Viveka Murder Case: వివేకా కుమార్తె, అల్లుడు, సీబీఐ ఎస్పీపై ఛార్జిషీట్‌ దాఖలు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు పలు మలుపులు తిరుగుతోంది. తాజాగా వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై శుక్రవారం పులివెందుల కోర్టులో స్థానిక పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు.

Updated : 30 Dec 2023 07:05 IST

పులివెందుల, న్యూస్‌టుడే: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు పలు మలుపులు తిరుగుతోంది. తాజాగా వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై శుక్రవారం పులివెందుల కోర్టులో స్థానిక పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పమంటూ సీబీఐ ఎస్పీ, వివేకా కుమార్తె, అల్లుడు తీవ్రస్థాయిలో తనను ఒత్తిడికి గురి చేస్తున్నారంటూ 2021 నవంబర్‌లో పులివెందుల పోలీసులకు వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. పోలీసులు కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ 2021 డిసెంబరు 28న పులివెందుల కోర్టును కృష్ణారెడ్డి ఆశ్రయించారు. ఈ ఏడాది డిసెంబర్‌ 8న కోర్టు పిటిషన్‌ను పరిశీలించి కేసు రిజిస్టర్‌ చేసి జనవరి 4న తుది నివేదిక దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు వివేకా హత్య కేసుపై దర్యాప్తు చేసిన మొదటి, రెండో సిట్ బృందాల వద్ద ఉన్న వివరాలు, క్లూస్‌ బృందం వద్ద ఉన్న ఇతర ఆధారాలు, సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలను ఛార్జిషీట్లో పొందుపరుస్తూ పులివెందుల అర్బన్‌ సీఐ కోర్టుకు సమర్పించారు. 27 మంది సాక్షుల వాంగ్మూలాలను కూడా కోర్టుకు అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని