దురుద్దేశం ఎవరిది సీఎస్గారూ?
‘మేం చేసేది చేసేస్తాం.. మా ఇష్టానుసారం ప్రవర్తిస్తాం.. అధికార పార్టీకి కొమ్ముకాస్తాం.. అయినా మీరెవరు మమ్మల్ని ప్రశ్నించడానికి?’ అన్నట్టు ఉంది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి తీరు!
వివాదాస్పద అధికారుల పేర్లు పంపడం సదుద్దేశమా?
ఈనాడు - అమరావతి
‘మేం చేసేది చేసేస్తాం.. మా ఇష్టానుసారం ప్రవర్తిస్తాం.. అధికార పార్టీకి కొమ్ముకాస్తాం.. అయినా మీరెవరు మమ్మల్ని ప్రశ్నించడానికి?’ అన్నట్టు ఉంది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి తీరు! తాజాగా ఎన్నికల సంఘం బదిలీ చేసిన కొన్ని జిల్లాల ఎస్పీల స్థానంలో మళ్లీ వివాదాస్పద అధికారుల పేర్లను సీఎస్ ప్రతిపాదించడం, వారిని జిల్లా ఎస్పీలుగా ఈసీ నియమించడంపై శుక్రవారం ‘ఈనాడు’లో ‘వీళ్లా కొత్త ఎస్పీలు?’ శీర్షికన వచ్చిన కథనంపై సీఎస్ ఉలిక్కిపడ్డారు. దాన్ని ఖండిస్తూ, సుదీర్ఘ వివరణ ఇస్తూ శుక్రవారం లేఖ విడుదల చేశారు. అలాంటి కథనాల వల్ల అధికారుల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని, నైతిక స్థైర్యం దెబ్బతింటుందని, ప్రజాస్వామ్య వ్యవస్థకే అది ప్రమాదమని తెగ బాధపడిపోయారు. ‘ఈనాడు’ కథనానికి దురుద్దేశాలను ఆపాదించేందుకు ప్రయత్నించారు. పైగా ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఎలా ప్రశ్నిస్తారంటూ.. పసలేని వాదనను తెరపైకి తెచ్చారు. సీఎస్ విడుదల చేసిన ఆ లేఖను లోతుగా పరిశీలిస్తే ఆయన వాదనలోని డొల్లతనం బయటపడుతుంది.
వాళ్లు వివాదాస్పదులని మీకు తెలీదా సీఎస్ గారూ?
సీఎస్ ఏం చెప్పారు: ‘ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక వివిధ కారణాల వల్ల బదిలీ చేసిన వారి స్థానంలో నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారుల పేర్లను మాత్రమే సూచిస్తుంది. వారిలో ఎవరిని నియమించాలన్నది పూర్తిగా ఈసీ అధికారం. సీనియారిటీ, అనుభవం వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని అధికారుల ప్యానల్ను ప్రతిపాదించడం వరకే రాష్ట్ర ప్రభుత్వ పాత్ర పరిమితం.’
జరిగిందేంటి?: అంతవరకు సీఎస్ చెప్పింది నిజమే! ఒక్కో పోస్టుకు ముగ్గురు అధికారుల పేర్లు సీఎస్ ప్రతిపాదిస్తారు. వారిలో ఒకరిని ఎన్నికల సంఘం ఎంపిక చేస్తుంది. ఎలాంటి అధికారుల పేర్లు సీఎస్ పంపించారన్నదే ఇక్కడ చర్చనీయాంశం. ఒక్క నెల్లూరు ఉదాహరణనే తీసుకుంటే అక్కడ ఎస్పీగా నియమితులైన అరిఫ్ హఫీజ్ ఎంత వివాదాస్పద అధికారో.. ఆయన గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు అధికార పార్టీకి ఎంతగా కొమ్ముకాశారో అందరికీ తెలుసు. ఎన్నికల సమయంలో అలాంటి అధికారి పేరును ఒక జిల్లా ఎస్పీ పోస్టుకు సీఎస్ ఎలా ప్రతిపాదిస్తారు? అరిఫ్తో పాటు సీఎస్ ప్రతిపాదించిన మిగతా ఇద్దరూ కన్ఫర్డ్ ఐపీఎస్ అధికారులు. వారికి గతంలో ఏ జిల్లాకూ ఎస్పీగా పనిచేసిన అనుభవం లేదు. విధిలేని పరిస్థితుల్లో ఆ ముగ్గురిలోను అరిఫ్ను నెల్లూరు ఎస్పీగా ఈసీ ఎంపిక చేసింది. ఈసీకి ప్రతి రాష్ట్రంలోనూ సొంతంగా విస్తృత యంత్రాంగమేమీ ఉండదు కదా? సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై, ముఖ్యంగా సీఎస్లపైనే కదా ఆధారపడుతుంది? కలెక్టర్లు, ఎస్పీల వంటి కీలకమైన పోస్టుల్లో నియమించేందుకు వివాదాలకు అతీతంగా ఉండే అధికారులను ప్రతిపాదించాల్సిన బాధ్యతను సీఎస్ ఉద్దేశపూర్వకంగానే విస్మరించారని, జిల్లాల ఎస్పీలుగా నియమించేందుకు ఆయన పంపించిన పేర్లను చూస్తేనే అర్థమవుతుంది. ఆ ఎస్పీల నియామకంతో తనకేమీ సంబంధమే లేనట్టుగా సీఎస్ చెప్పడం విస్తుగొలుపుతోంది.
