ట్రాఫిక్‌ పోలీసుల రసీదులపై ఏసు బోధనలు

విశాఖ రైల్వేస్టేషన్‌ ఆవరణలో నగర ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటో స్టాండ్‌ రసీదులపై ఏసుక్రీస్తు బోధనలు ముద్రించి ఉండడం కలకలం రేపింది.

Published : 26 Nov 2022 06:50 IST

విశాఖపట్నం (రైల్వేస్టేషన్‌), న్యూస్‌టుడే: విశాఖ రైల్వేస్టేషన్‌ ఆవరణలో నగర ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటో స్టాండ్‌ రసీదులపై ఏసుక్రీస్తు బోధనలు ముద్రించి ఉండడం కలకలం రేపింది. గతంలో కొన్ని ప్రైవేటు సంస్థలు తమ ప్రచారంలో భాగంగా ట్రాఫిక్‌ పోలీసు విభాగానికి వారి సంస్థ పేర్లతో ఉన్న రసీదులు సరఫరా చేసేవి. అయితే ఇప్పుడు జారీ చేసిన వాటిపై సంస్థల పేర్లేవీ లేకుండా ఏసు క్రీస్తు బోధనలే ఉండడంతో పలువురు అవాక్కయ్యారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో భాజపా నేతలు అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ పోలీసులపై ధ్వజమెత్తారు. అయితే తమ వద్ద రసీదులు అయిపోవడంతో తమ సిబ్బంది ఎప్పుడూ ముద్రించి ఇచ్చే వారి నుంచి ఒక పుస్తకం తెచ్చారని.. దానిపై ఇలాంటి వ్యాఖ్యలు ఉండడం గమనించిన వెంటనే వాటి జారీని ఆపేశామని ట్రాఫిక్‌ అదనపు డిప్యూటీ కమిషర్‌ హరీఫుల్లా వివరణ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని