చేనేత కార్మికులపై.. ఉపాధి కోతల కత్తి
రాష్ట్రంలో చేనేత కార్మికుల మెడపై ఉపాధి కోతల కత్తి వేలాడుతోంది. వారి ఆదాయానికి గండిపడే పరిస్థితులు ఇప్పటికే కొన్నిచోట్ల నెలకొన్నాయి.
మాస్టర్ వీవర్స్ దగ్గర భారీగా పేరుకుపోయిన నిల్వలు
ఫలితంగా ఉత్పత్తిని తగ్గిస్తున్న వైనం
కార్మికుల ఆదాయానికి గండి
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో చేనేత కార్మికుల మెడపై ఉపాధి కోతల కత్తి వేలాడుతోంది. వారి ఆదాయానికి గండిపడే పరిస్థితులు ఇప్పటికే కొన్నిచోట్ల నెలకొన్నాయి. పెరిగిన ముడి సరకు ధరలు, జీఎస్టీ ప్రభావంతో గత నవంబరు నుంచి మాస్టర్ వీవర్స్ దగ్గర క్రమక్రమంగా అమ్మకాలు తగ్గుతూ ఇప్పుడు భారీగా నిల్వలు పేరుకుపోయాయి. దీంతో వారు ఉత్పత్తిని తగ్గిస్తున్నారు. మరికొందరు మగ్గాల సంఖ్యను కుదిస్తున్నారు. ఇది చేనేత కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. కొన్నిచోట్ల వారి నెలసరి ఆదాయంలో 50 శాతం మేర తగ్గింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం లేదని చేనేత కార్మికులు మండిపడుతున్నారు.
* రాష్ట్రంలో కీలక చేనేత చీరల తయారీ ప్రాంతాలైన ధర్మవరం, మదనపల్లె, ఉప్పాడ, చీరాల, మంగళగిరి, ఎమ్మిగనూరు, కొడమూరుల్లో ఎటు చూసినా ఇదే పరిస్థితి. ఒక్కో మాస్టర్ వీవర్ దగ్గర వందల సంఖ్యలో చీరలు పేరుకుపోయాయి. ఇప్పటికిప్పుడు అవి తరిగిపోయే పరిస్థితులు కనిపించడం లేదని మాస్టర్ వీవర్స్ చెబుతున్నారు. కరోనాకు ముందు ముడిసరకు రూ.3,200 వరకు ఉండగా ప్రస్తుతం రూ.5,400 వేలకు చేరింది. నిన్నమొన్నటి వరకు రూ.6 వేలకు చేరినా కర్ణాటక ఎన్నికల ప్రభావంతో కొంతమేర తగ్గినట్లు చేనేత సంఘాల నేతలు చెబుతున్నారు. మళ్లీ పెరిగే అవకాశమున్నట్లు వారు పేర్కొంటున్నారు. ఈ ధరే ఇబ్బందికరంగా ఉండగా దీనిపై 12 శాతం జీఎస్టీ వసూలు గుదిబండగా మారింది. డిజైన్ పంచింగ్ కార్డ్సుపైనా 12 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. చీర డిజైన్ మార్చిన ప్రతిసారీ వీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇది అదనపు భారమవుతోంది. రంగుల అద్దకానికి వినియోగించే పిండిపైనా జీఎస్టీ పడుతోంది. ఇవన్నీ కలిసి ఖర్చును అదనంగా సుమారు 20-25 శాతం పెంచుతున్నాయి. ఆ మేరకు చీరల ధరల్ని పెంచితే కొనుగోలుదారులు ముందుకురారనే ఆలోచనతో పెంపును విరమించుకుంటున్నారు. కరోనాకు ముందున్న ధరలతోనే చేనేత మాస్టర్ వీవర్స్ వస్త్ర వ్యాపారులకు అమ్మకాలు చేస్తున్నారు. కానీ అమ్మకాలు మాత్రం గణనీయంగా తగ్గుతున్నాయి. కొంతమంది ఇంటి అవసరాలు తీర్చుకోవడం కోసం ఉత్పత్తి ధరకే చీరలను అమ్మేస్తున్నారు. పవర్లూమ్లో చేనేత రకాలు నేయడమూ చేనేత వస్త్రాల అమ్మకాలు తగ్గడానికి మరో కారణంగా నేత కార్మికులు చెబుతున్నారు.
కార్మికుల ఆదాయంలో 50% కోత
గత 8 నెలలుగా మాస్టర్ వీవర్స్ నుంచి అమ్మకాలు తగ్గుతున్నాయి. గతంలో ఉత్పత్తి చేసిన చీరలు... ఏ నెలకానెల 95 శాతంపైగా అమ్ముడయ్యేవి. ప్రస్తుతం అమ్మకాలు క్రమక్రమంగా తగ్గుతూ 30 శాతానికి చేరాయి. నిల్వలు పేరుకుపోతున్నాయి. చేసేది లేక మాస్టర్ వీవర్స్ ఉత్పత్తిని, మరికొన్ని చోట్ల మగ్గాల సంఖ్యను తగ్గిస్తున్నారు. సాధారణంగా నెలకు ఒక మగ్గంపై పట్టు రకం చీరలను నాలుగింటిని నేస్తారు. ఇప్పుడు కొన్ని చోట్ల నెలకు రెండింటినే నేయాలని కార్మికులకు చెబుతున్నారు. ఫలితంగా వారి ఆదాయం తగ్గుతోంది. చిన్న రకాలు నేసే వారిపై నెలకు ఆదాయంలో రూ.7 వేలు తగ్గుదల ఉంది. పెద్ద రకాలు నేసే వారికి రూ.15-20 వేల వరకు ఆదాయంలో కోత పడుతోంది. సగటున 50% కోత పడుతోంది. ఎమ్మిగనూరు, కొడుమూరు, ఆదోని, గుడికల్లు, నాగలదిన్నె, నందవరం, చుట్టు పక్కల ప్రాంతాల్లోని దాదాపు 6 వేల కార్మిక కుటుంబాలపై ప్రభావం తీవ్రంగా ఉంది. ఉప్పాడ, కొత్తపల్లి ప్రాంతాల్లో కొంతమంది కార్మికులు చేనేత వృత్తిని వదిలి ఇతర పనులకు వెళుతున్నారు.
రూ.కోట్ల విలువైన నిల్వలు?
కంచిపట్టు చీరల తయారీకి ప్రసిద్ధి చెందిన ధర్మవరం, మదనపల్లెలో నిల్వలు భారీగా పేరుకుపోతున్నాయి. ధర్మవరంలో రూ.200 కోట్లు, మదనపల్లెలో రూ.250 కోట్ల విలువైన చీరలు మాస్టర్ వీవర్స్ దగ్గర నిల్వ ఉన్నాయని చేనేత సంఘాల నేతలు చెబుతున్నారు. చీరాల, చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని రకాల చేనేత వస్త్రాలు కలిపి రూ.10 కోట్ల మేర నిల్వలున్నాయని రాష్ట్ర చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ కో కన్వీనర్ కొండయ్య తెలిపారు. 1989లో ఇలాంటి పరిస్థితి ఎదురైందని, ఆ తర్వాత మళ్లీ నిల్వలు పేరుకుపోయి కార్మికులు, మాస్టర్వీవర్స్ ఇబ్బంది పడటం ఇప్పుడే జరుగుతోందన్నారు. మదనపల్లె సమీపంలోని నీరుగట్టువారిపల్లెలో తయారయ్యే పట్టుచీరలను సింగపూర్, మలేసియా, శ్రీలంక, థాయ్లాండ్ వంటి దేశాలకు ఎగుమతి చేసేవారు. కరోనా తర్వాత ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. మదనపల్లె, చుట్టు పక్కల ప్రాంతాల్లోని మాస్టర్ వీవర్స్కు బెంగళూరు, చెన్నై, హైదరాబాదు ప్రధాన మార్కెటింగ్ ప్రాంతాలు. నిన్న మొన్నటి వరకు వస్త్ర వ్యాపారులకు సరకు పంపాక కొద్దిరోజులకు డబ్బులు ఆన్లైన్లో వేసేవారు. ఇప్పుడు డబ్బులు చెల్లించాలని అడిగితే సరకును వెనక్కి పంపేస్తున్నారని మాస్టర్ వీవర్స్ వాపోతున్నారు. దీంతో వారు ఎప్పుడిస్తే అప్పుడు తీసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
10 మగ్గాలను తగ్గించా
- బి.సురేశ్బాబు, మాస్టర్ వీవర్, చీరాల
మొన్నటి వరకు 50 మగ్గాలతో కుప్పటాలు, మంగళగిరి రకం చీరలు నేయించేవాడిని. అమ్మకాలు లేక 10 మగ్గాలు తగ్గించా. గతంలో నెలకు 500 చీరలు నేస్తుంటేే ఇప్పుడు 250కు తగ్గాయి. నెలకు రూ.10 వేలైనా మిగలడం లేదు. చీటీ డబ్బులు, బ్యాంకు కిస్తీలు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నాం. చేనేత సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించాలి.
సరకు వెనక్కి పంపేస్తున్నారు
- బండి నాగరాజు, మాస్టర్ వీవర్, మదనపల్లె
నవంబరు నుంచి పట్టుచీరల వ్యాపారం పూర్తిగా పడిపోయింది. సరకును విక్రయించుకోడానికి నానా అవస్థలు పడుతున్నాం. గతంలో అమ్మకాలు జరిగిన వెంటనే వ్యాపారులు డబ్బు ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం వారిచ్చినప్పుడే తీసుకోవాల్సి వస్తోంది. గట్టిగా అడిగితే సరకును వెనక్కి పంపేస్తున్నారు.
3 నెలల నుంచి ఉత్పత్తి తగ్గించాం
- రంగస్వామి, మాస్టర్ వీవర్, ఎమ్మిగనూరు
నేను, మా అన్న కలిసి 250 మగ్గాలపై గద్వాల చీరలు నేయిస్తున్నాం. నెలకు 700 చీరల వరకు గతంలో ఉత్పత్తి చేయగా... ప్రస్తుతం అమ్మకాల్లేక 400కి తగ్గించాం. మూడు నెలల నుంచి ఉత్పత్తిని క్రమక్రమంగా తగ్గిస్తున్నాం. 1,500 చీరల వరకు నిల్వ ఉన్నాయి. చిన్న రకాలు అమ్ముడుపోతున్నా... పెద్ద రకాలను ఎవరూ కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. చేనేత కార్మికుల ఆదాయంపైనా దెబ్బపడుతోంది.
30 శాతం అమ్మకాలే
- రాజేశ్, మాస్టర్ వీవర్, ధర్మవరం
35 మగ్గాలపై కంచి పట్టు చీరలను నేయిస్తున్నా. నెలకు 100 చీరల వరకు ఉత్పత్తి ఉంటుంది. గతంలో ఏ నెలలో ఉత్పత్తి చేసే చీరలు అదే నెలలో అమ్మకాలు జరిగేవి. నవంబరు నుంచి నెల ఉత్పత్తిలో 30 శాతం అమ్మకాలు జరగడం లేదు. 400 చీరలు నిల్వ ఉన్నాయి. నిల్వలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు