Chandrababu: ఏ తప్పూ జరగలేదు.. సీఐడీ ప్రశ్నలకు తెదేపా అధినేత చంద్రబాబు సమాధానాలు
సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు తెదేపా అధినేత చంద్రబాబు సూటిగా, స్పష్టంగా సమాధానాలిచ్చారు.
తొలిరోజు దాదాపు 5 గంటల పాటు విచారణ
ఈనాడు-అమరావతి, రాజమహేంద్రవరం, న్యూస్టుడే-దానవాయిపేట: సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు తెదేపా అధినేత చంద్రబాబు సూటిగా, స్పష్టంగా సమాధానాలిచ్చారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు, శిక్షణ సహా వాటికి సంబంధించి ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగలేదని, అంతా నిబంధనల ప్రకారమే నడిచిందని తేల్చిచెప్పారు. దర్యాప్తు అధికారులు ఎన్ని రకాలుగా ప్రశ్నించినా ఏ నిర్ణయం, ఎందుకు తీసుకున్నామనేది ఎలాంటి శషభిషలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా వివరాలు వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి తొట్రుపాటు లేకుండా ధీమాగా సమాధానాలిచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి తప్పిదమూ చోటుచేసుకోలేదని చెప్పారు. వైకాపా ప్రభుత్వం, సీఐడీ అధికారులు.. జరగని కుంభకోణం జరిగినట్లు దుష్ప్రచారం చేస్తుండటం చాలా బాధాకరమని అన్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో చంద్రబాబును రెండు రోజుల కస్టడీకి తీసుకున్న సీఐడీ అధికారులు తొలిరోజైన శనివారం ఆయన్ను దాదాపు అయిదు గంటల పాటు విచారించారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం లోపల ఉన్న కాన్ఫరెన్స్ హాలులో ఈ విచారణ కొనసాగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సీఐడీ అధికారులు అడిగినవాటిలో కొన్ని ప్రశ్నలు, వాటికి చంద్రబాబు చెప్పిన సమాధానాల వివరాలిలా ఉన్నాయి.
సీఐడీ: ఘంటా సుబ్బారావు, కె.లక్ష్మీనారాయణను నైపుణ్యాభివృద్ధి సంస్థలో కీలక బాధ్యతల్లో ఎందుకు నియమించారు?
చంద్రబాబు: ప్రపంచంలోని అత్యుత్తమ సాఫ్ట్వేర్ నిపుణుల్లో ఘంటా సుబ్బారావు ఒకరు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి కూడా ఆయనకు మూడు కీలక పదవులిచ్చారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఆయన్ను నైపుణ్యాభివృద్ధి సంస్థలో నియమించొచ్చేమో పరిశీలించాలని అధికారులకు సూచించాను. ఆయన నియామకం బిజినెస్ రూల్స్కు అనుగుణంగానే జరిగింది. ఎగ్జిక్యూటివ్, ఆర్థిక అధికారాలు ఇవ్వలేదు. కె.లక్ష్మీనారాయణ గతంలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఆయన అనుభవాన్ని వినియోగించుకోవటం సముచితంగా ఉంటుందని నైపుణ్యాభివృద్ధి సంస్థలోకి తీసుకున్నాం. ఈ నియామకం కూడా నిబంధనల ప్రకారమే జరిగింది.
నైపుణ్యాభివృద్ధి సంస్థను ఎందుకు ఏర్పాటుచేశారు?
యువత కోసం సాధ్యమైనన్ని ఎక్కువ ఉద్యోగాలు సృష్టించాలనేది మా పార్టీ విధానం. ఉద్యోగాలు రావాలంటే యువతలో నైపుణ్యాలు పెంచాలి. ఆ దిశగా అవసరమైన శిక్షణ ఇచ్చి వారిని తీర్చిదిద్దడానికి వివిధ రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటుచేశా. దీనిద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించాం. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఏదో కుంభకోణం జరిగిపోయిందంటూ మీరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం.
నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆడిటర్గా వెంకటేశ్వర్లును నియమించాలని మీరే ఆదేశించారట కదా?
అలాంటి ఆదేశాలు నేను ఇవ్వలేదు. నైపుణ్యాభివృద్ధి సంస్థ డైరెక్టర్ల బోర్డు ఆయన్ను నియమించుకుంది. ఆ నియామకంతో నాకు సంబంధం లేదు.
కొన్ని నిర్ణయాలు పేరుకే మంత్రివర్గ నిర్ణయాలు తప్ప.. అవన్నీ మీ సొంత నిర్ణయాల్లానే కనిపిస్తున్నాయి?
ముఖ్యమంత్రి కూడా మంత్రివర్గంలో ఒక సభ్యుడు మాత్రమే. నిర్ణయాలన్నీ మంత్రివర్గం సమష్టిగా తీసుకుంటుంది. ఒక్కోసారి మంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. కొన్ని అంశాలను తిరస్కరిస్తుంటారు. మరికొన్ని అంశాలపై నిర్ణయాల్ని వాయిదా వేస్తుంటాం. ఎప్పుడూ ముఖ్యమంత్రిదే అంతిమనిర్ణయం కాదు.
మధ్యాహ్నం 12 నుంచి విచారణ మొదలు..
ఉదయం 9.30కు విచారణ ప్రారంభించాల్సిన సీఐడీ అధికారులు 9.45కి జైలు ప్రాంగణానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబును విచారణకు పిలిచారు. 10-15 నిమిషాల పాటు ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించారు. సీఐడీ కస్టడీపై కోర్టు ఇచ్చిన ఆర్డర్ను చంద్రబాబుకు అందించి.. అది ఆయన చదివిన తర్వాత 12.15 నుంచి విచారణ ప్రారంభించారు. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ విచారణ కనిపించేంత దూరంలో ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు విచారణ ముగిసినా, వాంగ్మూలాల నమోదు తదితర ప్రక్రియల కోసం మరో గంట సమయం తీసుకున్నారు. విచారణ ప్రక్రియ పూర్తయ్యాక రాత్రి 7.08 గంటలకు సీఐడీ దర్యాప్తు అధికారుల బృందం జైలు నుంచి బయటకు వచ్చింది. సీఐడీ అధికారులు బసచేసిన రహదారులు, భవనాల శాఖ అతిథిగృహం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
AP Liquor: బ్రాండ్ విచిత్రం.. పురుగు ఉచితం!
శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి వాల్మీకి కూడలిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో కొన్న మద్యం సీసాలో పురుగు కనిపించడం కలకలం రేపింది. -
YS Jagan: సీఎం క్యాంపు కార్యాలయంపై పాలకులకైనా స్పష్టత ఉందా?
ఒకవైపు విశాఖలోని రిషికొండపై రూ.వందల కోట్లు ఖర్చు చేసి క్యాంపు కార్యాలయం సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో తాడేపల్లిలోని ప్రస్తుత కార్యాలయాన్నీ సుందరీకరిస్తున్నారు. -
Andhrapradesh news: సీఎం నిర్ణయాలా కాకమ్మ కబుర్లా?
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాల భద్రత, నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అన్ని ప్రాజెక్టుల భద్రతపై అధ్యయనం చేయాలి. -
ఒప్పంద సమయంలో తప్పించుకున్నారా!
గనుల శాఖలో ఆయనో కీలక అధికారి.. ఆ శాఖలో అసలు బాస్ తర్వాత ఆయనదే ముఖ్యమైన పోస్టు. అటువంటి అధికారి దాదాపు నెల రోజులుగా సెలవులో ఉన్నారు. -
Jogi ramesh: ఒక రాష్ట్రంలోనే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలి
సుమారు 16 లక్షల మందికి ఏపీ, తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లోనూ ఓట్లు ఉన్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని మంత్రులు జోగి రమేశ్, మేరుగు నాగార్జున అన్నారు. -
టీసీ కొలువంటే నమ్మేశారట.. కోటు ఇస్తే రైలెక్కేశారట!
రైల్వేలో టీసీ ఉద్యోగమని చెప్పి ఓ వ్యక్తి కొందరు యువకులను నమ్మించి, నకిలీ ఐడీ కార్డులిచ్చి, శిక్షణ పేరుతో కేసులు రాయిస్తున్నాడు. -
జగన్ మార్కు నిరంకుశత్వం
బాధితుల్ని పరామర్శించడం.. అధికార పార్టీ నాయకుల అక్రమాల్ని బయటపెట్టడం... ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలపడం... ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు. -
ఎంఎస్ఎంఈలకు ఫిబ్రవరిలో ప్రోత్సాహకాలు
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహక బకాయిల్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చెల్లించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక ప్రోత్సాహకాల్ని చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం.. తాజాగా వచ్చే ఏడాది ఫిబ్రవరికి గడువును మార్చింది. -
ఆ కలెక్టర్ల తీరు దారుణం
రాష్ట్రంలో శ్రీకాకుళం, కోనసీమ, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల కలెక్టర్లు వైకాపా కార్యకర్తల కంటే దారుణంగా పనిచేస్తూ, వైకాపా అక్రమాలకు ఆమోదముద్ర వేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. -
ఎంఎస్ఎంఈలకు రుణాలు అందించేలా సిడ్బీతో ఒప్పందం
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు రుణ సహకారాన్ని అందించేలా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ), ఏపీఐఐసీ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. -
విదేశాల్లో దీక్షా దివస్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబరు 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకొని భారాస ప్రవాస విభాగాల ఆధ్వర్యంలో బుధవారం 52 దేశాల్లో దీక్షా దివస్ నిర్వహించారు. -
సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి: కేవీపీఎస్
రాజకీయ క్రీడల్లో దళితులను బలి చేయొద్దని కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి(కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఒ.నల్లప్ప, అండ్ర మాల్యాద్రిలు విజ్ఞప్తి చేశారు. -
కృష్ణా డెల్టా కాలువలకు ఆగిన నీటి సరఫరా
కృష్ణా డెల్టా కాలువలకు సాగునీరు నిలిచిపోయింది. ఆయకట్టులో కొన్నిచోట్ల ఇంకా వరి పంట చేతికి రాలేదు. ఈ పరిస్థితుల్లో తాము నష్టపోవడం ఖాయమని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
పూల వ్యర్థాలతో పరిమళాలు
విజయవాడ నగరంలో దేవాలయాలు, పూల మార్కెట్ల నుంచి నిత్యం టన్నుకు పైగా పూల వ్యర్థాలు పోగవుతున్నాయి. -
ధవళేశ్వరం బ్యారేజి సమీపంలో ఇసుక తవ్వకాలపై హైకోర్టు స్టే
గోదావరి నదిలో ధవళేశ్వరం బ్యారేజి సమీపంలో ఇసుక తవ్వకాలను నిలిపివేస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. తవ్వకాలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. -
‘గడప గడప’లో ప్రశ్నించారని పోలీసులకు ఫిర్యాదు
‘గడపగడపకు మన ప్రభుత్వం’లో గోడు వెల్లబోసుకోవడమే ఆ తల్లీకుమారుల తప్పైంది. ఏకంగా ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకున్నారంటూ బుధవారం వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణలో ఓటర్లుగా ఉన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు
తెలంగాణలో గురువారం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఓటర్లుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ఉత్తర్వులిచ్చింది. -
కర్నూలు జిల్లాలో పవన విద్యుత్ ప్రాజెక్టుకు అనుమతి
కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేలా ఎకోరెన్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సంస్థకు అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
స్తంభించిన టెలి వైద్యం.. రోగులకు అవస్థలు
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల (సీహెచ్ఓ) ఆందోళనల వల్ల ఆరోగ్య ఉపకేంద్రాల ద్వారా రోగులకు అందాల్సిన టెలి వైద్యసేవలు స్తంభించాయి. -
రాష్ట్రంపై నాలుగు రోజులు తుపాను ప్రభావం
ఆగ్నేయ బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ పరిసరాల్లో అల్పపీడనం తీవ్రంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
విద్యామృత్ మహోత్సవ్ ఫలితాల్లో రాష్ట్రానికి రెండు పతకాలు
‘విద్యామృత్ మహోత్సవ్ 2022-2023’లో భాగంగా ‘ఇన్నోవేటివ్ పెడగాజీ’ ప్రాజెక్టు పోటీల్లో రాష్ట్రానికి రెండు స్థానాలు దక్కాయని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Henry Kissinger: మోదీ ప్రసంగం వినేందుకు వీల్ఛైర్లో కిసింజర్ వచ్చిన వేళ..!
-
Modi: కుర్చీ పట్టుకోమ్మా..లేకపోతే ఆమె కూర్చుంటుంది..!: చమత్కరించిన మోదీ
-
JEE Main 2024: జేఈఈ మెయిన్కు దరఖాస్తు చేసేవారికి బిగ్ అప్డేట్
-
Jerusalem: జెరూసలెంలో ఉగ్రదాడి.. ముగ్గురు మృతి..!
-
holidays list: ఏపీలో వచ్చే ఏడాది 20 సాధారణ సెలవులు
-
Indian Navy: భారత నౌకాదళం చేతికి మూడు అత్యాధునిక నౌకలు..!