మూడేళ్లలో రూ.కోటి కోట్లకు
రాబోయే మూడు, నాలుగేళ్లలో మ్యూచువల్ ఫండ్ల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.కోటి కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయని ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ అసోసియేట్ డైరెక్టర్ ఆర్కే ఝా అంచనా వేశారు.
మ్యూచువల్ ఫండ్ పరిశ్రమపై అంచనాలు
ఎల్ఐసీ ఎంఎఫ్ అసోసియేట్ డైరెక్టర్ ఆర్కే ఝా
ఈనాడు, హైదరాబాద్: రాబోయే మూడు, నాలుగేళ్లలో మ్యూచువల్ ఫండ్ల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.కోటి కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయని ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ అసోసియేట్ డైరెక్టర్ ఆర్కే ఝా అంచనా వేశారు. 2022లో రూ.40 లక్షల కోట్లుగా ఉన్న ఏయూఎం, 2023 చివరికి రూ.50 లక్షల కోట్లకు చేరిందన్నారు. చిన్న మదుపరులు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసేందుకు అధికంగా ఆసక్తి చూపడమే ఇందుకు కారణమని విశ్లేషించారు. 2016లో నెలవారీ క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్)లో వచ్చిన మొత్తం రూ.3,100 కోట్లయితే, ఇప్పుడు రూ.17,610 కోట్లకు చేరిందన్నారు. సిప్ ద్వారా మార్కెట్లోకి వస్తున్న మొత్తం ఏటా 24% పెరుగుతోందన్నారు.
2027కు రూ.లక్ష కోట్లకు చేరతాం: ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ నుంచి మొత్తం 38 పథకాలు అందుబాటులో ఉన్నాయని, ఇందులో అధిక శాతం ఈక్విటీ ఆధారిత పథకాలేనని వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ ఎంఎఫ్ ఏయూఎం రూ.16,526 కోట్లు కాగా, ప్రస్తుతం రూ.30వేల కోట్లుగా ఉందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికి రూ.50వేల కోట్లకు, 2027 ఏప్రిల్ నాటికి రూ.లక్ష కోట్ల ఏయూఎం స్థాయికి చేరుకుంటామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఈ రంగాల్లో మా పెట్టుబడులు: పీఎస్యూలు, బ్యాంకింగ్తో పాటు ఆర్థిక సేవలు, రక్షణ, ఐటీ, తయారీ రంగాలపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నట్లు ఝా తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల నుంచి ఎంఎఫ్లలోకి మొత్తం పెట్టుబడులు రూ.1.43 లక్షల కోట్ల మేరకు ఉన్నట్లు యాంఫీ గణాంకాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇందులో హైదరాబాద్ నుంచే రూ.లక్ష కోట్ల ఏయూఎం ఉందని, దేశంలో ఇది ఎనిమిదో స్థానమని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎస్బీఐలో 12వేల ఉద్యోగాలు.. 85% ఇంజినీరింగ్ విద్యార్థులకే
ఇంజినీరింగ్ విద్యార్థులకు గుడ్న్యూస్. ఎస్బీఐ త్వరలో 12వేల నియామకాలు చేపట్టబోతోంది. ఇందులో 85 శాతం మంది ఇంజినీరింగ్ వారినే నియమించుకోనుంది. -
నాలుగో ఆర్థిక శక్తి.. 2025లో జపాన్ను దాటనున్న భారత్!
2025 నాటికి ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక శక్తిగా భారత్ నిలువనుందని నీతీ ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ (Amitabh Kant) అంచనా వేశారు. -
విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది.. 2 రోజుల్లో పూర్తిస్థాయి సర్వీసులు
AI Express: అనారోగ్య సెలవుపై వెళ్లి నిరసన వ్యక్తం చేసిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది మొత్తం విధుల్లో చేరారు. త్వరలో పూర్తి స్థాయి సర్వీసులు నడవనున్నాయి. -
రూ.58, రూ.59తో బీఎస్ఎన్ఎల్లో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
BSNL Prepaid Plans: బీఎస్ఎన్ఎల్ ఇటీవల రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటి ప్రయోజనాలు సహా పూర్తి వివరాలు చూద్దాం... -
యూనియన్ బ్యాంక్ లాభం రూ.3,328 కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) మార్చి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ రూ.3,328 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 18.36 శాతం ఎక్కువ. -
మన ల్యాబ్ తయారీ వజ్రాలు విదేశాల్లో మెరుస్తున్నాయ్
ల్యాబ్ తయారీ వజ్రాల (ఎల్జీడీ) ఎగుమతులు 2024-25లో 7-9 శాతం వృద్ధి చెంది 1500-1530 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.12,450-12,700 కోట్ల)కు చేరొచ్చని కేర్ఎడ్జ్ అడ్వైజరీ నివేదిక అంచనా వేసింది. సహజంగా వెలికితీసే వజ్రాలకు గిరాకీ మందకొడిగా ఉండటం ఇందుకు దోహదపడనున్నట్లు తెలిపింది. -
భారత కంపెనీల ఆదాయాల్లో వృద్ధి నెమ్మదించొచ్చు
గత ఆర్థిక సంవత్సరం(2023-24) జనవరి-మార్చి త్రైమాసికంలో భారత కంపెనీల ఆదాయాలు 4-6 శాతమే పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. కొవిడ్-19 పరిణామాల ప్రభావం నుంచి కంపెనీలు పుంజుకోవడం ప్రారంభమైన 2021 సెప్టెంబరు తర్వాత ఒక త్రైమాసికంలో ఇదే అత్యంత తక్కువ ఆదాయ వృద్ధి అని తెలిపింది. -
తొలి 100 రోజుల్లో ఇండియా ఏఐ మిషన్ ఆవిష్కరణ!
