మొక్కు‘బడి’లో ‘గ్లోబల్’ మోసం
పాఠశాలల్లో విద్యార్థులకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. ఘనత వహించిన జగన్ సర్కార్ మాత్రం అంతా రివర్స్.
వందల పాఠశాలల్లో కనీస సంఖ్యలోనూ ఉపాధ్యాయులు లేరు
ఆంగ్లం చెప్పే టీచర్లు లేకుండానే టోఫెల్ శిక్షణ అంటూ ప్రచారం
చాలాచోట్ల గణితం, సామాన్య శాస్త్రాలకూ టీచర్లు లేరు
కొన్ని ప్రాథమికోన్నత స్కూళ్లలో ఎస్జీటీలతో బోధన
పేద పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చేసిన జగన్
ఈనాడు, అమరావతి
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా..? సబ్జెక్టు టీచర్లు లేని మన పాఠశాలల నుంచి విశ్వ విద్యార్థులు సరే... కనీస ప్రమాణాలున్న పిల్లలైనా తయారవుతారా? పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య అంటూ ఊదరగొట్టిన జగన్ ప్రభుత్వం సర్కారు స్కూళ్లను గాలికొదిలేసింది. వేల సంఖ్యలో ఉపాధ్యాయుల కొరత... కనీసం సబ్జెక్టులు చెప్పేవారూ లేరు... అయిదేళ్లలో విద్యా వ్యవస్థపై అలుముకున్న నీలి నీడలతో పేదపిల్లల చదువులు కొండెక్కాయి...
పాఠశాలల్లో విద్యార్థులకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. ఘనత వహించిన జగన్ సర్కార్ మాత్రం అంతా రివర్స్. పాఠాలు చెప్పేందుకు సబ్జెక్టు ఉపాధ్యాయులు లేకపోయినా విద్యలో దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శమంటూ గొప్పలు చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారిలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పేద పిల్లలే ఎక్కువ మంది ఉంటారు. వీరికి నాణ్యమైన విద్యను అందించకుండా ఎన్నికల ప్రచారం కోసం ట్యాబ్లు, టోఫెల్ అంటూ ప్రచారం చేసుకుందీ ప్రభుత్వం. రూ.70 కోట్లు ఖర్చు చేశాం.. డిజిటల్ విద్యను తీసుకొచ్చామంటూ ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్ అయిదేళ్లలో కనీస సంఖ్యలో టీచర్లను నియమించలేకపోయారు. ఉపాధ్యాయుడికి ఏదీ ప్రత్యామ్నాయం కాదనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి ట్యాబ్లు ఇచ్చి.. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ (ఐఎఫ్పీ) పెడితే చదువు వస్తుందంటూ ప్రచారం చేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టోఫెల్ శిక్షణ పెట్టిన ప్రభుత్వం చాలాచోట్ల ఆంగ్ల భాష బోధించే టీచర్ల పోస్టులను గాలికి వదిలేసింది. అసలు ఉపాధ్యాయులు లేకుండా నైపుణ్యం ఎలా వస్తుందనే విషయాన్ని విస్మరించింది. ఖర్చు తగ్గించేందుకు 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, హైస్కూళ్లలో విలీనం చేసి, సబ్జెక్టు టీచర్లతో బోధనంటూ మోసంచేసింది. కొత్త నియామకాలు చేపట్టకుండా ఉన్నవారికే పదోన్నతులు కల్పించి, సర్దేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
6వేల మందికి పైగా ఉపాధ్యాయుల కొరత
రాష్ట్రవ్యాప్తంగా పురపాలక పాఠశాలల్లో మరో 1,785 సబ్జెక్టు టీచర్లు అవసరం ఉండగా.. జిల్లా పరిషత్తు, ఎంపీపీ పాఠశాలల్లో 5,743 స్కూల్ అసిస్టెంట్ల కొరత ఉంది. జగన్ ప్రభుత్వం డీఎస్సీ వేసి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకుండా పేద పిల్లలను నాణ్యమైన చదువుకు దూరంచేసింది. చాలాచోట్ల ప్రాథమికోన్నత పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎస్జీటీలతోనే సబ్జెక్టుల బోధన చేయించారు. ఓ వైపు సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉండగా.. మరోవైపు డబ్బుల కోసం ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి పైరవీల బదిలీలు, డిప్యుటేషన్లకు తెరతీయడంతో మారుమూల ప్రాంతాల్లో పాఠాలు చెప్పేవారు లేకుండా పోయారు.
సామర్థ్యాలకు కొరివి...
- ప్రాథమికోన్నత పాఠశాలల్లో 30 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటేనే గణితం, సామాన్యశాస్త్రం, ఆంగ్లం సబ్జెక్టులకు ఉపాధ్యాయులను ఇచ్చారు. అంతకన్నా తక్కువ ఉంటే ఒకే ఒక్క స్కూల్ అసిస్టెంట్ను నియమించారు. దీన్నీ కొన్నిచోట్ల అమలు చేయలేదు. 1-5 తరగతులకు చెప్పే సెకండరీ గ్రేడ్ టీచర్ల్ల (ఎస్జీటీలు)తోనే పాఠాలు చెప్పించారు. పిల్లలు తక్కువగా ఉన్న బడిలో చదవడం విద్యార్థుల తప్పే అన్నట్లు ప్రభుత్వం వ్యవహరించింది. పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందకుండా చేసింది.
- సామాన్యశాస్త్రం, గణితం, ఇతర సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్నచోట ఉపాధ్యాయులు 9, 10 తరగతులకే ప్రాధాన్యం ఇచ్చారు. 6, 7, 8 తరగతులకు బోధనను తూతూమంత్రంగా పూర్తిచేశారు. కింది తరగతుల్లో గణితం, సామాన్యశాస్త్రం సబ్జెక్టుల్లో కనీస నైపుణ్యం లేకపోవడంతో పైతరగతులకు వెళ్లిన తర్వాత విద్యార్థులు ఫెయిల్ కావడంతో పాటు ఆయా సబ్జెక్టులపై ఆసక్తి లేక, బడి మానేసే పరిస్థితి ఏర్పడింది.
- కొన్నిచోట్ల ఎస్జీటీలతో ఆంగ్లం, హిందీ, సాంఘికశాస్త్రం, తెలుగులాంటి సబ్జెక్టులు చెప్పించారు. ఈ సబ్జెక్టుల్లోని సిలబస్ పూర్తి చేసి, మమ అనిపిస్తున్నారు. విద్యార్థులకు అర్థమైందా? లేదా? వారు ఎంతవరకు నేర్చుకున్నారు? అనే విషయాలను పట్టించుకోలేదు.
పేద పిల్లలపై ఇదేం కక్ష..!
- ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల హైస్కూల్లో 6-10 తరగతుల్లో 1,067 మంది విద్యార్థులున్నారు. వీరికి పాఠాలు చెప్పేందుకు 41 మంది సబ్జెక్టు ఉపాధ్యాయులు అవసరం కాగా 15 మంది మాత్రమే పనిచేశారు. ప్రధానోపాధ్యాయుడితో పాటు పలు సబ్జెక్టు టీచర్ల పోస్టులూ ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆంగ్లం సబ్జెక్టును ఎస్జీటీ ఉపాధ్యాయుడితో చెప్పించారు. హిందీ సబ్జెక్టును చిన్నదోర్నాల ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు రోజు మార్చి రోజు వచ్చి చెప్పేవారు. గణితానికి ఆరుగురు టీచర్లు కావాల్సి ఉండగా నలుగురితో నెట్టుకొచ్చారు.
- అనంతపురం జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణదేవరాయ నగరపాలకోన్నత పాఠశాలలో 612 మంది విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు 24 మంది అవసరంకాగా...చాలాకాలం 8 మంది రెగ్యులర్ టీచర్లతో నెట్టుకొచ్చారు. గత ఆగస్టులో మరో 9 మందిని డిప్యుటేషన్పై వేశారు.
- కర్నూలు జిల్లా హొళగుంద జడ్పీ హైస్కూల్లో తెలుగు, కన్నడ, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాల్లో 1,834 మంది విద్యార్థులున్నారు. వీరికి బోధన చేసేందుకు 59మంది ఉపాధ్యాయులు అవసరం కాగా.. 38 మందితోనే సరిపెట్టారు.
- అన్నమయ్య జిల్లా మదనపల్లె మాయాబజార్లోని వివేకానంద పురపాలక ఉన్నత పాఠశాలలో 655 మంది విద్యార్థులు ఉండగా.. 11 మంది శాశ్వత, ఇద్దరు పొరుగుసేవల ఉపాధ్యాయులు ఉన్నారు. నిబంధనల ప్రకారం 26మంది అవసరం కాగా.. సగం మందిని కూడా నియమించలేదు.
- నంద్యాల జిల్లా సున్నిపెంట హైస్కూల్లో జీవశాస్త్రం సబ్జెక్టుకు ముగ్గురికి ఒక్కరు, గణితానికి నలుగురికి ఇద్దరు మాత్రమే ఉన్నారు. సాంఘిక శాస్త్రానికి ఒక్కరూ లేరు. దీంతో కింది తరగతులను పూర్తిగా వదిలేశారు. మిగిలిన అందరినీ ఒకేచోట కూర్చోబెట్టి పాఠాలు చెప్పారు.
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని బాలికోన్నత పాఠశాలలో ఆంగ్లం బోధించే ఉపాధ్యాయ పోస్టు ఖాళీగా ఉంచేశారు. ఇతర సబ్జెక్టుల టీచర్లతో ఇంగ్లిషు పాఠాలు చెప్పించారు.
ఏకో... నారాయణా!
రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తామని, ప్రతి బడికీ ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తామని గొప్పలు చెప్పిన జగన్ ఆ హామీని గాలికి వదిలేశారు. జగన్ పాలనలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య భారీగా పెరిగింది. ఈ విషయంలో రాష్ట్రం జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. 2020 అక్టోబరు నాటికి ఏకోపాధ్యాయ పాఠశాలలు 7,774 ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 9,602కు పెరిగింది. హేతుబద్ధీకరణ ఉత్తర్వుల ప్రకారం 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ను నియమించాల్సి ఉన్నా ఎస్జీటీల కొరత పేరుతో కొన్నిచోట్ల 30-40 మందికి ఒక్కరినే నియమించారు. ఒకే ఉపాధ్యాయుడు ఉన్న చోట ఒకే గదిలో అందరినీ కూర్చోబెట్టడం వల్ల ఎవరికి ఏ పాఠం చెబుతున్నారో తెలియని గందరగోళం ఏర్పడుతోంది. ఎప్పుడైనా సెలవు పెడితే ఆ రోజుకు చదువు అటకెక్కినట్టే.
తెలుగు టీచర్తో టోఫెల్ పాఠాలు...
ఆంగ్లభాష నైపుణ్యాలు నేర్పించేందుకు టోఫెల్ అమలు చేస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం దానికి తగినట్లు ఉపాధ్యాయులను నియమించలేదు. ఆంగ్ల భాష టీచర్ల కొరత కారణంగా ఎస్జీటీలతో పాఠాలు చెప్పించారు. కొన్నిచోట్ల తెలుగు సబ్జెక్టు టీచర్తోనూ టోఫెల్ పాఠాలు చెప్పించారు. మరికొన్నిచోట్ల ఇతర సబ్జెక్టుల ఉపాధ్యాయులు బోధించారు. ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తున్నామని బాకా ఊదుకున్న ప్రభుత్వం ఆంగ్లం సబ్జెక్టు బోధించేందుకు ఉపాధ్యాయులు లేకుండా చేసింది. ఆంగ్ల ఉపాధ్యాయులను నియమించకుండా టోఫెలే సర్వం అన్నట్లు ప్రచారం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటర్ల సహనానికి ఈసీ పరీక్ష
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
వందనమమ్మా.. డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.