Rain: హైదరాబాద్లో భారీ వర్షం.. పలు చోట్ల ట్రాఫిక్ జామ్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షం పడింది.
ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్ నగరంలో పలుచోట్ల మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు వరుణిడి రాక ఉపశమనం కలిగించింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో వేసవి తాపం నుంచి ప్రజలకు ఊరట కలిగింది. దాదాపు గంట సేపు వర్షం కురవడంతో రహదారులు జలమయం కాగా, డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. పలు చోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్, మారేడుపల్లి, చిలకలగూడ, బోయిన్పల్లి, ఆల్వాల్, ప్యారడైజ్, ప్యాట్నీ, ఎల్బీనగర్, కాప్రా, సుచిత్ర జీడిమెట్ల, మలక్పేట, ఎర్రగడ్డ, అమీర్పేట, యూసఫ్గూడ, ముషీరాబాద్, చిక్కడపల్లి తదితర ప్రాంతాల్లో రోడ్లపైకి వరదనీరు చేరింది.
మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపూర్లో రోడ్లపై భారీగా వర్షం నీరు చేరడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. రాయదుర్గం బయోడైవర్సిటీ నుంచి ఐకీయా వరకు, ఖాజాగూడ చౌరస్తా నుంచి డీపీఎస్ వరకు వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఐటీ కారిడార్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పలు చోట్ల చెట్లు విరిగి పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం, ఈదురు గాలుల వల్ల పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో..
తెలంగాణలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, ములుగు జిల్లాలో పలు చోట్ల ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానుకొండూర్, హుజూరాబాద్, పెద్దపల్లి, మల్యాల, పెగడపల్లి, వేములవాడలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట, ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
కరీంనగర్లో కూలిన టెంట్లు.. సీఎం సభ వాయిదా
సీఎం రేవంత్రెడ్డి పాల్గొనాల్సిన కాంగ్రెస్ జనజాతర సభకోసం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన టెంట్లు కుప్పకూలాయి. ఈదురుగాలుల ధాటికి కుర్చీలు చెల్లాచెదురయ్యాయి. ఆ సమయంలో టెంట్ల కింద కార్యకర్తలు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వర్షం కారణంగా సీఎం సభ వాయిదా పడింది.
అకాల వర్షాలపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష
తెలంగాణలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. మున్సిపల్, పోలీసు, విద్యుత్ అధికారులతో సమీక్షించారు. వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ స్తంభాలు కూలిన చోట తక్షణం పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సహాయక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో రహదారులపై నిలిచిన నీటిని తక్షణమే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్రమైన శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. -
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు ఎన్నికల సంఘం(ఈసీ) షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. -
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
జిల్లాలోని చంద్రగిరి మండలం కూచువారిపల్లిలో సిట్ విచారణ చేపట్టింది. వైకాపా అభ్యర్థి మోహిత్రెడ్డి గన్మెన్ ఈశ్వర్, గ్రామస్థులను అధికారులు విచారించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు
గత ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) (AB Venkateswara Rao)కు పౌరసమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది -
యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం
ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. -
నరసరావుపేటలో ‘సిట్’ దర్యాప్తు.. హింసాత్మక ఘటనలపై ఆరా
స్థానిక ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో సిట్ బృందం దర్యాప్తు చేసింది. ఇందులో భాగంగా అల్లర్లకు సంబంధించిన వీడియోలను అధికారులు పరిశీలించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 3కి.మీ మేర బారులు
శ్రీవారి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం కూడా కొనసాగుతోంది. భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు, నిండిపోయాయి. -
ఇసుకపై.. డేగకన్ను
ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలో గనుల శాఖ అధికారులు తనిఖీలకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు చూసీచూడనట్లు వ్యవహరించిన వారంతా గత రెండు రోజులుగా రేవులను పరిశీలించే పనిలో పడ్డారు. -
వంగిపోయారా? లొంగిపోయారా?
ఎన్నికల పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తున్న తరుణంలో ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ తమ శాఖ ప్రక్షాళనపై దృష్టి సారించారు. ఎన్నికల సంఘం దృష్టి సారించక ముందే బాధ్యులపై చర్యలకు కసరత్తు ప్రారంభించారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు