Delhi vs Rajasthan: సంజు శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్పై దిల్లీ విజయం
ఐపీఎల్-2024లో భాగంగా రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో దిల్లీ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.
దిల్లీ: రాజస్థాన్తో జరిగిన కీలక పోరులో దిల్లీ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్లు అభిషేక్ పోరెల్ (65: 36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లు), జేక్ ఫ్రేజర్ (50: 20 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లు) చెలరేగారు. చివర్లో స్టబ్స్ (41: 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లు తీయగా, చాహల్, బౌల్ట్, సందీప్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం 222 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులకు పరిమితం అయింది. కెప్టెన్ సంజు శాంసన్ (86: 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లు) విధ్వంసం సృష్టించినప్పటికీ కీలక సమయంలో ఔట్ కావడంతో రాజస్థాన్ ఓటమి పాలైంది. రియాన్ పరాగ్ (27), శుభమ్ దూబె (25) పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీయగా, రసిఖ్ దర్ సలాం, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
సంజు శాంసన్ ఒంటరి పోరు..
దిల్లీ నిర్దేశించిన 222 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్కు తొలి ఓవర్లోనే షాక్ తగలింది. ఖలీల్ వేసిన రెండో బంతికి అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చి యశస్వీ జైస్వాల్ వెనుదిరిగాడు. వన్డౌన్ బ్యాటర్గా క్రీజులోకి అడుగుపెట్టిన శాంసన్ ఖలీల్ వేసిన మూడో ఓవర్లో ఉగ్రరూపం దాల్చాడు. ఒక సిక్స్, రెండు ఫోర్లు కొట్టి నెమ్మదిగా సాగుతున్న ఇన్నింగ్స్కు ఒక్కసారిగా ఊపు తెచ్చాడు. ఇషాంత్ వేసిన నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్, ముకేశ్ వేసిన ఐదో ఓవర్లో వరుసగా ఒక సిక్స్, రెండు ఫోర్లు కొట్టాడు. దీంతో రెండు ఓవర్లకు 9 పరుగులుగా ఉన్న స్కోర్.. శాంసన్ వీరవిహారానికి ఐదు ఓవర్లకు 57 పరుగులకు చేరింది. అక్షర్ వేసిన ఆరో ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టి ఊపుమీదున్న బట్లర్ (19) బౌల్డ్ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా రాజస్థాన్ బ్యాటింగ్ నెమ్మదించింది. 10 ఓవర్లకు ఆజట్టు 2 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. 11వ ఓవర్లో రసిఖ్ బౌలింగ్లో రియాన్ పరాగ్ బౌల్డయ్యాడు. రసిఖ్ వేసిన 13వ ఓవర్లో శాంసన్ మళ్లీ రెచ్చిపోయాడు. వరుసగా 6, 4, 6 కొట్టడంతో ఈ ఓవర్లో మొత్తం 18 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ఓవర్లో సంజూ ఒక ఫోర్ కొట్టగా, శుభమ్ దూబె ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టాడు.
15 ఓవర్లకు రాజస్థాన్ 159 పరుగులతో నిలిచింది. అప్పటికీ రాజస్థాన్ విజయానికి కావాల్సినవి 30 బంతుల్లో 63 పరుగులు. క్రీజులో శాంసన్, దూబె ఉండడంతో రాజస్థాన్ గెలుపుదిశగా వెళుతుందని భావించారు. అయితే 16వ ఓవర్ నాలుగో బంతికి శాంసన్ ఔటయ్యాడు. శాంసన్ కొట్టిన భారీ షాట్ను షై హోప్ అద్భుత ఫీల్డింగ్తో బౌండరీ లైన్ వద్ద అందుకున్నాడు. ఫోర్, సిక్స్ బాది దూకుడు మీదున్న శుభమ్ను ఖలీల్ ఔట్ చేశాడు. 18వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ సూపర్ బౌలింగ్ వేశాడు. ఫెరీరా, అశ్విన్ను ఔట్ చేయడమే కాకుండా కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు. రాజస్థాన్ వరుసగా వికెట్లు కోల్పోతున్నప్పటికీ క్రీజులో హిట్టర్ రోమన్ పావెల్ ఉండడంతో ఆ జట్టు శిబిరంలో కొంత ఆశ ఉంది. చివరి రెండు ఓవర్లకు ఆ జట్టు లక్ష్యం 37 పరుగులుగా మారింది. అయితే 19 ఓవర్లో కేవలం 8 పరుగులు మాత్రమే వచ్చాయి. 20 ఓవర్లో పావెల్ను ముకేశ్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ ఓవర్లో 8 పరుగులే ఇవ్వడంతో దిల్లీ 20 పరుగుల తేడాతో గెలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ అదే జోరు.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం
చివరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ అదరగొట్టింది. పంజాబ్పై ఘన విజయాన్ని నమోదు చేసింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు. -
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
ధోనీ ఒంటి చేత్తో సిక్స్లు కొట్టి మ్యాచ్లను ఎన్నోసార్లు గెలిపించాడు. అయితే.. ఆర్సీబీతో కీలకమైన మ్యాచ్లో అతడు కొట్టిన ఓ భారీ సిక్సే ఆ జట్టు ఓటమికి దారి తీసిందంటూ పలువురు విశ్లేషిస్తున్నారు. -
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
ఆర్సీబీకి అవసరమైతే ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగేందుకు సిద్ధమే అంటూ క్రిస్గేల్ పేర్కొన్నాడు. తాను ఎప్పటికీ ఈ జట్టు ఫ్యాన్నే అని వెల్లడించాడు. -
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
ధోనీ, రవీంద్ర జడేజా వంటి హిట్టర్లు క్రీజ్లో ఉన్నా సరే.. కేవలం 18 పరుగులను కాపాడిన యశ్ దయాళ్ జట్టుకు అపూర్వ విజయం అందించాడు. బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. -
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఈ సీజన్లో హిట్టింగ్ చేస్తూ సిక్స్లు, ఫోర్లు బాదేశాడు. మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ధోనీ ఆట కోసమే అభిమానులు స్టేడియాలకు హోరెత్తారు. -
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?
ఇప్పుడు ప్లేఆఫ్స్ బెర్తుల ఆట లేదు. కానీ, ఇవాళ తలపడనున్న నాలుగు జట్లలో రెండింటికి ఈ మ్యాచ్లు అత్యంత కీలకం. -
మలుపు తిప్పిన రనౌట్.. డుప్లీ సూపర్ క్యాచ్.. యశ్ లాస్ట్ ఓవర్ వీడియోలు వైరల్!
చివరి ఏడు మ్యాచుల్లో ఆరు గెలిచి.. ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ, బెంగళూరు ఆ ఫీట్ను సాధించింది. -
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్
ఐదుసార్లు విజేతగా నిలిచిన చెన్నై ఈసారి ప్లేఆఫ్స్కు చేరుకోవడంలో విఫలమైంది. ఆర్సీబీతో జరిగిన కీలక పోరులో ఓటమిపాలైంది. -
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
ప్లేఆఫ్స్కు చేరుకుంటామనే ఆశలు అత్యంత తక్కువగా ఉన్నప్పటికీ.. వరుణుడి భయం వెన్నాడినా.. అవన్నీ దాటుకొని నాకౌట్ బెర్తును బెంగళూరు ఖరారు చేసుకుంది. -
విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
కొద్దిపాటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరోసారి విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. -
భళి భళిరా బెంగళూరు
ఎనిమిది మ్యాచ్ల్లో ఒకే ఒక్క గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్రేటూ మైనసుల్లో. అప్పటికి కనీసం నాలుగు విజయాలు సాధించిన జట్లు ఆరున్నాయి. ఇక ఈ ఐపీఎల్లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్ ప్రపంచం తీర్మానించింది. -
ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్
తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని.. తన ప్రదర్శనే ప్రామాణికమని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నా.. అతడి స్ట్రైక్రేట్పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించాడు. -
రోహిత్ దారెటు?
ముంబయి ఇండియన్స్తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా! వచ్చే సీజన్కు అతడు ఆ జట్టుతో ఉండడా? హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఈ ఊహాగానాలకు తెరలేస్తే.. తాజాగా ముంబయి కోచ్ బౌచర్ వ్యాఖ్యలతో అవి కేవలం ఊహాగానాలే కావని తేలిపోయింది. -
25న న్యూయార్క్కు భారత క్రికెటర్లు
సహాయ సిబ్బందితో పాటు భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ కోసం ఈ నెల 25న న్యూయార్క్ బయల్దేరనున్నారు. మిగతా ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ (మే 26) తర్వాత వెళ్తారు. -
నా బ్యాటింగ్ అంత గొప్పగా లేదు: రోహిత్
ప్రస్తుత ఐపీఎల్లో తన బ్యాటింగ్ ఆశించిన ప్రమాణాల మేర లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ దాని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. -
రెండో స్థానంలో అర్జున్
తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. శనివారం నాలుగో రౌండ్లో మాన్యుయెల్ పెట్రోసియన్ (ఆర్మేనియా)పై అతడు నెగ్గాడు. -
సిఫ్త్కౌర్, నీరజ్ గెలుపు
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్-4లో సిఫ్త్కౌర్, నీరజ్ కుమార్ విజేతలుగా నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీపొజిషన్స్ తుది పోరులో సిఫ్త్ 461.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. -
పర్వీన్ స్థానంలో జైస్మిన్
బాక్సర్ పర్వీన్ హుడాపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించిన నేపథ్యంలో.. కోల్పోయిన ఒలింపిక్ బెర్తు తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని భారత బాక్సింగ్ సమాఖ్య ఆరంభించింది. -
తుదిపోరుకు సాత్విక్ ద్వయం
థాయ్లాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి జోడీ అదిరే ప్రదర్శన చేస్తోంది. దూకుడైన ఆటతో ఈ భారత జంట ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ ద్వయం 21-11, 21-12తో లూ మింగ్-తాంగ్ కైయ్ వీయ్ (చైనీస్ తైపీ) జోడీని చిత్తు చేసింది. -
నిఖత్ పసిడి పంచ్
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణా అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటింది. పారిస్ ఒలింపిక్స్ ముంగిట ఫామ్ను కొనసాగిస్తూ స్వర్ణం కైవసం చేసుకుంది. శనివారం 52 కేజీల తుదిపోరులో ఆమె 5-0తో ఉర్క్బయెవా (కజకిస్థాన్)ను చిత్తు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్కు ప్రమాదం..!
-
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు
-
ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ అదే జోరు.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
-
తెలంగాణ మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారు