ఆంధ్ర వర్సిటీ ప్రతిష్ఠపై మసక!
ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) వందేళ్ల సంబరాలకు చేరువవుతోంది. ఇక్కడ విద్యనభ్యసించిన ఎందరో దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు.
లైంగిక వేధింపులపై వరుస ఫిర్యాదులు
కాసులిస్తే పీహెచ్డీలు మంజూరు?
ఈనాడు, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) వందేళ్ల సంబరాలకు చేరువవుతోంది. ఇక్కడ విద్యనభ్యసించిన ఎందరో దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వర్సిటీకి గుర్తింపు ఉంది. ఆ ప్రతిష్ఠ ఇప్పుడు మంటగలిసేలా ఘటనలు, ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ఇప్పటికే వీసీ ఛాంబర్ వైకాపా కార్యాలయంలా మారిందన్న ఆరోపణలు ఉండగా, తాజాగా ఆచార్యులపై లైంగిక వేధింపుల ఆరోపణలొచ్చాయి. ఏకంగా 1400 పీహెచ్డీ పట్టాలు అమ్మకానికి సిద్ధం చేశారంటూ వర్సిటీ ప్రొఫెసరే చెప్పడం సంచలనమైంది. అంతేనా.. క్యాంపస్లో లిక్కర్ వ్యాపారం, గంజాయి లభిస్తుండటంతోపాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడం కలకలం రేపుతోంది.
బయటకు వచ్చినవి కొన్నే
వర్సిటీలో హిందీ విభాగాధిపతి సత్యనారాయణ ఓ రీసెర్చ్ స్కాలర్పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు జాతీయ మహిళా కమిషన్కు ఇటీవల ఫిర్యాదు అందింది. ప్రీ-టాక్, వైవా కోసం డబ్బులు డిమాండ్ చేశారని, తనతో బయటకు రావాలని లైంగికంగా వేధించారన్న ఫిర్యాదును ఏయూ మహిళా గ్రీవెన్స్ సెల్కు పంపి విచారణ ఆరంభించారు. ఈ నేపథ్యంలో ఆయన్ను విభాగాధిపతిగా తొలగించారు. ఏయూలో చాలా వేధింపులు జరుగుతున్నా అవి వెలుగులోకి రావడం లేదని సమాచారం. ఒకవేళ వచ్చినా రాజకీయ ఒత్తిళ్లతో ఉన్నతాధికారులు హెచ్చరించి వదిలేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. గతంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డీన్గా ఉన్న ఓ కెమిస్ట్రీ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులందాయి. కొన్ని నెలల క్రితం విశ్రాంత ఆచార్యులు ఇద్దరిపైనా ఈ తరహా ఆరోపణలు రావడం గమనార్హం. సోషల్ వర్క్స్ విభాగ ఉద్యోగి, ఇంజినీరింగ్ ప్రొఫెసర్పై అభియోగాలు రాగా, మహిళా కమిటీ విచారణ జరిపి నివేదికలిచ్చింది. ప్రస్తుతం వీరిద్దరూ సస్పెన్షన్లో ఉన్నారు. ఇటీవల ఓ ప్రొఫెసర్ మద్యం మత్తులో నాలుగో తరగతి ఉద్యోగినిని వేధించడంతో పెద్ద గొడవ జరిగింది. ఒక ప్రొఫెసర్ నాన్ టీచింగ్ ఉద్యోగినికి క్యాంపస్లో క్వార్టర్స్ ఇప్పించారని, మరో సీనియర్ ప్రాంగణంలోని రేకుల షెడ్డులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు ఇటీవల వరసగా వచ్చాయి.
అమ్మకానికి పీహెచ్డీలు
ఎగ్జిక్యూటివ్ పీహెచ్డీల పేరుతో భారీ దందా జరుగుతోందని వర్సిటీ పాలకమండలిపై హిందీ విభాగాధిపతి సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు 1400 అడ్మిషన్లు జరగ్గా...ఎగ్జిక్యూటివ్ కోటా పేరు చెప్పి పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయన్నారు. డీన్గా, వివిధ హోదాల్లో పనిచేసిన సత్యనారాయణే ఇలా ఆరోపించడం సంచలనమైంది. ఇవి నిజమే అనేలా ఒక ఉన్నతాధికారి వ్యవహార శైలి, నిర్ణయాలున్నాయి. కంప్యూటర్ సైన్సులో రీసెర్చ్ చేసి ఓ ప్రైవేటు కళాశాలలో ప్రిన్సిపాల్గా ఉన్న వ్యక్తికి వర్సిటీలో కీలక హోదా కూడా కట్టబెట్టారు. ఎలాంటి రీసెర్చ్ (పరిశోధన) అనుభవం లేనప్పటికీ ఓ విభాగానికి డైరెక్టర్గా బాధ్యతలు అప్పగించారు. ‘తమకున్న అధికారాలతో ఏడాదిన్నర, రెండేళ్లకే సబ్మిషన్కు అవకాశం కల్పించేస్తున్నారు. ఆ తరవాత రెండు, మూడు నెలల్లోనే పీహెచ్డీ ప్రదానం చేస్తున్నారు. ఇందుకు ఒక్కో పీహెచ్డీకి రూ.5లక్షల వరకు వసూలు చేస్తున్నారు’ అనేవి కీలక ఆరోపణలు.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా
ఒక స్కాలర్ భర్తకు డిఫెన్స్ రంగానికి చెందిన వారితో ఉన్న పరిచయాలతో మద్యం బాటిళ్లు తీసుకువచ్చి ఏయూలో వ్యాపారం చేస్తుంటారని ప్రొఫెసర్ సత్యనారాయణ ఆరోపించారు. పీహెచ్డీలు, లిక్కర్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ఇటీవల కొందరు భద్రతా సిబ్బంది వద్ద గంజాయి పట్టుకున్నారు. వర్సిటీలో కొన్నిచోట్ల చదును చేస్తున్న సమయంలో కండోమ్ ప్యాకెట్లు గుట్టలు గుట్టలుగా దొరికాయి. ఇలాంటి సంఘటనలతో ఏయూలో అసలు ఏం జరుగుతోందనేది ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
వందనమమ్మా.. డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
-
విశాఖలో ‘చంద్రగిరి’ దందా!!