అధికారం చేపట్టిన ‘తొలి 100 రోజుల ప్రణాళిక’లో భాగంగా ‘ఇండియా ఏఐ మిషన్’ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆవిష్కరించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని కింద 2024-25 ఏడాదికి రూ.1,000 కోట్లు కేటాయించొచ్చని ఒక అధికారిని ఉటంకిస్తూ ‘ఇన్ఫామిస్ట్’ తన కథనంలో పేర్కొంది. -
2024-25లో భారత వృద్ధి 7 శాతానికి పైనే
అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థల్లో సానుకూలతలు, సాధారణానికి మించి వర్షపాతం అంచనాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతానికి పైనే వృద్ధిని నమోదు చేయొచ్చని ఆర్థిక విధానాల పరిశోధనా సంస్థ ఎన్సీఏఈఆర్ అంచనా వేసింది. -
గ్రామ పంచాయతీల్లోకి ‘బీమా’ సేవలు
గ్రామ పంచాయతీలకు జీవిత, సాధారణ బీమా కంపెనీలు తమ సేవలను విస్తరించడం తప్పనిసరి చేస్తున్నట్లు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ప్రకటించింది. ‘2047 కల్లా అందరికీ బీమా’ లక్ష్యాన్ని చేరడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. -
ఒమేగా హాస్పిటల్స్లో మోర్గాన్ స్టాన్లీకి వాటా
క్యాన్సర్ ఆసుపత్రులను నిర్వహిస్తున్న ఒమేగా హాస్పిటల్స్లో విదేశీ పెట్టుబడుల సంస్థ మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ దాదాపు రూ.600 కోట్ల మేరకు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఈ సంస్థకు ఒమేగా హాస్పిటల్స్లో 15 శాతం వరకూ వాటా లభిస్తుంది. -
సీసీఎల్ ప్రోడక్ట్స్కు తగ్గిన లాభాలు
ఇన్స్టెంట్ కాఫీ తయారీ సంస్థ అయిన సీసీఎల్ ప్రోడక్ట్స్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ.730 కోట్ల ఆదాయాన్ని, రూ.65.22 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్ రూ.4.90గా నమోదైంది. -
ఏఐ ప్రాజెక్టులపై బ్లూక్లౌడ్ సాఫ్ట్టెక్ సొల్యూషన్స్ దృష్టి
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న బ్లూక్లౌడ్ సాఫ్ట్టెక్ సొల్యూషన్స్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.213.34 కోట్ల ఆదాయాన్ని, రూ.8.41 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
క్యాప్స్టన్ సర్వీసెస్ ఆకర్షణీయ ఫలితాలు
మ్యాన్ పవర్, స్టాఫింగ్ సేవల సంస్థ అయిన క్యాప్స్టన్ సర్వీసెస్ గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి, నాలుగో త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఫలితాలు నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం(2023-24)లో ఈ సంస్థ రూ.521 కోట్ల ఆదాయాన్ని, రూ.12.57 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
కూల్ నుంచి అధునాతన కూలర్
కూల్ స్టైలిష్ ఫ్యాన్స్ సరికొత్త ‘డెజర్ట్ కూలర్ ఎక్సెల్ హెచ్1’ కూలర్ను తీసుకొచ్చింది. అధునాతన బీఎల్డీసీ మోటార్, రిమోట్ కంట్రోల్తో పనిచేసే ఫ్యాన్ విద్యుత్ను 65% వరకు ఆదా చేస్తుందని కంపెనీ తెలిపింది. ఇంటికి సరికొత్త స్టైల్, అందాన్ని తీసుకొస్తుందని వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు(5)
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఐషర్ మోటార్స్ ఏకీకృత నికర లాభం రూ.1,070 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో లాభం రూ.906 కోట్లతో పోలిస్తే ఇది 18 శాతం ఎక్కువ. అధిక విక్రయాలు ఇందుకు దోహదం చేశాయి. -
భారతీయ విలువలు చూసి ఆశ్చర్యపోయా.. జపాన్ కంపెనీ సీఈఓ
గత నెల రోజులుగా బెంగళూరులో ఉంటున్న టెక్ జపాన్ వ్యవస్థాపకుడు భారతీయ నాయకత్వం గురించి కొనియాడారు.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ చిత్తు.. బెంగళూరుకు వరుసగా ఐదో విజయం
-
కాంగ్రెస్తో ప్రాంతీయ పార్టీల పొత్తు.. శశిథరూర్ ఏమన్నారంటే?
-
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం.. రైతులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్రెడ్డి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్
-
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!