74500 ఎగువన కొత్త గరిష్ఠాలకు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి.
సమీక్ష: సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. బాండ్ రాబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు ప్రభావం చూపాయి. దేశీయంగా చూస్తే.. ఏప్రిల్లో భారత కాంపోజిట్ పీఎంఐ 14 ఏళ్ల గరిష్ఠమైన 62.2గా నమోదైంది. తయారీ పీఎంఐ 59.1గా ఉంది. 2023-24లో దేశంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 17.7% వృద్ధితో రూ.19.58 లక్షల కోట్లకు చేరాయి. కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు నడిపించాయి. లోక్సభ ఎన్నికల పోలింగ్పైనా మార్కెట్లు దృష్టి పెట్టాయి. ఇరాన్- ఇజ్రాయెల్ పరిణామాలతో బ్యారెల్ ముడిచమురు ధర 2.3% పెరిగి 89.3 డాలర్లకు చేరింది. డాలర్తో పోలిస్తే రూపాయి 83.44 నుంచి 83.35కు బలపడింది.
అంతర్జాతీయంగా.. అమెరికా మొదటి త్రైమాసిక జీడీపీ అంచనాల కంటే తక్కువగా 1.6 శాతంగా నమోదైంది. బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లను 0-0.1 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. డాలర్తో పోలిస్తే యెన్ జీవనకాల కనిష్ఠమైన 156.79కు పడిపోయింది. చైనా కేంద్ర బ్యాంక్ కూడా రుణ రేట్లలో మార్పులు చేయలేదు. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్ 0.9% లాభంతో 73,730 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 1.2% తగ్గి 22,420 పాయింట్ల దగ్గర స్థిరపడింది. రంగాల వారీ సూచీల్లో మన్నికైన వినిమయ వస్తువులు, స్థిరాస్తి, లోహ షేర్లు లాభపడగా.. ఐటీ స్క్రిప్లు డీలాపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) నికరంగా రూ.14,704 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.20,796 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. ఏప్రిల్లో ఇప్పటివరకు విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్లు (ఎఫ్పీఐలు) నికరంగా రూ.6,304 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు.
లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 1:1గా నమోదు కావడం..
పెద్ద షేర్లలో కొంత స్థిరీకరణను సూచిస్తోంది.
ఈ వారంపై అంచనా: గతవారం లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, ప్రస్తుతం కీలక నిరోధమైన 74,000- 74,500 పాయింట్ల శ్రేణికి చేరువైంది. ఈ స్థాయిని అధిగమిస్తే జీవనకాల గరిష్ఠమైన 75,124 పాయింట్లను పరీక్షించే అవకాశం ఉంది. మరోవైపు 73,000 పాయింట్ల వద్ద మద్దతు లభించొచ్చు. ఈ స్థాయి దిగువకు పడిపోతే, స్వల్పకాలంలో స్థిరీకరించుకోవచ్చు.
ప్రభావిత అంశాలు: దేశీయ సూచీలపై అంతర్జాతీయ సంకేతాల ప్రభావం కొనసాగొచ్చు. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా బుధవారం సెలవు కావడంతో ఈ వారం మార్కెట్లు నాలుగు రోజులే పనిచేయనున్నాయి. కంపెనీల త్రైమాసిక ఫలితాలు, దేశీయ ఆర్థిక గణాంకాలు కీలకం కానున్నాయి. ఈ వారం అల్ట్రాటెక్ సిమెంట్, హావెల్స్, ఇండస్ టవర్స్, ఐఓసీ, అదానీ పవర్, అంబుజా సిమెంట్స్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, డాబర్, టైటన్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి దిగ్గజ కంపెనీలు ఫలితాలు ప్రకటించనున్నాయి. ఫలితాల సందర్భంగా యాజమాన్యాలు చేసే వ్యాఖ్యలపై దృష్టిపెట్టొచ్చు. తయారీ పీఎంఐ, మౌలిక రంగ వృద్ధి, నెలవారీ వాహన విక్రయాలు, బ్యాంక్ రుణాల వృద్ధి, జీఎస్టీ వసూళ్లు గణాంకాలు వెలువడనున్నాయి. లోక్సభ ఎన్నికల మొదటి రెండు విడతల్లో తక్కువ పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న భాజపాకు ఇది ప్రతికూలమని అంటున్నారు. ఎన్నికలతో పాటు దేశంలో వాతావరణ పరిస్థితులు, ఇరాన్- ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వంటివి మార్కెట్ సెంటిమెంట్పై ప్రభావం చూపొచ్చు. రూపాయి కదలికలు, ఎఫ్ఐఐ పెట్టుబడులు, చమురు ధరల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు. అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా చమురు ధరల ఒడుదొడుకులు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా.. యూరోజోన్ ఎకనామిక్ సెంటిమెంట్, చైనా తయారీ పీఎంఐ, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయం, బ్యాంక్ ఆఫ్ జపాన్ మినిట్స్, అమెరికా నిరుద్యోగ క్లెయిమ్ గణాంకాలు విడుదల కానున్నాయి.
తక్షణ మద్దతు స్థాయులు: 73,227, 72,365, 71,816
తక్షణ నిరోధ స్థాయులు: 74,571, 75,124, 75,600
సెన్సెక్స్ 74,500 అధిగమిస్తే, కొత్త గరిష్ఠాలను తాకొచ్చు.
సతీశ్ కంతేటి, జెన్ మనీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూన్ 4న స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయ్: అమిత్షా
జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక, మన స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయనేే అభిప్రాయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యక్తం చేశారు. అందువల్ల అంతకంటే ముందుగానే, ఎంపిక చేసుకున్న షేర్లను కొని పెట్టుకోవాల్సిందిగా మదుపర్లకు సూచించారు. -
జీఎస్టీ రిజిస్ట్రేషన్కు బయోమెట్రిక్ ధ్రువీకరణ
జీఎస్టీ రిజిస్ట్రేషన్కు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధ్రువీకరణ ప్రక్రియ అమలు చేసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేసినట్లు ఓ అధికారి తెలిపారు. -
కాకినాడ నుంచి అంతర్జాతీయ విపణికి అమ్మోనియా!
నార్వేలోని ఓస్లో కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న యారా క్లీన్ అమ్మోనియా అనే సంస్థ, గ్రీన్కో గ్రూపునకు చెందిన కాకినాడ యూనిట్ నుంచి రెన్యూవబుల్ అమ్మోనియా కొనుగోలు చేయనుంది. -
2030 కల్లా 24 కోట్ల ఇళ్లకు బ్రాడ్బ్యాండ్
దేశంలోని 24 కోట్ల ఇళ్లకు బ్రాడ్బ్యాండ్ సేవలు అందించాలంటే, భారత్కు రూ.4.2 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
భారీ నష్టాల నుంచి లాభాల్లోకి
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ఆఖర్లో పుంజుకుని లాభాల్లోకి వచ్చాయి. ఇంట్రాడే కనిష్ఠాల నుంచి సెన్సెక్స్ 910 పాయింట్లు కోలుకుంది. -
‘ వార్షిక సమాచార నివేదిక’లో కొత్త వెసులుబాటు
వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం సరికొత్త వెసులుబాటును తీసుకొచ్చింది. ఇందులో సమాచార ధ్రువీకరణ ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకునే వీలు కల్పించినట్లు తెలిపింది. -
ఎఫ్టీఏ దేశాల నుంచి భారత్కు దిగుమతులు 38% పెరిగాయ్
మనదేశంతో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ) ఉన్న యూఏఈ, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా లాంటి దేశాల నుంచి భారత్కు దిగుమతులు 2018-19లో 136.20 బిలియన్ డాలర్లుగా ఉండేవి. -
ఎయిరిండియా, విస్తారా ఉద్యోగులకు జూన్ కల్లా ఫిట్మెంట్!
ఎయిరిండియా, విస్తారాకు చెందిన 7,000కు పైగా ఉద్యోగులకు జూన్లో ఫిట్మెంట్ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. టాటా గ్రూప్నకు చెందిన ఈ రెండు విమానయాన సంస్థల విలీన ప్రక్రియ నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. -
బుల్లెెట్ ఈవీపై తొందర లేదు
బుల్లెట్ బ్రాండ్పై మోటార్సైకిళ్లను విక్రయిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ ఒక ‘అద్భుత’ విద్యుత్ వాహనాన్ని (ఈవీ) తీసుకు రావాలని ఆశిస్తోంది. అందువల్ల ఈవీల్లోకి ప్రవేశించేందుకు తొందరపాటుతో వ్యవహరించడం లేదని చెబుతోంది. -
జొమాటో లాభం రూ.175 కోట్లు
ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని, ఆహారాన్ని సరఫరా చేసే సంస్థ జొమాటో, జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.175 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.188 కోట్ల నష్టాన్ని చవిచూసింది. -
రాజ్ వట్టికూటి సంస్థలో వాటా కోసం పోటీలో అంతర్జాతీయ పీఈ సంస్థలు
అమెరికన్-భారతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్త అయిన రాజ్ వట్టికూటికి చెందిన ప్యూర్-ప్లే డిజిటల్ సేవల కంపెనీ అల్టిమెట్రిక్లో మెజారిటీ వాటా కోసం అంతర్జాతీయ ప్రైవేటు ఈక్విటీ(పీఈ) సంస్థలు పోటీలో ఉన్నాయి. -
భారత్లో మరిన్ని ఎస్యూవీ మోడళ్లు తీసుకొస్తాం: సుజుకీ
కార్ల విభాగంలో తాము కోల్పోయిన మార్కెట్ వాటాను తిరిగి పొందేందుకు భారత్లో స్పోర్ట్ వినియోగ వాహన (ఎస్యూవీ) మోడళ్ల సంఖ్యను పెంచుకుంటామని జపాన్కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు(7)
డ్రోన్ల తయారీ సంస్థ దక్ష అన్మ్యాన్డ్ సిస్టమ్స్లో కోరమాండల్ ఇంటర్నేషనల్ తన వాటా పెంచుకుంది. ఈ సంస్థలో ఇప్పటికే రెండు దఫాలుగా కోరమాండల్ ఇంటర్నేషనల్ పెట్టుబడి పెట్టింది. -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఈవీ రాక ఆలస్యం? కారణం ఇదే..!
Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి విద్యుత్ ద్విచక్ర వాహనం రాక ఆలస్యం కానుంది. అందుకు గల కారణాలను ఆ కంపెనీ ఎండీ వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
100 రోజులు.. 200 విమానాలు.. ఏ వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటే!
-
ప్రయాణికులతో కిక్కిరిసిన హైదరాబాద్ మెట్రో
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ముందుగానే ‘నైరుతి’ జల్లు
-
వేధించారు.. ఓటూ తీసేశారు!.. ఏబీ వెంకటేశ్వరరావుపై వైకాపా ప్రభుత్వ కసి
-
వర్షం వచ్చింది.. కథ ముగిసింది: ప్లేఆఫ్స్ రేసు నుంచి గుజరాత్ ఔట్