాకు కచ్చితంగా ఉపయోగపడతాయి. నన్ను నేను ఎప్పుడూ ఆకాశమంత ఎత్తులో చూపుకోను. అలాగే తక్కువ చేసి చూసుకోను. నా నుంచి ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే, అందరూ దానికోసమే ఎదురుచూస్తున్నారని నేను భావించను. అదే సమయంలో నా సినిమా కోసం ఎవరు ఎదురు చూస్తారు? అని అనుకోను. నేను చేయబోయే ఏ ప్రాజెక్ట్ అయినా, కొత్త ఆడియన్స్కు ఎలా దగ్గర చేయాలా? అన్నది ఆలోచిస్తా. ‘బాహుబలి’ విషయంలో ఇలాగే ఆలోచించాం. ఆ సినిమా ప్రచారానికి కొత్త మార్గాలను అన్వేషించాం. డిజిటల్ పోస్టర్లు, పాత్రల పరిచయం, మేకింగ్ వీడియోలు ఇలా ప్రతీ మార్గంలోనూ ప్రయాణించాం. ఇప్పుడు కూడా యానిమేషన్తో వస్తున్నాం. ఇదొక్కటే కాదు, ఇంకా చాలా వేదికల ద్వారా ‘బాహుబలి’ని తీసుకొస్తాం’’ అని రాజమౌళి అన్నారు.
ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన బాహుబలి పాత్రలతో యానిమేషన్ సిరీస్ చేయడం చాలా రిస్క్ అయినా, ‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్’ ఇచ్చిన ధైర్యంతో కథలను చెప్పేందుకు కొత్త వేదికను తీసుకొచ్చామని గ్రాఫిక్ ఇండియా సీఈవో శరత్ దేవ రాజన్ అన్నారు. ‘‘బాహుబలి ప్రపంచం చాలా పెద్దది. వాటిలో సినిమా ఒక భాగం మాత్రమే. గేమ్స్, బుక్స్, యానిమేషన్ ఇలా చాలా ఫ్రాంఛైజీలు ఉన్నాయి. పెద్దలకూ నచ్చేలా యానిమేషన్ చిత్రాలను బాహుబలి ఫిల్మ్స్ను తీసుకొస్తున్నాం. డిస్నీ+హాట్స్టార్ ఇందులో భాగస్వామ్యం అవడం సంతోషంగా ఉంది’ అని చెప్పారు నిర్మాత శోభూ యార్లగడ్డ, హిందీలో ‘బాహుబలి’ పాత్రకు డబ్బింగ్ చెప్పడం చాలా సంతోషంగా ఉందని నటుడు శరత్ ఖేల్కర్ సంతోషం వ్యక్తంచేశారు. భారతీయ కథలు యానిమేషన్ చేయడం ఒక విప్లవాత్మక మార్పు అని హెడ్ కంటెంట్ డిస్నీ+హాట్ స్టార్ గౌరవ్ బెనర్జీ అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ప్రసన్నవదనం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
సుహాస్ హీరోగా నటించిన చిత్రం ‘ప్రసన్నవదనం’. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. -
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
‘కృష్ణమ్మ’ సినిమా సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఈటీవీ విన్’లో ‘మాయా పేటిక’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పాయల్ రాజ్పుత్, సిమ్రత్ కౌర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ‘మాయా పేటిక’ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్’లో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. -
ఓటీటీలోకి ‘షరతులు వర్తిస్తాయి!’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘షరతులు వర్తిస్తాయి!’ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఏ ఓటీటీలో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే? -
‘విద్యా వాసుల అహం’ నేరుగా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
‘విద్యా వాసుల అహం’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఎప్పుడంటే? -
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
విక్కీ కౌశల్, సారా అలీఖాన్ కీలక పాత్రల్లో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ‘జర హట్కే జర బచ్కే’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ రిలీజ్.. రాజమౌళి ప్రత్యేక సందేశం
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ రిలీజ్ సందర్భంగా రాజమౌళి ప్రత్యేక సందేశమిచ్చారు. -
ఓటీటీలో ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అదాశర్మ కీలక పాత్రలో నటించిన ‘బస్తర్’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
టాప్ 5 మలయాళీ చిత్రాలు.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?
2024లో వరుస హిట్స్తో మలయాళ చిత్ర పరిశ్రమ కళకళలాడిపోతోంది. కేవలం హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కూడా కురిపిస్తోంది. ఈ ఏడాది విడుదలైన పలు చిత్రాలు రూ.100 కోట్ల క్లబ్లోనూ చేరాయి. ఇప్పటివరకూ ఓటీటీలో విడుదలై విశేష ఆదరణ సొంతం చేసుకున్న టాప్-5 మలయాళీ చిత్రాలేంటో చూసేయండి. -
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జీతూ మాధవన్ దర్శకత్వంలో ఫహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్ సినీ ప్రియులకు శుభవార్త చెప్పింది. -
నేరుగా ఓటీటీలోకి వరుణ్ సందేష్ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరుణ్ సందేష్ నటించని క్రైమ్ సస్పెన్స్ డ్రామా ‘చిత్రం చూడర’ నేరుగా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
త్రిగుణ్ కీలక పాత్రలో నటించిన ‘లైన్ మ్యాన్’ మూవీ ప్రస్తుతం తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది -
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
మాధవన్ నెగెటివ్ షేడ్స్లో నటించిన ‘షైతాన్’ ఓటీటీలోకి రానుంది. -
‘పంచాయత్ సీజన్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
‘పంచాయత్ సీజన్ 3’ వెబ్సిరీస్ విడుదల తేదీ ఖరారైంది. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందంటే? -
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. -
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కొత్తదనం నిండిన రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
మమితా బైజు నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ప్రణయ విలాసం’. ఈటీవీ విన్ వేదికగా ఇది ప్రసారం కానుంది.
తాజా వార్తలు (Latest News)
-
18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్కు ముందు అనుకున్న హీరోలేవంటే?
-
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?
-
జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు
-
మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను వినను: అధిర్ రంజన్
-
యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం
-
మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!