Linking Credit Card To UPI: యూపీఐతో క్రెడిట్ కార్డు జత చేస్తున్నారా? ఇవి తెలుసుకోవాల్సిందే..!
Linking Credit Card To UPI: క్రెడిట్ కార్డును యూపీఐకి లింక్ చేస్తున్నారా? ఎలాంటి సందర్భాల్లో ఈ చెల్లింపులు ప్రయోజనకరమో తెలుసుకోండి.
Linking Credit Card To UPI | ఇంటర్నెట్డెస్క్: డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించటంలో భాగంగా యూపీఐ (UPI)కి క్రెడిట్ కార్డులను కూడా అనుసంధానించే సదుపాయాన్ని ఆర్బీఐ తీసుకొచ్చింది. రూపే క్రెడిట్ కార్డులు వాడుతున్నవారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఈ సదుపాయం వల్ల ప్రయోజనాలే కాదు.. కొన్ని ప్రతికూలతలూ ఉన్నాయి.
లాభాలు ఇవే..
- బ్యాంకు ఖాతాలో డబ్బులుంటేనే యూపీఐ చెల్లింపులు చేసే సదుపాయం ఉండేది. ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ విధానంతో రూపే క్రెడిట్ కార్డును లింక్ చేసి సదరు బ్యాంకు నిర్ణయించిన క్రెడిట్ లిమిట్ వరకు చెల్లింపులు చేయొచ్చు. ఇలా వినియోగించే డబ్బుల్ని తిరిగి చెల్లించటానికి క్రెడిట్కార్డ్ సంస్థలు కొంత సమయం ఇస్తాయి.
- సాధారణంగా క్రెడిట్ కార్డు చెల్లింపులపై రివార్డు పాయింట్లు వస్తాయి. ఖాతా ద్వారా జరిపే యూపీఐ చెల్లింపులపై ఎలాంటి రివార్డులు ఉండవు. అదే క్రెడిట్ కార్డు ద్వారా జరిపే యూపీఐ చెల్లింపులపై రివార్డు పాయింట్లూ పొందొచ్చు.
- యూపీఐతో క్రెడిట్ కార్డులను లింక్ చేయడం వల్ల పేమెంట్స్ సులభతరం అవుతాయి. ఒక చోట క్రెడిట్ కార్డు.. మరో చోట యూపీఐ యాప్ వినియోగించాల్సిన అవసరం ఉండదు. మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు చెల్లింపులు చేయొచ్చు. ప్రతిసారీ కార్డును వెంట పట్టుకెళ్లాల్సిన అవసరం ఉండదు.
- పాయింట్ ఆఫ్ సేల్ (POS) కార్డు స్వైప్ మెషిన్లు లేని చిరు దుకాణాల్లోనూ యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డులను వినియోగించుకోచ్చు.
- యూపీఐ ద్వారా జరిపే చిన్న చిన్న చెల్లింపులు కూడా బ్యాంక్ స్టేట్మెంట్లో దర్శనమిస్తాయి. ఎప్పుడైనా స్టేట్మెంట్ తీసుకోవాలన్నా.. చాలా పెద్దదిగా వస్తుంది. అదే క్రెడిట్ కార్డు ద్వారా చేస్తే.. బ్యాంక్ స్టేట్మెంట్ క్లియర్గా ఉంటుంది. చెల్లింపుల వివరాలు కేవలం క్రెడిట్ కార్డు స్టేట్మెంట్లో మాత్రమే నమోదవుతాయి.
ప్రతికూలతలూ ఉన్నాయ్
- మాస్టర్, వీసా వంటి నెట్వర్క్లపై పనిచేసే క్రెడిట్ కార్డులకు ఈ సదుపాయం లేదు. కేవలం రూపే క్రెడిట్ కార్డు యూజర్లు మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించుకునే వీలుంది.
- ఈ తరహా లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధిస్తారు. వ్యాపారులపై దీనివల్ల భారం పడుతుంది. అంటే యూపీఐతో జతచేసిన క్రెడిట్ కార్డు ద్వారా జరిపే ప్రతి చెల్లింపులపై వ్యాపారస్థులు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఈ తరహా చెల్లింపుల్ని స్వీకరించటానికి వారు నిరాకరించే అవకాశం ఉంటుంది.
- వ్యక్తిగత యూపీఐ ఐడీని ఉపయోగించే చిన్న వ్యాపారాలకు క్రెడిట్ కార్డ్లతో యూపీఐ లావాదేవీల చెల్లింపులు సాధ్యం కాదు.
- బ్యాంక్ ఖాతాలో నగదు లేకపోయినా క్రెడిట్ కార్డులను వినియోగించుకునే వీలుండడంతో కొనుగోళ్లపై నియంత్రణ తగ్గి.. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. తద్వారా అనవసరంగా రుణ ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్పత్తి రంగంపై విశ్వాసం ఉంటే....
ఉత్పత్తి రంగంలో అందివస్తున్న నూతన అవకాశాలను అందిపుచ్చుకోవటం ద్వారా అధిక లాభాలు ఆర్జించే లక్ష్యంతో మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ‘మోతీలాల్ ఓస్వాల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫండ్’ అనే పథకాన్ని తీసుకువచ్చింది. -
ఈవీ ఈటీఎఫ్లలో..
గ్రో మ్యూచువల్ ఫండ్ ఒకేసారి రెండు ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)లను ఆవిష్కరించింది. గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్, గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ (ఫండ్ ఆఫ్ ఫండ్) అనే రెండు కొత్త పథకాల ఎన్ఎఫ్ఓ వచ్చే నెల 2వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. -
మధ్యస్థాయి కంపెనీల్లో
కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ నుంచి ఒక కొత్త పథకం ‘కోటక్ నిఫ్టీ మిడ్క్యాప్ 50 ఇండెక్స్ ఫండ్’ అందుబాటులోకి వచ్చింది. -
రైళ్లలో 3A, 2A గురించి తెలుసు.. మరి ఈ 3E, EA మాటేంటి?
Travel Classes: రైళ్లలో ప్రయాణం చేసే వారు వాటిలో తరగతుల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఆ వివరాలు తెలుసుకోండి.. -
కొత్తగా.. రిటర్నులు దాఖలు చేస్తున్నారా?
ఆదాయపు పన్ను రిటర్నులపై కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి అవగాహన తక్కువే ఉంటుంది. కాబట్టి, ముందుగా దీన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. -
ఈపీఎస్లో మార్పులు.. 6 నెలల సర్వీసు లేకున్నా విత్డ్రా ప్రయోజనాలు
EPS rule: ఈపీఎస్ విత్డ్రాకు సంబంధించి కేంద్రం కొన్ని మార్పులు చేసింది. -
విద్యుత్ వాహన కంపెనీల్లో
విద్యుత్తు వాహనాల (ఈవీ) రంగానికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు లాభదాయకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం విద్యుత్తు వాహనాల వినియోగం శరవేగంగా పెరుగుతూ ఉండటమే -
ఈ-టికెట్ల బుకింగ్.. ఆ ప్రచారం అవాస్తవం: రైల్వేశాఖ ప్రకటన
రైల్వే ఈ-టికెట్ల బుకింగ్పై జరుగుతోన్న ప్రచారంపై రైల్వే మంత్రిత్వశాఖ స్పందించింది. -
ఐఆర్సీటీసీ.. వ్యక్తిగత ఐడీతో టికెట్ బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే చిక్కులే!
వ్యక్తిగత ఐడీతో రైలు టికెట్లు బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
ట్రైన్ టికెట్పై GNWL30/WL8 ఉంటే దానర్థం ఏమిటి?
రైలు టికెట్లను బుక్ చేసేటప్పుడు GNWL, WL అని టికెట్లను జారీ చేస్తుంటారు. ఇంతకీ దీనర్థం ఏమిటి? -
మ్యూచువల్ ఫండ్లు.. ఒకే రంగంలో మదుపు చేస్తారా?
దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడం ఒక మార్గం. ఇందులో వైవిధ్యమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. -
ఆదాయపు పన్ను ఫారం 16 సరిచూసుకున్నారా?
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాల్సిన తరుణం వచ్చేసింది. ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు యాజమాన్యాలు ఫారం-16ను అందించాయి. -
ఎస్బీఐ ఖాతా బ్యాలెన్స్.. సులువుగా తెలుసుకుందామిలా..
SBI Balance: ఎస్బీఐ తమ ఖాతాదారులకు పలు రకాల ఆన్లైన్ సేవలను అందిస్తోంది. అకౌంట్లో బ్యాలెన్స్ తెలుసుకోవడానికి పలు సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. -
ఆదాయపు పన్ను రిటర్నులకు వేళాయె
వేతనం ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న వారు, ఆడిట్ పరిధిలోనికి రాని వారు గత ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్నులను దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. జులై 31 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. -
ఆధార్ ఉచిత అప్డేట్.. గడువు మరోసారి పొడిగింపు
Aadhaar Update: ఆధార్లో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగించింది. -
‘పీఎం కిసాన్’పై మోదీ సంతకం.. పేమెంట్ స్టేటస్ ఇలా తెలుసుకోండి..
PM Kisan: పీం- కిసాన్ నిధుల విడుదలపై ప్రధాని మోదీ సంతకం చేశారు. త్వరలో ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. -
ఆధార్ కేవైసీ ధ్రువీకరణ ఉంటే చెక్ అవసరం లేదు: ఈపీఎఫ్వో
ఈపీఎఫ్ క్లెయిమ్ల సత్వర పరిష్కారానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) మార్గం సుగమమైంది. -
₹14 వేలకే దక్షిణాది పుణ్యక్షేత్రాల దర్శనం.. 22న సికింద్రాబాద్ నుంచి రైలు
IRCTC tour package: దక్షిణాదిలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా?అయితే ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి. -
క్లెయిమ్ల విషయంలో పారదర్శకత పాటించాలి
బీమా పాలసీదారులు, వారి నామినీల హక్కులను కాపాడేందుకు, క్లెయిమ్లను పారదర్శకంగా పరిశీలించేలా బీమా సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఐఆర్డీఏఐ (భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ)కి పంజాబ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూచించింది -
ఆధార్తో పాన్ జత చేసుకున్నారా?
మీ ఆధార్, పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య)లను అనుసంధానించారా? లేకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. దీనికోసం ఆదాయపు పన్ను విభాగం ఈ నెల 31 వరకు అవకాశం ఇచ్చింది. -
పాన్, ఆధార్ అనుసంధానం.. ట్యాక్స్పేయర్లకు మే 31 లాస్ట్డేట్
PAN Aadhaar Link: ఇప్పటికీ పాన్-ఆధార్ అనుసంధానం చేయనివారు 2024 మే 31లోపు పూర్తి చేయాలని ఆదాయ పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
-
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
-
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
-
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు