icon icon icon
icon icon icon

Amaravati: అధికారుల తప్పిదం.. ఆందోళనలో 1,219 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లో గందరగోళం తలెత్తింది.

Updated : 06 May 2024 22:10 IST

అమరావతి:  పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లో గందరగోళం తలెత్తింది. అధికారుల తప్పిదం కారణంగా 1219 మంది ఉద్యోగుల ఓట్లు ప్రశ్నార్థకంగా మారాయి. నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియను ఆదివారం నాదెండ్ల మండలం గణపవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే పీవో, ఏపీవో, ఓపీవోలకు పోస్టల్‌ బ్యాలెట్‌ నమోదుకు అవకాశం కల్పించారు. మొత్తం 1219 మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు బారులు తీరి ఓట్లు వేశారు.

కార్యక్రమం పూర్తయిన తర్వాత అధికారులు పొరపాటును గుర్తించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు బదులు ఈవీఎంలో పెట్టే బ్యాలెట్‌ను ఉద్యోగులకు అందజేశారు. వారు దానిపైనే ఓటు వేశారు. ఓటింగ్‌ పూర్తయిన తర్వాత గుర్తించిన అధికారులు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనాకు కలెక్టర్ నివేదిక ఇచ్చారు. తెదేపా నేతలు వర్ల రామయ్య, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు సీఈవో ముకేశ్‌ కుమార్‌ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. 1219 మంది ఉద్యోగులు ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని కోరారు. రీ పోలింగ్‌ నిర్వహించాలని, పొరపాటు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img