ఆదాయపు పన్ను ఈ పొరపాట్లు చేయొద్దు
ఆదాయపు పన్ను భారం తగ్గించుకునేందుకు వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు చట్టం అవకాశం కల్పించింది. కేవలం ఇలా మదుపు చేయడంతోనే పన్ను ప్రణాళిక పూర్తయినట్లు చాలామంది భావిస్తారు. ఆర్థిక ప్రణాళికలో పన్ను ఆదా పథకాలూ ఎంతో కీలకం.
ఆదాయపు పన్ను భారం తగ్గించుకునేందుకు వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు చట్టం అవకాశం కల్పించింది. కేవలం ఇలా మదుపు చేయడంతోనే పన్ను ప్రణాళిక పూర్తయినట్లు చాలామంది భావిస్తారు. ఆర్థిక ప్రణాళికలో పన్ను ఆదా పథకాలూ ఎంతో కీలకం. ఆర్థిక సంవత్సరం ముగింపు సమీపిస్తున్న నేపథ్యంలో పన్ను ఆదా చేసుకోవాలని ఆలోచిస్తున్న వారు చేయకూడని పొరపాట్లేమిటో చూద్దాం...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) పన్ను ఆదా చేయాలనుకునే వారు మార్చి 31 లోగా తమ పెట్టుబడులను పూర్తి చేయాల్సి ఉంటుంది. కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి ఎలాంటి పెట్టుబడులతోనూ పనిలేదు. పాత పన్ను విధానంలో కొనసాగుతున్న వారు మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. సాధారణంగా పన్ను ప్రణాళిక ఎప్పుడూ ఆర్థిక సంవత్సరం మొదటి నెల నుంచే ప్రారంభించాలి. చాలామంది ఈ విషయాన్ని అప్పుడు పట్టించుకోరు. చివరి నిమిషంలో పెట్టుబడులు పెట్టే క్రమంలో ఏదో ఒక పథకాన్ని ఎంచుకొంటారు. తాత్కాలికంగా పన్ను ఆదా లక్ష్యం నెరవేరొచ్చు. కానీ, ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇవి అడ్డంకిగా మారే ఆస్కారం ఉంది.
ఉన్న పెట్టుబడులను విస్మరించడం
పన్ను ఆదా కోసం మీకు ఏ పథకం సరిపోతుంది అని తెలుసుకునే ముందు ఇప్పటికే మీరు ఏయే పథకాల్లో మదుపు చేశారన్న సంగతి తెలుసుకోవాలి. మీరు ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) ఉంటుంది. ఇది ఎలాంటి నష్టభయం లేని పథకం. సెక్షన్ 80సీలో ఉన్న రూ.1,50,000 పరిమితిలో అధిక భాగం ఇదే ఉంటుంది. కొంతమందికి ఈ మొత్తం ఈపీఎఫ్తోనే పూర్తయ్యే అవకాశమూ ఉంది. ఇలాంటప్పుడు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఈపీఎఫ్ మొత్తం తీసేసిన తర్వాత పిల్లల ట్యూషన్ ఫీజులను లెక్కలోకి తీసుకోవాలి. సాధారణంగా ఈ రెండింటితోనే సెక్షన్ 80సీ పరిమితి పూర్తయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఇతర పథకాలను ఎంచుకోవాల్సిన అవసరం లేకపోవచ్చు. పన్ను ఆదా చేయాల్సిన అవసరం లేకున్నా.. మినహాయింపు ఇచ్చే పెట్టుబడి పథకాలను ఎంచుకోవడం సరికాదు.
దీర్ఘకాలిక పథకాలను ఎంచుకోవడం..
సాధారణంగా యూనిట్ ఆధారిత బీమా పాలసీలు, సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలు కనీసం 15 ఏళ్ల వ్యవధికి అందుబాటులో ఉంటాయి. చాలామంది ఈ పాలసీలను తాత్కాలికంగా పన్ను ఆదా చేసుకునేందుకు ఎంచుకుంటారు. కొన్నాళ్లపాటు ప్రీమియం చెల్లించిన తర్వాత రద్దు చేసుకోవాలనే ఆలోచనతో ఉంటారు. కొన్నాళ్ల తర్వాత ఆర్థిక ఇబ్బందులు, లేదా ఆ పాలసీ మీకు సరిపోదని రద్దు చేసుకోవాలని అనుకుంటే నష్టపోయే అవకాశం ఉంది. సంప్రదాయ బీమా పాలసీల్లో దీర్ఘకాలం కొనసాగినా కనీసం 5-6 శాతానికి మించి రాబడిని ఇవ్వకపోవచ్చు.
చివరి నిమిషం వరకూ..
పన్ను ఆదా పెట్టుబడులకు మార్చి 31 వరకూ వేచి చూడటం సరికాదు. అవసరమైన మేరకు పెట్టుబడులు పెట్టేందుకు వెంటనే ప్రయత్నించండి. సాధారణంగా పన్ను ఆదా పథకాలు దీర్ఘకాలిక వ్యవధితో ఉంటాయి. బీమా పాలసీలు ఎంచుకుంటే.. 15 ఏళ్ల వరకూ ప్రీమియం చెల్లించాలి. పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్ల వ్యవధి అయిదేళ్లు. ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్ఎస్ఎస్) లాకిన్ వ్యవధి మూడేళ్లు. ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్)లో 15 ఏళ్లపాటు కొనసాగాలి. ఆర్థిక లక్ష్యాల సాధనలో మీకు ఏ పథకం అనువుగా ఉంటుందో చూసుకొని, దాన్ని ఎంచుకునేందుకు ప్రయత్నించాలి.
వివరాలు అందించారా?
ఉద్యోగులకు మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) ఎంత మేరకు విధించారు, ఇంకా ఎంత మేరకు పన్ను చెల్లించాలో తెలుసుకోండి. మీరు పన్ను మినహాయింపు పొందేందుకు సమర్పించాల్సిన అన్ని పత్రాలూ అందించారా లేదా చూసుకోండి. పిల్లల ఫీజుల రశీదులు, గృహరుణం వడ్డీ, అసలు చెల్లింపు ధ్రువీకరణ, ఇంటి అద్దె రశీదుల్లాంటివి అందించారా చూసుకోండి.పన్ను ఆదా ప్రణాళిక ఒక్క రోజుతో పూర్తయ్యేది కాదు. ఆర్థిక సంవత్సరం మొత్తం దీని గురించి ఆలోచించాలి. ప్రతి పెట్టుబడీ దీర్ఘకాలంలో ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు తోడ్పడేలా చూసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్పత్తి రంగంపై విశ్వాసం ఉంటే....
ఉత్పత్తి రంగంలో అందివస్తున్న నూతన అవకాశాలను అందిపుచ్చుకోవటం ద్వారా అధిక లాభాలు ఆర్జించే లక్ష్యంతో మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ‘మోతీలాల్ ఓస్వాల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫండ్’ అనే పథకాన్ని తీసుకువచ్చింది. -
ఈవీ ఈటీఎఫ్లలో..
గ్రో మ్యూచువల్ ఫండ్ ఒకేసారి రెండు ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)లను ఆవిష్కరించింది. గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్, గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ (ఫండ్ ఆఫ్ ఫండ్) అనే రెండు కొత్త పథకాల ఎన్ఎఫ్ఓ వచ్చే నెల 2వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. -
మధ్యస్థాయి కంపెనీల్లో
కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ నుంచి ఒక కొత్త పథకం ‘కోటక్ నిఫ్టీ మిడ్క్యాప్ 50 ఇండెక్స్ ఫండ్’ అందుబాటులోకి వచ్చింది. -
రైళ్లలో 3A, 2A గురించి తెలుసు.. మరి ఈ 3E, EA మాటేంటి?
Travel Classes: రైళ్లలో ప్రయాణం చేసే వారు వాటిలో తరగతుల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఆ వివరాలు తెలుసుకోండి.. -
కొత్తగా.. రిటర్నులు దాఖలు చేస్తున్నారా?
ఆదాయపు పన్ను రిటర్నులపై కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి అవగాహన తక్కువే ఉంటుంది. కాబట్టి, ముందుగా దీన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. -
ఈపీఎస్లో మార్పులు.. 6 నెలల సర్వీసు లేకున్నా విత్డ్రా ప్రయోజనాలు
EPS rule: ఈపీఎస్ విత్డ్రాకు సంబంధించి కేంద్రం కొన్ని మార్పులు చేసింది. -
విద్యుత్ వాహన కంపెనీల్లో
విద్యుత్తు వాహనాల (ఈవీ) రంగానికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు లాభదాయకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం విద్యుత్తు వాహనాల వినియోగం శరవేగంగా పెరుగుతూ ఉండటమే -
ఈ-టికెట్ల బుకింగ్.. ఆ ప్రచారం అవాస్తవం: రైల్వేశాఖ ప్రకటన
రైల్వే ఈ-టికెట్ల బుకింగ్పై జరుగుతోన్న ప్రచారంపై రైల్వే మంత్రిత్వశాఖ స్పందించింది. -
ఐఆర్సీటీసీ.. వ్యక్తిగత ఐడీతో టికెట్ బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే చిక్కులే!
వ్యక్తిగత ఐడీతో రైలు టికెట్లు బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
ట్రైన్ టికెట్పై GNWL30/WL8 ఉంటే దానర్థం ఏమిటి?
రైలు టికెట్లను బుక్ చేసేటప్పుడు GNWL, WL అని టికెట్లను జారీ చేస్తుంటారు. ఇంతకీ దీనర్థం ఏమిటి? -
మ్యూచువల్ ఫండ్లు.. ఒకే రంగంలో మదుపు చేస్తారా?
దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడం ఒక మార్గం. ఇందులో వైవిధ్యమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. -
ఆదాయపు పన్ను ఫారం 16 సరిచూసుకున్నారా?
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాల్సిన తరుణం వచ్చేసింది. ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు యాజమాన్యాలు ఫారం-16ను అందించాయి. -
ఎస్బీఐ ఖాతా బ్యాలెన్స్.. సులువుగా తెలుసుకుందామిలా..
SBI Balance: ఎస్బీఐ తమ ఖాతాదారులకు పలు రకాల ఆన్లైన్ సేవలను అందిస్తోంది. అకౌంట్లో బ్యాలెన్స్ తెలుసుకోవడానికి పలు సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. -
ఆదాయపు పన్ను రిటర్నులకు వేళాయె
వేతనం ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న వారు, ఆడిట్ పరిధిలోనికి రాని వారు గత ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్నులను దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. జులై 31 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. -
ఆధార్ ఉచిత అప్డేట్.. గడువు మరోసారి పొడిగింపు
Aadhaar Update: ఆధార్లో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగించింది. -
‘పీఎం కిసాన్’పై మోదీ సంతకం.. పేమెంట్ స్టేటస్ ఇలా తెలుసుకోండి..
PM Kisan: పీం- కిసాన్ నిధుల విడుదలపై ప్రధాని మోదీ సంతకం చేశారు. త్వరలో ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. -
ఆధార్ కేవైసీ ధ్రువీకరణ ఉంటే చెక్ అవసరం లేదు: ఈపీఎఫ్వో
ఈపీఎఫ్ క్లెయిమ్ల సత్వర పరిష్కారానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) మార్గం సుగమమైంది. -
₹14 వేలకే దక్షిణాది పుణ్యక్షేత్రాల దర్శనం.. 22న సికింద్రాబాద్ నుంచి రైలు
IRCTC tour package: దక్షిణాదిలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా?అయితే ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి. -
క్లెయిమ్ల విషయంలో పారదర్శకత పాటించాలి
బీమా పాలసీదారులు, వారి నామినీల హక్కులను కాపాడేందుకు, క్లెయిమ్లను పారదర్శకంగా పరిశీలించేలా బీమా సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఐఆర్డీఏఐ (భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ)కి పంజాబ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూచించింది -
ఆధార్తో పాన్ జత చేసుకున్నారా?
మీ ఆధార్, పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య)లను అనుసంధానించారా? లేకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. దీనికోసం ఆదాయపు పన్ను విభాగం ఈ నెల 31 వరకు అవకాశం ఇచ్చింది. -
పాన్, ఆధార్ అనుసంధానం.. ట్యాక్స్పేయర్లకు మే 31 లాస్ట్డేట్
PAN Aadhaar Link: ఇప్పటికీ పాన్-ఆధార్ అనుసంధానం చేయనివారు 2024 మే 31లోపు పూర్తి చేయాలని ఆదాయ పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్