గాలేరు నగరి పేరుతో దగా
మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం.
నాడు ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పిన జగన్
అధికారంలోకి రాగానే పనులన్నీ రద్దు
మోసపోయిన ఉమ్మడి చిత్తూరు ప్రజలు
ఈనాడు - తిరుపతి, అమరావతి
మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం.
2018 జనవరి 3న చిత్తూరు జిల్లా కలికిరిలో పాదయాత్రలో జగన్.
జలయజ్ఞంలో ప్రాధాన్య ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం.
2019లో వైకాపా ఎన్నికల ప్రణాళిక
ప్రస్తుత పరిస్థితి:
గాలేరు నగరి సుజల స్రవంతి జలాల కోసం ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1.03 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందుతాయి. లక్షలమంది ప్రజల దాహార్తి తీరుతుంది. వైకాపా అధికారంలోకొచ్చిన ఈ నాలుగేళ్లలో ఒక్క జలాశయ నిర్మాణాన్నీ పూర్తి చేయలేదు. ప్యాకేజీల అంచనాలు పెంచినా పనులేమీ జరగలేదు.
గత ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్ చెప్పిందొకటి.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చేస్తున్నదొకటి. నాడు ఆయన చెప్పిన మాటలను నమ్మిన ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు.. ఇపుడు చేతలు చూసి విస్తుపోతున్నారు. ఎందుకంటే.. జగన్ అధికారంలోకొచ్చిన వెంటనే గాలేరు నగరి సుజల స్రవంతి రెండో దశ ప్యాకేజీ పనులను రద్దు చేసేశారు. అయిదు జలాశయాల నిర్మాణాన్ని పూర్తి చేసి 10 టీఎంసీల కృష్ణా జలాలతో నింపాల్సి ఉండగా.. వాటినీ రద్దు ఖాతాలో చేర్చేశారు. వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలన్నీ ఆగిపోయాయి. నేటికీ అడుగు ముందుకు పడితే ఒట్టు. సవరించిన అంచనాలకు పాలనామోదమూ ఇవ్వలేదు. ఇక టెండర్లను ఎపుడు పిలుస్తారు? గుత్తేదారులు ఎపుడు ఖరారవుతారు? గాలేరు జలాలు ఎప్పుడు వినియోగంలోకి వస్తాయి? ప్రజల ప్రశ్నలకు జగన్ సమాధానం చెబుతారా?
ఏమిటీ ప్రాజెక్టు?
- గాలేరు నగరి సుజల స్రవంతిని రెండు దశల్లో చేపట్టాలనేది ప్రణాళిక.
- శ్రీశైలం నుంచి 38 టీఎంసీల వరద జలాలను మళ్లించి కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు,. రెండోదశలో 2.25 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలన్నది లక్ష్యం.
- ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,03,500 ఎకరాలకు నీరిచ్చి సమీప గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చడం.
- తొలిదశ పనులు తెదేపా ప్రభుత్వ హయాంలోనే కొలిక్కి వచ్చినా ఇప్పటికీ డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయలేదు.
- కడప జిల్లా కోడూరు తర్వాత తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోకి ఈ కాలువ ప్రవహిస్తుంది.
- తిరుమలకు వచ్చే భక్తులకు శాశ్వత నీటి వసతి అందుబాటులోకొస్తుంది. బాలాజీ జలాశయం నుంచి నీటిని అందించాలన్న ప్రణాళిక సాకారమవుతుంది.
పెరిగిపోతున్న అంచనాలు
ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యేకొద్దీ అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం తొలిదశలో రూ. 7,030.71 కోట్లకు, రెండో దశలో రూ. 4010.95 కోట్లకు పాలనామోదం వచ్చింది. రెండోదశ అంచనాలను రూ. 5,014 కోట్లకు పెంచి పాలనామోదానికి ప్రయత్నిస్తున్నారు.
బాలాజీ జలాశయం: 10.28 శాతం పనులే పూర్తయ్యాయి. తితిదే, తిరుపతి కార్పొరేషన్ సైతం నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. నీటి నిల్వ సామర్థ్యం 3.082 టీఎంసీలు. పూర్తయితే తిరుపతితోపాటు తిరుమలకు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించొచ్చు.
మల్లెమడుగు జలాశయం: నీటి నిల్వ సామర్థ్యం 2.683 టీఎంసీలు. పనులు 44 శాతమే పూర్తయ్యాయి. రెండో దశ అటవీ అనుమతులు రాకపోవడంతో నిలిపేశారు. ఇటు బాలాజీ జలాశయంతోపాటు అటు సోమశిల స్వర్ణముఖి లింకు కాలువ ద్వారా మేర్లపాక నుంచి నీటిని తరలించడానికి ప్రణాళికలున్నాయి.
వేణుగోపాలసాగర్ ప్రాజెక్టు: నీటి నిల్వ సామర్థ్యం 2.68 టీఎంసీలు. 29 శాతం పనులే పూర్తయ్యాయి. అటవీ సమస్యలను పరిష్కరించలేకపోయారు. 25,800 ఎకరాలకు నీరివ్వాలన్నది లక్ష్యం.
అడవికొత్తూరు జలాశయం: 10 వేల ఎకరాలకు నీరందేలా ఒక టీఎంసీ సామర్థ్యంతో నిర్మాణం ఎప్పుడో మొదలైంది. 5 వేల ఎకరాలకు నీళ్లిచ్చేలా 0.533 టీఎంసీల సామర్థ్యంతో వేపగుంట జలాశయం నిర్మిస్తున్నారు.
ఈ 5 జలాశయాలకు నీరందేనా?
గాలేరు నగరి రెండో దశలో కోడూరు వరకు నీళ్లిస్తామని జగన్ సర్కారు ప్రకటిస్తున్నా ఆ పనులు వేగంగా సాగడం లేదు. కోడూరు వరకు పనులే ఇంకా పూర్తి కాలేదు. ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో అయిదు జలాశయాలకు నీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఏడు ప్యాకేజీల్లోని పనులు పూర్తి కాకుండానే రద్దు చేసేశారు. మిగిలి ఉన్న పనులకు మళ్లీ అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. మళ్లీ టెండర్లు పిలిచి పనులు చేపట్టాల్సి ఉంది. ఈ నాలుగేళ్లలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక్క రూపాయి ఖర్చు చేసిందీ లేదు. ఈ జలాశయాలు నిర్మిస్తే వాటి పరీవాహకం నుంచే ఒక్కో టీఎంసీ నీరు అందుతుందని అంచనాలు వేశారు. మరో అయిదు టీఎంసీల కృష్ణా వరద జలాలు మళ్లిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటర్ల సహనానికి ఈసీ పరీక్ష
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
వందనమమ్మా.. డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.