సంక్షిప్త వార్తలు
స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది.
స్టాక్ మార్కెట్లకు ఎఫ్ఐయూ తాజా హెచ్చరికలు
దిల్లీ: స్టాక్ మార్కెట్లు, బీమా కంపెనీలు, ఆన్లైన్ చెల్లింపు గేట్వే ఇంటర్మీడియర్లు, క్రిప్టో కరెన్సీ సేవల ప్రొవైడర్లకు భారత ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) తాజా హెచ్చరికలు జారీ చేసింది. ఆయా చానెళ్ల ద్వారా మనీ లాండరింగ్ కార్యకలాపాలు, ఉగ్రవాదులకు నిధులకు అందజేసే లావాదేవీలు జరుగుతున్నాయేమో పరిశీలించేందుకు తనిఖీలు నిర్వహించే అవకాశం ఉందని హెచ్చరించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల కింద ఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. ఇందులో భాగంగా ఆర్థిక సంస్థలు, ఇంటర్మీడియర్లు అనుమానాస్పద లావాదేవీలను ఎఫ్ఐయూకు తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది.
ఐటీపీసీఎల్ రుణ పునర్వ్యవస్థీకరణ.. ఎస్బీఐ అభ్యంతరాన్ని తిరస్కరించిన ఎన్సీఎల్ఏటీ
దిల్లీ: ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ గ్రూప్నకు చెందిన థర్మల్ విద్యుత్ కంపెనీ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ తమిళనాడు పవర్ కంపెనీ లిమిటెడ్ (ఐటీపీసీఎల్)కు ఉపశమనం లభించింది. ఐటీపీసీఎల్ లీడ్ బ్యాంకర్గా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) అందించిన కంపెనీ లిక్విడేషన్ విలువను వ్యతిరేకిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దాఖలు చేసిన పిటిషన్ను నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తిరస్కరించింది. ఐటీపీసీఎల్ రుణ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ఎస్బీఐ ఆపలేదని పేర్కొంది. ఈ సందర్భంగా ఎస్బీఐ దాఖలు చేసిన 3 దరఖాస్తులను ఎన్సీఎల్ఏటీ తోసిపుచ్చింది. 30.09.2018 నాటికి ఐటీపీసీఎల్ లిక్విడేషన్ విలువను నిర్ణయించడంలో ఎటువంటి తప్పు జరగలేదని వెల్లడించింది. ఆర్బీఐ సర్క్యులర్ ప్రకారం.. రుణదాతల మధ్య ఇంటర్-క్రెడిటర్ ఒప్పందం జరిగిందని అప్పిలేట్ ట్రైబ్యునల్ గుర్తించింది. ఐటీపీసీఎల్ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికకు 90 శాతానికి పైగా రుణదాతలు ఆమోదం తెలిపారని స్పష్టం చేసింది.
దివాలా ప్రక్రియను వేగవంతం చేయండి
హిందుజా గ్రూప్ సంస్థను కోరిన ఆర్క్యాప్ రుణదాతలు
దిల్లీ: దివాలా ప్రక్రియ నెమ్మదించడంపై రిలయన్స్ క్యాపిటల్ (ఆర్క్యాప్) రుణదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. రుణ పరిష్కార ప్రణాళిక గడువుగా ఉన్న మే 27కు కట్టుబడి ఉండాలని, తప్పనిసరి నియంత్రణపరమైన అనుమతులు పొందే ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా హిందుజా గ్రూప్ సంస్థ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ను కోరారు. ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ అధికారులతో ఆర్క్యాప్ రుణదాతలు భేటీ అయ్యారు. గడువులోగా తమకు రూ.9,650 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని వారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 27న ఆర్క్యాప్ పరిష్కార ప్రణాళికకు ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది. 90 రోజుల్లోగా (మే 27కు) ఈ ప్రణాళికను అమలు చేయాల్సిందిగా ఇండస్ఇండ్ హోల్డింగ్స్ను ఆదేశించింది. దీంతో ఆర్క్యాప్ రుణదాతలకు కంపెనీ రూ.9,650 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇండస్ఇండ్ హోల్డింగ్స్కు కీలకమైన ఐఆర్డీఏఐ ఆమోదం లభించాల్సి ఉండటంతో, రుణదాతలు ఆందోళన వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నష్టాల నుంచి లాభాల్లోకి.. 900 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 111 పాయింట్లు, నిఫ్టీ 48 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 400 పాయింట్లు కుంగిన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 404 పాయింట్ల నష్టంతో 72,260 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 105 పాయింట్లు కుంగి 21,949 దగ్గర కొనసాగుతోంది. -
ఇంధన కంపెనీలకు లాభాలే లాభాలు!
ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్)లు 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.81,000 కోట్ల భారీ లాభాలు ఆర్జించాయి. -
2024-25లో అదానీ ఎంటర్ప్రైజెస్
అదానీ ఎంటర్ప్రైజెస్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.80,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు కంపెనీ డిప్యూటీ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్ఓ) సౌరభ్ షా వెల్లడించారు. -
లాభాలు రావొచ్చు కానీ..
గత వారంలో కొద్ది రోజుల పాటు నష్టపోయిన సూచీలు ఈ వారం తిరిగి పుంజుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల ఫలితాల ముందు అప్రమత్తతతో పాటు విదేశీ మదుపర్లు స్థిరంగా విక్రయాలు జరుపుతుండడం వల్ల లాభాలు పరిమితంగానే కనిపించొచ్చని అంటున్నారు. -
పసుపు ప్రతికూలమే!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.73,460 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.74,193, రూ.75,499 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
71,816 దిగువన దిద్దుబాటు!
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ గత వారం మన మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అంచనాలపై అనిశ్చితి, కంపెనీలు ప్రకటించిన ఆర్థిక ఫలితాలు నిరుత్సాహపర్చడం ఇందుకు కారణమయ్యాయి. -
నియామకాల్లో 85% ఇంజినీరింగ్ పట్టభద్రులకే
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో దేశీయ అతి పెద్ద బ్యాంక్ ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)లో చేరబోయే 12,000 మంది తాజా ఉత్తీర్ణుల్లో 85 శాతం మంది ఇంజినీరింగ్ పట్టభద్రులే ఉంటారని బ్యాంక్ ఛైర్మన్ దినేశ్ ఖరా వెల్లడించారు. -
భారత్తో ద్వైపాక్షిక వాణిజ్యంలో అమెరికాను వెనక్కినెట్టిన చైనా
గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో భారత్కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. తద్వారా ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న అమెరికాను వెనక్కినెట్టింది. -
సీఎన్జీ కార్ల అమ్మకాలు 30 శాతానికి పైగా పెరగొచ్చు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) తమ సీఎన్జీ కార్ల అమ్మకాలు 30 శాతానికి పైగా పెరిగి 6 లక్షల వాహనాలుగా నమోదయ్యే అవకాశం ఉందని మారుతీ సుజుకీ అంచనా వేస్తోంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమాన సేవల పునరుద్ధరణ
టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ తన విమాన సేవలను క్రమంగా పునరుద్ధరిస్తోంది. రద్దయిన విమానాల సంఖ్య ఆదివారం నాటికి 20కి తగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏనుగులకు అనారోగ్యం.. 3500కి.మీ వెళ్లి కాపాడిన ‘అంబానీ’ బృందం
-
‘ప్రజ్వల్ మా అమ్మపై అత్యాచారం చేశాడు.. బలవంతంగా నా దుస్తులు విప్పించాడు’
-
స్ట్రెచ్చర్పై వచ్చి ఓటేసిన క్యాన్సర్ బాధితురాలు
-
నిజ్జర్ కేసు దర్యాప్తులో చెప్పుకోదగ్గ అంశాలేవీ బయటపడలేదు: జైశంకర్
-
ఏపీ ఎన్నికలు: ‘హలో ఏపీ బైబై వైసీపీ’ సోషల్మీడియాలో ట్రెండ్