ఈసీని అడ్డుపెట్టుకునే యత్నం
సీఎస్ ఏం చెప్పారు: ‘కేంద్ర ఎన్నికల సంఘం కీలకమైన అధికారులను ఎంపిక చేసిన తీరును ప్రశ్నించడం ప్రమాదకరమైన సంప్రదాయానికి దారితీస్తుంది. ప్యానల్లోని అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడం వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఎన్నికల సంఘం వంటి సంస్థలు తీసుకునే నిర్ణయాలపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులను దెబ్బతీస్తుంది.’
జరిగిందేంటి?: ‘ఈనాడు’ కథనం ఏదో ఈసీ అస్తిత్వాన్నే దెబ్బతీసేదిగా ఉన్నట్టుగా సీఎస్ వక్రీకరించేందుకు ప్రయత్నించారు. ఆ కథనంలో ‘ఈనాడు’ ఎక్కడా ఈసీ నిర్ణయాలను ప్రశ్నించలేదు. ఈసీపై తప్పుడు సమాచారం ప్రచురించలేదు. వివాదాస్పద అధికారులను ఎస్పీలుగా సీఎస్ ఎలా ప్రతిపాదించారని మాత్రమే ఆ కథనం ప్రశ్నించింది. ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టిస్తున్నారన్నదే దాని సారాంశం.
దురుద్దేశంతో వ్యవహరిస్తోంది ఎవరు?
సీఎస్ ఏం చెప్పారు: ‘అఖిల భారత సర్వీసు అధికారుల నియామకంపై చీఫ్ సెక్రటరీకి దురుద్దేశాల్ని ఆపాదించడం స్వార్థ ప్రయోజనాల కోసమే’
జరిగిందేంటి?: ఎవరిది దురుద్దేశం? ఎవరిది స్వార్థ ప్రయోజనం? కీలకమైన ఎన్నికల వేళ వివాదాస్పద ఎస్పీలను బదిలీ చేసి వారి స్థానంలో సమర్థులను, నిష్పాక్షికంగా వ్యవహరించేవారిని ప్రతిపాదించమని ఈసీ కోరితే.. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న అధికారుల పేర్లు పంపించడం దురుద్దేశం కాదా? ఈసీ కళ్లకు గంతలు కట్టడం దురుద్దేశం కాదా? పండుటాకుల్లాంటి వృద్ధులకు ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలన్న బాధ్యతను విస్మరించి మండుటెండల్లో వారిని గ్రామ, వార్డు సచివాలయాలకు రప్పించడం దురుద్దేశం కాదా? ఆ నెపాన్ని విపక్షాలపై నెట్టేసి రాజకీయ ప్రయోజనం పొందేందుకు అధికార వైకాపా వేసిన పన్నాగానికి సహకరించేలా వ్యవహరించడం దురుద్దేశం కాదా? అధికార పార్టీ ఎక్కడికక్కడ వృద్ధులను, వికలాంగులను మంచాలు, వీల్ఛైర్లపై సచివాలయాల వద్దకు తీసుకెళుతూ, ప్రతిపక్షాలపై బురద జల్లుతుంటే తగిన చర్యలు తీసుకోకుండా చోద్యం చూడటం దురుద్దేశం కాదా? రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండి ఇటీవల చిలకలూరిపేటలో సాక్షాత్తు ప్రధాని పాల్గొన్న ఎన్డీయే సభకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం దురుద్దేశం కాదా? రాష్ట్రంలో పలువురు అధికారులు ఇప్పటికీ వైకాపాతో అంటకాగుతున్నా చర్యలు తీసుకోకపోవడాన్ని ఏమంటారు? దురుద్దేశం అనరా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఒప్పంద ఉద్యోగులకు పోలింగ్ డ్యూటీ వేసిన అధికారులు.. వారు పోస్టల్ బ్యాలట్ వినియోగించుకోకుండా చేశారు. -
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఐటీని పూర్తిగా నిర్వీర్యం చేసింది. హెచ్ఎస్బీసీ, ఐబీఎం వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే విశాఖను వదిలి వెళ్లిపోయాయి. -
ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారు
వివిధ రకాల స్కీములు పెట్టి ప్రజల జేబుల్ని కొల్లగొట్టే గొలుసుకట్టు కంపెనీల కథలెన్నో విన్నాం కదా? ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు.. రాష్ట్రంలో అదే తరహాలో వ్యవహరిస్తోంది. -
జగన్ పంతం.. జలయజ్ఞ విధ్వంసం!
తడిచెమ్మ తగలని కృష్ణా డెల్టా చేలు బీడుపడ్డాయి. ‘కాలువ నీరెప్పుడు వస్తుందంటే చెప్పరు.. ఈ కష్టాల సాగు మావల్ల కాదు’ అంటూ గోదావరి రైతు పంట విరామం ప్రకటించాడు. -
జగన్ జమానాలో.. ఆశా ‘నిరాశై’..!
ప్రజారోగ్యంలో కీలకంగా వ్యవహరించే ఆశా కార్యకర్తల బతుకులతో సీఎం జగన్ ఆడుకున్నారు. పని భారాన్ని పెంచి, వారితో వెట్టిచాకిరీ చేయించారు. తాత్కాలిక పద్ధతిలో పనిచేసే వీరికి సంక్షేమ పథకాలను దూరం చేశారు. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
ఎన్నికల వేళ ‘జగన్మాయ’!
ఎన్నికల వేళ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం దిమ్మదిరిగే షాకిచ్చింది..! బుధవారం ఉదయం నుంచే సెల్ఫోన్కి వస్తున్న మెసేజ్లు చూసి ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
ఆంధ్రా పారిస్లో అ‘న్న’న్నా!
‘నాకు మంచి స్నేహితుడు’ అని ముఖ్యమంత్రి జగన్ ఆ ప్రజాప్రతినిధిని ఇటీవల ఓ సభలో ప్రజలకు పరిచయం చేశారు. -
అత్యవసర వాహనానికి ఆపద!
తిరుపతి నుంచి రేణిగుంట వైపు వెళ్తున్న ఓ 108 వాహనం బుధవారం ఉదయం ఇలా నడిరోడ్డుమీదే ఆగిపోయింది. -
21 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో బుధవారం 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 118 మండలాల్లో వడగాలులు వీచాయి. 21 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
విజ్ఞతతో ఓటేద్దాం.. అభివృద్ధికి బాటేద్దాం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోస్టుమ్యాన్ పురుష్తోతం తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. -
మద్యం ఆదాయం.. ఐదేళ్లలో నాలుగు రెట్లు!
‘రాష్ట్రానికి ఏటా సుమారు రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం వస్తుంటే.. అందులో రూ.72వేల కోట్లు జీఎస్టీ, వ్యాట్, రిజిస్ట్రేషన్లు, మద్యం అమ్మకాల ద్వారా వస్తోంది. -
నేరచరిత్ర, ఆస్తుల వివరాలను అభ్యర్థులు ప్రకటించుకోవాల్సిందే
సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్ర, ఆస్తుల వివరాలను స్వతంత్రంగా పత్రికల్లో ప్రచురించుకోవాలని, ఆయా పార్టీల వెబ్సైట్లో వివరాలను ఉంచాలని హైకోర్టు స్పష్టం చేసింది. -
పంచాయతీ భవనంలో మద్యం నిల్వలు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏకంగా పంచాయతీ భవనంలోనే మద్యం నిల్వలు దాచిపెట్టిన ఉదంతం కలకలం రేపింది. -
రూ.80 లక్షల విలువైన మద్యం ధ్వంసం
ఎన్నికల్లో పంపిణీ చేయడానికి అక్రమంగా నిల్వ ఉంచిన రూ.80 లక్షల విలువైన 58,032 క్వార్టర్ల గోవా మద్యం సీసాలను కృష్ణా జిల్లా పోలీసులు బుధవారం ధ్వంసం చేశారు. -
చందనోత్సవం వేళ.. సింహాచలం డీసీకి కమిషనరేట్లో బాధ్యతలు
సింహాచలంలో ఈనెల 10న సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరగనుంది. గతేడాది ఇదే చందనోత్సవంలో అధికార యంత్రాంగం విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. -
హోంగార్డుల వేతనాల్లో కోతపై గగ్గోలు
తమిళనాడులో ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డుల వేతనాల్లో కోత పడింది. బుధవారం ఖాతాల్లో పడిన వేతనం చూసి వారు హతాశులయ్యారు. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది