Tirumala: తిరుమలేశా.. కొండపై ఉండేదెలా?
ఒక రోజుకు ఒక గదికి రూ.150 ఉన్న అద్దె ఇప్పుడు రూ.1,700. రూ.200 ఉన్న పెద్ద గది అద్దె ఇప్పుడు రూ.2,200. లాభార్జనే లక్ష్యంగా పనిచేసే ఏ ప్రైవేటు హోటల్ యాజమాన్యమో ఇలా ధరలు ఇష్టానుసారం పెంచిందనుకుంటే పొరపాటే.
తితిదే అతిథి గృహాల్లో భారీగా అద్దెల పెంపు
ప్రైవేటు లాడ్జీల తరహాలో పెరిగిన ధరలు
భక్తులపై లడ్డూ ధరల భారమూ అధికమే
ఆర్టీసీ ఛార్జీల మోత దీనికి అదనం
ఈనాడు, అమరావతి, తిరుపతి: ఒక రోజుకు ఒక గదికి రూ.150 ఉన్న అద్దె ఇప్పుడు రూ.1,700. రూ.200 ఉన్న పెద్ద గది అద్దె ఇప్పుడు రూ.2,200. లాభార్జనే లక్ష్యంగా పనిచేసే ఏ ప్రైవేటు హోటల్ యాజమాన్యమో ఇలా ధరలు ఇష్టానుసారం పెంచిందనుకుంటే పొరపాటే. శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని కనులారా దర్శించుకోవాలని ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తిరుమల చేరుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వడ్డిస్తున్న ధరల వాతలివి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు లాభాపేక్ష లేకుండా సౌకర్యాలు కల్పించాల్సిన తితిదే... వాణిజ్య ధోరణిలో ఆలోచిస్తూ గదుల అద్దెలు పెంచడంపై భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం, తితిదే పాలకవర్గం.. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడంపై కాకుండా, వారి నుంచి డబ్బు పిండటంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. ఇప్పటికే లడ్డూ సహా ప్రసాదాల ధరలు పెంచి భక్తులపై భారం మోపిన తితిదే... క్రమంగా తిరుమల కొండపై ఉన్న అతిథి గృహాల్లో గదుల ధరల్నీ ప్రైవేటు హోటళ్ల తరహాలో పెంచేయడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తితిదే ఒకానొక దశలో వివిధ ఆర్జిత సేవల ధరల్ని పెంచాలని ప్రయత్నించి తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది.
తితిదే పాలక మండలి సమావేశంలో... అధికారులు ఒక ధర చెబితే, దాన్ని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మరిన్ని రెట్లు పెంచేస్తూ.... వేలంపాట పాడినట్టుగా శ్రీవారి సేవల టికెట్ ధరల్ని పెంచాలనుకున్న తీరు అప్పట్లో టీవీ ఛానళ్లలో ప్రత్యక్షంగా ప్రసారమైంది. అది తీవ్ర చర్చకు, విమర్శలకు దారితీసింది. దాంతో ఆర్జిత సేవల టికెట్ల ధరల పెంపుపై తితిదే వెనక్కి తగ్గింది. తర్వాత మరెప్పుడూ తితిదే పాలక మండలి సమావేశాల్ని ప్రత్యక్ష ప్రసారం చేయలేదు. ఆ పరిణామంతో ఆర్జిత సేవల టికెట్ల పెంపు ప్రతిపాదనల్ని విరమించుకున్న తితిదే... గదుల అద్దెలు పెంచడం, భక్తులకు ఉచితంగా ఇచ్చే లడ్డూల సంఖ్యను కుదించడం, ప్రసాదం ధరల పెంపు లాంటి చర్యలకు పాల్పడుతోంది.
ఆర్జితసేవా టికెట్ల ధరలు ఎంత పెంచినా సామాన్యులకు ఇబ్బంది లేదు. అవి కొనేవారిలో ఆర్థిక స్తోమత, పలుకుబడి గలవారే ఎక్కువ మంది ఉంటారు. కానీ గదుల అద్దెల పెంపు భారం ఎక్కువగా సామాన్యులు, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతిపైనే పడుతోంది. కావాలంటే ధనికులు ఉపయోగించే, ఎక్కువ సౌకర్యాలున్న అతిథి గృహాల్లో ధరలు పెంచి, సామాన్యులపై భారం లేకుండా చూడొచ్చు. సామాన్యులుండే అతిథి గృహాల్లో స్వల్పంగా పెంచినా ఇబ్బంది పడరు. 2022-23 సంవత్సరానికి తితిదే బడ్జెట్ రూ.3,096.40 కోట్లు. అంత భారీ బడ్జెట్ ఉన్న తితిదే... తలుచుకుంటే సామాన్య భక్తులపై భారం పడకుండా చూడలేదా? ఇలా అడ్డదిడ్డంగా పెంచడమేంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
ఒకేసారి 1100 శాతానికిపైగా పెంచేస్తే ఎలా?
‘పేదవాడికి అందుబాటులో వినోదాన్ని అందించాలని సినిమా టికెట్ల ధరల్ని నిర్ణయిస్తే దాని మీదా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అలాంటివాళ్లు పేదల గురించి ఆలోచించేవాళ్లేనా? పేదల గురించి పట్టించుకునేవాళ్లేనా? పేదవాళ్లకు వీళ్లు శత్రువులు కాదా.. సినిమా టికెట్ల ధరల్ని తగ్గించడాన్ని సమర్థించుకుంటూ ముఖ్యమంత్రి జగన్ గత ఏడాది జనవరి 1న గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో చెప్పిన మాటలవి. పేదల వినోదంపైనే అంత శ్రద్ధ కనబరిస్తే.. ప్రజలంతా కలియుగ ప్రత్యక్షదైవంగా కొలిచే ఆ శ్రీనివాసుడి దర్శన భాగ్యాన్ని మరింత సులువుగా, పెద్దగా ఆర్థిక భారం లేకుండా సామాన్యులకు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? తిరుమల కొండపై సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే ఎస్వీ, నారాయణగిరి అతిథి గృహాల్లో గదుల అద్దెలను ఒక్కసారిగా రూ.150 నుంచి రూ.1,700కి పెంచడం ప్రజలపై పెనుభారం కాదా? ఒక్కసారిగా ధరల్ని 1133% పెంచడం ఎలా సమర్థనీయం? తిరుమలలోని అతిథి గృహాలు, కాటేజీల్లో వివిధ కేటగిరీల గదులు సుమారు 7,200 ఉన్నాయి. వాటిలో ఒక గదికి ఒకరోజు అద్దె... ఎస్ఎంసీ, ఎస్ఎన్సీ, ఏఎన్సీ, హెచ్వీసీల్లో రూ.50, రాంబగీచా, వరాహస్వామి గెస్ట్హౌస్, ఎస్ఎన్జీహెచ్, హెచ్వీడీసీ, ఏటీసీ, టీబీసీల్లో రూ.100, నారాయణగిరి, ఎస్వీ గెస్ట్హౌస్లలో రూ.150, విష్ణుపాదంలో రూ.250, వకుళమాత, కౌస్తుభం, పాంచజన్యం, నందకం అతిథి గృహాల్లో రూ.500 చొప్పున ఉండేవి. ఇటీవల నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత అతిథి గృహాల ధరల్ని రూ.వెయ్యికి పెంచేశారు. ఎస్వీ అతిథి గృహంలో 31 గదులుండగా, వాటి అద్దెను రూ.150 నుంచి రూ.1700 చేశారు. ఇప్పుడు నాలుగు నారాయణగిరి అతిథి గృహాల్లోని 164 గదుల అద్దెలనూ పెంచేశారు.
లడ్డూ ధరల మోత
శ్రీవారికే కాదు భక్తులకూ కొండపై ప్రసాదంగా ఇచ్చే లడ్డూ అత్యంత ప్రీతిపాత్రం. వైకాపా అధికారంలోకి వచ్చాక... లడ్డూ ధరల్ని పెంచేసి, స్వామివారి ప్రసాదాన్ని సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేసింది. గతంలో రూ.25 ఉన్న లడ్డూ ధరను రూ.50కి పెంచింది. రూ.25 ఉన్న వడ ధరను నాలుగు రెట్లు పెంచేసి రూ.100 చేసింది. కల్యాణం లడ్డూధరను రూ.100 నుంచి రూ.200కి పెంచింది. ఇదివరకు కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు ‘దివ్యదర్శనం’ సౌకర్యం ఉండేది. రోజుకు 20వేల మందికి టోకెన్లు ఇచ్చేవారు. వారికి ఉచితంగా ఒక లడ్డూ, దానికి అదనంగా రెండు లడ్డూలు రూ.10 చొప్పున, మరో రెండు లడ్డూలు రూ.25 చొప్పున అందజేసేవారు. కాలినడకన వెళ్లే భక్తులకు ఉచిత లడ్డూతోపాటు, రూ.70 వెచ్చిస్తే మరో నాలుగు లడ్డూలు లభించేవి. ఇప్పుడు ఏకంగా దివ్యదర్శనాన్నే ఎత్తేశారు. సర్వదర్శనం, స్లాట్ దర్శనానికి వచ్చేవారికీ ఇదివరకు ఒక ఉచిత లడ్డూ, రూ.70కి మరో నాలుగు లడ్డూలు దొరికేవి. ఇప్పుడు ఒక ఉచిత లడ్డూ మాత్రమే ఇస్తున్నారు. బ్రేక్, సుపథం దర్శనాలకు వెళ్లినవారికి ఇది వరకు 2 లడ్డూలు ఇస్తే.. ఇప్పుడు ఒకటే ఇస్తున్నారు.
ఆర్టీసీ ధరల వడ్డన సరేసరి
వైకాపా అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ టికెట్ ఛార్జీలను మూడుసార్లు పెంచడం తిరుమల వెళ్లే భక్తులకు భారంగా మారింది. గుడివాడ నుంచి తిరుపతికి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో 2019 నవంబరులో టికెట్ ధర రూ.620 ఉండేది. అది రూ.220 పెరిగి... ఇప్పుడు రూ.840 అయ్యింది. కాకినాడ నుంచి తిరుపతికి అప్పట్లో రూ.885 ఉన్న టికెట్ ధర ఇప్పుడు రూ.1,190కి చేరింది. వైకాపా అధికారంలోకి వచ్చేనాటికి తిరుపతి నుంచి తిరుమలకు ఆర్టీసీ బస్సులో టికెట్ ధర రూ.75 ఉండేది. దాన్ని డీజిల్ సెస్ పేరుతో ఒకసారి రూ.85కి, ఆ తర్వాత మళ్లీ రూ.90కి పెంచారు. రెండు వైపుల టికెట్ ఒకేసారి తీసుకుంటే రూ.160కి ఇస్తున్నారు.
ఒక కుటుంబానికి కనీస ఖర్చు రూ.17వేల పైమాటే!
నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం గుడివాడ నుంచి బస్సులో తిరుమల వెళ్లి, నారాయణగిరి అతిథి గృహంలో రెండు రోజులు బసచేసి శ్రీవారిని దర్శించుకుని రావాలంటే కనీస వ్యయం రూ.17వేలవుతుంది. తిరుమలకు వెళ్లినవారు రెండు రోజులు ఉండాలనుకుంటే.. మొదట ఒకరోజుకు గది కేటాయించి తర్వాత మరో రోజుకు పొడిగిస్తారు. ఒకరోజు దాటాక ఒక గంట ఉన్నా, రెండు గంటలున్నా మొత్తం రోజుకు అద్దె కట్టాలి. ఇదివరకు నారాయణగిరి అతిథి గృహంలో రెండు రోజులున్నా అద్దె రూ.300 అయ్యేది. పెంచిన ధరల ప్రకారం రూ.3,400 అవుతుంది.
* కొండపై ఉన్నప్పుడు తితిదే నిత్యాన్న దానంలో ఉచితంగా భోజనం చేస్తే... భోజనాల ఖర్చు తగ్గుతుంది. స్థానికంగా ఎక్కడికీ తిరగకపోతే ఆ ఖర్చూ తగ్గుతుంది.
* ఆ కుటుంబానికి గతానికీ ఇప్పటికీ అతిథి గృహం ధరలు, ఆర్టీసీ ఛార్జీలు, ప్రసాదం ధరలు పెరగడంవల్ల అదనంగా పడే భారం సుమారు రూ.5 వేలు.
నేడు భాజపా నిరసన
ఈనాడు, అమరావతి: తిరుమలలో గదుల అద్దెల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా గురువారం భాజపా ఆందోళనలు చేయనుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించి కలెక్టర్లకు ధరలు తగ్గించాలని డిమాండు చేస్తూ వినతిపత్రాలు అందజేస్తారు. రాజమహేంద్రవరంలో జరిగే కార్యక్రమంలో భాజపా రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు