అంకురాల కోసం రూ.50 కోట్లు

అంకురాలకు పెట్టుబడులను అందించేందుకు ది యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ అసోసియేషన్‌ (వైఈఏ) రూ.50 కోట్ల నిధులను అందుబాటులోకి తెచ్చింది.

Published : 30 Apr 2024 02:01 IST

ఈనాడు, హైదరాబాద్‌: అంకురాలకు పెట్టుబడులను అందించేందుకు ది యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ అసోసియేషన్‌ (వైఈఏ) రూ.50 కోట్ల నిధులను అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం మాగ్నిఫిక్‌ క్యాపిటల్‌తో కలిసి థైరోకేర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా థైరోకేర్‌ వ్యవస్థాపకుడు ఎ. వేలుమణి రూ.50 కోట్లు సమకూర్చనున్నారు. ఎంపిక చేసిన అంకురాలకు ఆయన మార్గదర్శకత్వమూ మహించనున్నారని వైఈఏ తెలిపింది. ప్రారంభ స్థాయిలో ఉన్న అంకురాలు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని