Top 5 Mollywood Movies: టాప్ 5 మలయాళీ చిత్రాలు.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?
2024లో వరుస హిట్స్తో మలయాళ చిత్ర పరిశ్రమ కళకళలాడిపోతోంది. కేవలం హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కూడా కురిపిస్తోంది. ఈ ఏడాది విడుదలైన పలు చిత్రాలు రూ.100 కోట్ల క్లబ్లోనూ చేరాయి. ఇప్పటివరకూ ఓటీటీలో విడుదలై విశేష ఆదరణ సొంతం చేసుకున్న టాప్-5 మలయాళీ చిత్రాలేంటో చూసేయండి.
అదరగొట్టిన అబ్రహాం ఓజ్లర్
జయరామ్, మమ్ముట్టి కీలక పాత్రలో మిధున్ మాన్యువల్ థామస్ దర్శకత్వంలో వచ్చిన క్రైమ్, మిస్టరీ థ్రిల్లర్ ‘అబ్రహం ఓజ్లర్. ఆస్పత్రిలో జరిగే వరుస హత్యలను పోలీస్ ఆఫీసర్ అయిన అబ్రహాం ఓజ్లర్ (జయరామ్) ఎలా ఛేదించాడన్న ఆసక్తికర కథాంశంతో రూపొందింది. మమ్ముట్టి అతిథి పాత్రలో తళుక్కున మెరిశారు. అతి తక్కువ బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.45 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం డిస్నీ+హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. పూర్తి రివ్యూ కోసం క్లిక్ చేయండి
ఆసక్తికరంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జానర్లో వచ్చిన మరో మలయాళీ చిత్రం ‘అన్వేషిప్పిమ్ కండెతుమ్’. టొవినో థామస్, సిద్ధిఖీ తదితరులు నటించిన ఈ మూవీని డార్విన్ కురియకోస్ తెరకెక్కించారు. వేర్వేరు ప్రాంతాల్లో చనిపోయిన యువతుల హత్య కేసును విచారించించే క్రమంలో ఎస్సై ఆనంద్ నారాయణన్ (టొవినో థామస్) ఎదురైన పరిస్థితులను దర్శకుడు ఉత్కంఠగా చూపించాడు. రూ.8 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం కూడా రూ.40 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. పూర్తి రివ్యూ కోసం క్లిక్చేయండి
యువ హృదయాలను కొల్లగొట్టిన ప్రేమలు
ఫీల్గుడ్ మూవీగా మలయాళంలో విడుదలై ఘన విజయాన్ని నమోదు చేసిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘ప్రేమలు’. నాస్లన్, మమితబైజు, అల్తాఫ్లు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీని గిరీష్ ఏడీ రూపొందించారు. తెలుగులోనూ అదే పేరుతో విడుదలైన ఈ చిత్రం ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.136 కోట్లు వసూలు చేసింది. గేట్ కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన సచిన్ సంతోష్ (నాస్లెన్ కె.గఫూర్), రీనూ (మమిత బైజు)ను చూసి ప్రేమలో పడతాడు. మరి సచిన్ ప్రేమను రీనూ అంగీకరించిందా? లేదా? అన్నది చిత్ర కథ. తెలుగు వెర్షన్ ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. పూర్తి రివ్యూ కోసం క్లిక్ చేయండి
ఉత్కంఠతో ఊపేసిన ‘భ్రమయుగం’
మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మరో వైవిధ్య చిత్రం ‘భ్రమయుగం’. మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తేవన్ అనే గాయకుడు అడవిలో దారితప్పి కుడుమోన్ పొట్టి (మమ్ముట్టి) ఇంటికి వెళ్తాడు. అతిథిగా అక్కడికి వెళ్లిన అతనికి కొద్ది రోజులకే తాను అక్కడ బందీ అయినట్లు అర్థమవుతుంది. మరి ఆ భవనం నుంచి తేవన్ ఎలా తప్పించుకున్నాడు? ఇంతకీ కుడ్మోన్ పొట్టి కథేంటి? అన్నది దర్శకుడు రాహుల్ సదా శివన్ ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ఫుల్ రన్లో ఈ మూవీ రూ.80 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం ఇది సోనీలివ్లో స్ట్రీమింగ్ అవుతోంది. పూర్తి రివ్యూ కోసం క్లిక్ చేయండి
మలయాళ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు
అడ్వెంచర్, సర్వైవల్ థ్రిల్లర్గా తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించడమే కాకుండా, మలయాళ చిత్ర పరిశ్రమ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా నిలిచింది ‘మంజుమ్మెల్ బాయ్స్’. చిదంబరం దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బసి తదితరులు నటించారు. విహారయాత్రకు వెళ్లిన స్నేహితుల్లో ఒకరికి ప్రమాదం జరిగి ఇరుకైన గుహలో పడిపోతాడు. అతడిని ఎలా కాపాడారన్న ఇతివృత్తంతో ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటివరకూ ఈ మూవీ రూ.240 కోట్లు వసూలుచేసింది. ప్రస్తుతం డిస్నీ+హాట్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. పూర్తి రివ్యూ కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ప్రసన్నవదనం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
సుహాస్ హీరోగా నటించిన చిత్రం ‘ప్రసన్నవదనం’. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. -
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
‘కృష్ణమ్మ’ సినిమా సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఈటీవీ విన్’లో ‘మాయా పేటిక’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పాయల్ రాజ్పుత్, సిమ్రత్ కౌర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ‘మాయా పేటిక’ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్’లో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. -
ఓటీటీలోకి ‘షరతులు వర్తిస్తాయి!’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘షరతులు వర్తిస్తాయి!’ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఏ ఓటీటీలో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే? -
‘విద్యా వాసుల అహం’ నేరుగా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
‘విద్యా వాసుల అహం’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఎప్పుడంటే? -
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
విక్కీ కౌశల్, సారా అలీఖాన్ కీలక పాత్రల్లో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ‘జర హట్కే జర బచ్కే’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ రిలీజ్.. రాజమౌళి ప్రత్యేక సందేశం
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ రిలీజ్ సందర్భంగా రాజమౌళి ప్రత్యేక సందేశమిచ్చారు. -
ఓటీటీలో ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అదాశర్మ కీలక పాత్రలో నటించిన ‘బస్తర్’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
ఇంకా చాలా వేదికల ద్వారా ‘బాహుబలి’ని తీసుకొస్తామని అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు. -
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జీతూ మాధవన్ దర్శకత్వంలో ఫహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్ సినీ ప్రియులకు శుభవార్త చెప్పింది. -
నేరుగా ఓటీటీలోకి వరుణ్ సందేష్ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరుణ్ సందేష్ నటించని క్రైమ్ సస్పెన్స్ డ్రామా ‘చిత్రం చూడర’ నేరుగా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
త్రిగుణ్ కీలక పాత్రలో నటించిన ‘లైన్ మ్యాన్’ మూవీ ప్రస్తుతం తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది -
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
మాధవన్ నెగెటివ్ షేడ్స్లో నటించిన ‘షైతాన్’ ఓటీటీలోకి రానుంది. -
‘పంచాయత్ సీజన్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
‘పంచాయత్ సీజన్ 3’ వెబ్సిరీస్ విడుదల తేదీ ఖరారైంది. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందంటే? -
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. -
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కొత్తదనం నిండిన రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. -
ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
మమితా బైజు నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ప్రణయ విలాసం’. ఈటీవీ విన్ వేదికగా ఇది ప్రసారం కానుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
-
రాజస్థాన్, కోల్కతా మ్యాచ్కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్కు లాభం..
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు అప్రజాస్వామికం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి