పథకాలన్నీ వాలంటీర్లు, నాయకులకేనా?
ప్రభుత్వ పథకాలన్నీ వాలంటీర్ల కుటుంబాలకు అందాకే మిగిలిన వారికి ఇస్తున్నారని కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడోణ గ్రామస్థులు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు ఫిర్యాదు చేశారు.
మంత్రి జయరాంను ప్రశ్నించిన గ్రామస్థులు
ఆలూరు గ్రామీణ, న్యూస్టుడే: ప్రభుత్వ పథకాలన్నీ వాలంటీర్ల కుటుంబాలకు అందాకే మిగిలిన వారికి ఇస్తున్నారని కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడోణ గ్రామస్థులు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వంలో కొందరు గ్రామస్థులు ప్రభుత్వ పథకాలు వాలంటీర్లు, నాయకుల కుటుంబాలకేనా? సామాన్యులకు ఇవ్వరా? అని మంత్రిని ప్రశ్నించారు. అలా ఏమీ లేదని, అర్హులందరికీ పథకాలు అందిస్తామని మంత్రి సమాధానమిచ్చారు. గ్రామానికి రహదారి, ఇంటింటికీ కుళాయిని ఏర్పాటు చేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్