దేవుడా.. నువ్వే దిక్కు!
వైకాపా నేతలు అధికారగర్వంతో రెచ్చిపోతున్నారు. అర్చకులు, పురోహితులపై రౌడీల్లా దాడులకు తెగబడుతూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు.
ఆలయంలోనే దుర్భాషల దండకం
జగన్ ప్రభుత్వంలో అయిదేళ్లుగా ఇదే తంతు
కఠిన చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్న సర్కారు
కాకినాడ శివాలయం ఘటనతో మరోసారి చర్చనీయాంశమైన వైకాపా నేతల తీరు
ఈనాడు - అమరావతి
వైకాపా నేతలు అధికారగర్వంతో రెచ్చిపోతున్నారు. అర్చకులు, పురోహితులపై రౌడీల్లా దాడులకు తెగబడుతూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. అర్చకులను భక్తులు ఎంతో భక్తిభావంతో చూస్తారు. అలాంటివారిపై అధికారపార్టీ నేతలు తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ, దాడులు చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి రాష్ట్రంలో ఎక్కడోచోట ఇలాంటి దాడులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇలా జరిగినప్పుడల్లా అర్చకులు, పురోహితులు, బ్రాహ్మణ సంఘాలు రోడ్డెక్కి నిరసన తెలిపినా, అధికారపార్టీ నేతల్లో ఏమాత్రం మార్పు లేదు. ఇలాంటివారిపై ఒక్కసారైనా ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటే, మరోసారి జరిగేవి కావు. కానీ వైకాపా ప్రభుత్వం తమ నేతలను కాపాడే ప్రయత్నాలే చేస్తోంది. దీంతో వీరు మరింత రెచ్చిపోయి అర్చకులపై దాడులు కొనసాగిస్తున్నారు. కాకినాడలోని పురాతన శివాలయంలో వైకాపా నేత, మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రరావు ఇద్దరు అర్చకులపై దాడిచేయడంతో.. మరోసారి వైకాపా నేతల తీరు చర్చనీయాంశమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల అర్చక, బ్రాహ్మణ సంఘాలు దీనిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.
చర్నాకోలాతో వాతలు పడేలా దాడి..
ఉమ్మడి కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలం ఓంకార క్షేత్రంలో 2020 నవంబరులో పూజారులపై ఆలయ ఛైర్మన్ తదితరులు చర్నాకోలాతో దాడిచేసి, వాతలు పడేలా కొట్టారు.
కార్తికపౌర్ణమి రోజున టికెట్ల ద్వారానే కాకుండా, భక్తులకు ఉచిత దర్శనాలకూ అవకాశం ఇవ్వాలని ఆలయ పూజారులు చక్రపాణిశర్మ, సుధాకర్శర్మ, మురుగు ఫణిశర్మ సూచించారు. దీంతో ఆలయ పాలకమండలి ఛైర్మన్ ప్రతాప్రెడ్డి, ఆయన సోదరుడు, వారి అనుయాయులైన అక్కడి అటెండర్లు కలిసి.. పూజారులపై దాడిచేశారు. ఉత్సవాల్లో వినియోగించే చర్నాకోలా తీసుకొని పూజారులను ఇష్టానుసారం కొట్టారు. ఈ ఘటనలో మురుగు ఫణిశర్మకు వాతలు పడ్డాయి. దీంతో అప్పట్లో ఆలయ ఛైర్మన్తో రాజీనామా చేయించి వదిలేశారు. అటెండర్లుగా పనిచేసే ఈశ్వరయ్య, నాగరాజులను సస్పెండ్ చేసినా, మళ్లీ కొంత కాలానికే నాగరాజుకు వేరొక ఆలయంలో పోస్టింగ్ ఇచ్చారు.
జంధ్యాన్ని తెంచేసి..
పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరంలోని సోమేశ్వరస్వామి ఆలయంలో సహాయ అర్చకుడు నాగేంద్రపవన్పై ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్ భర్త యుగంధర్ గతేడాది ఆగస్టులో దాడిచేశారు. అంతరాలయంలో అడ్డుగా నిలబడి ఉన్న యుగంధర్ను పక్కకు జరగాలని చెప్పినందుకు.. నాగేంద్రపవన్పై దురుసుగా వ్యవహరించి, దాడిచేసి, మెడలోని జంధ్యాన్ని తెంచేశారు. దీంతో ఆలయ ఛైర్మన్తో ఆ పదవికి రాజీనామా చేయించి సరిపెట్టారు.
దాడిచేసినా కేసు నమోదు చేయకుండా..
గుంటూరు నగరంలోని గోరంట్లలో పద్మావతీ ఆండాళ్ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ అర్చకుడు సాయిచరణ్పై గతేడాది సెప్టెంబరులో అధికారపార్టీ నేత, ఆలయ కమిటీ కార్యదర్శి మేడా సాంబశివరావు, మేనేజర్ లక్ష్మీనారాయణ దాడిచేశారు. సెలవు కావాలని అడిగినందుకు దూషించి, కర్రతో దాడిచేయడంపై అర్చకుడు సాయిచరణ్ సెప్టెంబరు 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో ఆ నెల 28 వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. వైకాపా నేతలను అరెస్టు చేయాలంటూ అర్చక సమాఖ్య, బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసనలు చేయడంతో చివరకు కేసు నమోదుచేసి, ఇద్దరినీ అరెస్టు చేశారు.
అధికారులదీ చులకన భావనే..
అర్చకుల విషయంలో దేవాదాయశాఖ అధికారులు కూడాచులకనగా వ్యవహరిస్తున్నారు. వారిని వేధించే ఘటనలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
- సత్యసాయి జిల్లా కదిరిలో ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గత ఆగస్టులో జరిగిన పాలకమండలి సమావేశానికి ముఖ్య అర్చకుడు అంజన్కుమార్ హాజరుకాగా, ఆయన్ను బయటకు వెళ్లిపోవాలని ఈవో శ్రీనివాసరెడ్డి రుసరుసలాడారు. ఈవో తీరును నిరసిస్తూ అర్చకులు, బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చివరకు దేవాదాయశాఖ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ అక్కడికి వెళ్లి రాజీ చేశారు.
- పల్నాడు జిల్లా కోటప్పకొండలో గతేడాది అక్కడ పనిచేసిన ఈవో గోపి.. కొత్తగా వివిధ పూజలను ఆరంభించారు. అర్చనలు, పూజలను తాను చెప్పినప్పుడే చేయాలని ఒత్తిళ్లు తెచ్చారు. ఇవి సాంప్రదాయానికి విరుద్ధమని అర్చకులు అభ్యంతరం చెప్పారు. దీంతోఇరువురిమధ్య వివాదం ఏర్పడింది. చివరకు ఈవోని అక్కడి నుంచి బదిలీచేశారు.
పురోహితుల కోసం వేలం..
అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయంలో గతేడాది ఇన్ఛార్జ్ ఈవోగా పనిచేసిన చంద్రశేఖర్ ఆజాద్ పురోహితుల విషయంలో తీసుకున్న నిర్ణయాలు వివాదంగా మారాయి. ఆలయ సన్నిధిలో వివాహాలు, ఉపనయనాలు చేసుకునేవారికి సింగిల్విండో విధానంలో దేవస్థానం తరఫునే అన్నీ సరఫరా చేస్తామని ఈవో పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన పురోహితుల సరఫరా కోసం గుత్తేదారు ఎంపికకు గత ఏడాది జులైలో టెండర్లు ఆహ్వానించడం తీవ్రస్థాయిలో విమర్శలకు దారితీసింది. పురోహితుల కోసం వేలం నిర్వహిస్తారా? అంటూ అర్చకులు, పురోహితులు మండిపడ్డారు. దీంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
అన్నవరం కొండపై ఉండే పురోహితులు కాకుండా, బయటినుంచి పురోహితులను తీసుకొస్తే.. వివాహానికి రూ.5వేలు, ఉపనయనానికి రూ.2వేలు చెల్లించాలనే నిబంధనతీసుకొచ్చారు. దీనిపై అంతా ఆగ్రహం వ్యక్తంచేసి, ఆందోళనలు చేయడంతో ఆ నిర్ణయాన్నీ ఉపసంహరించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు