IRCTC kashmir package: ₹40వేలకే విమానంలో కశ్మీర్ ట్రిప్.. ప్యాకేజీ వివరాలివీ..
IRCTC kashmir tour: మంచు పర్వతాలు, ఎత్తయిన కొండలు వాటి మధ్యలో రోప్ ప్రయాణం చేస్తుంటే వచ్చే థ్రిల్లే వేరు. ఒకవేళ ఈ వేసవిలో చల్లగా అలా కశ్మీర్ వెళ్దామనుకుంటే ఐఆర్సీటీసీ తీసుకొచ్చిన విమాన యాత్రపై ఓ లుక్కేయండి..
ఉత్తర భారతంలో చూడదగిన ప్రదేశాల్లో కశ్మీర్ ఒకటి. ఈ వేసవిలో శ్రీనగర్ అందాలు.. గుల్మార్గ్ మంచుకొండల్లో రోప్వే ప్రయాణం.. ఊహించుకుంటేనే మంచు కొండల్లో తేలిపోతున్నట్లు ఉంది కదూ! మరి నేరుగా ఆస్వాదిస్తే కలిగే మజానే వేరు. అందులోనూ ఈ మైమరచిపోయే అందాలను వీక్షించటానికి విమానంలో ప్రయాణమంటే ఇక ఎగిరి గంతేయాల్సిందే. ఇవన్నీ అందుబాటులో ధరలోనే అందిస్తోంది ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC). ఆధ్యాత్మిక, విహార యాత్రలకు వివిధ రైలు ప్యాకేజీలను అందిస్తున్న ఈ సంస్థ.. తాజాగా ఈ విమాన ప్రయాణ ప్యాకేజీని తీసుకొచ్చింది.
మిస్టికల్ కశ్మీర్ ఎక్స్ హైదరాబాద్ పేరిట ఐఆర్సీటీసీ ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. మే 19 నుంచి జూన్ 30 వరకు ఈ ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచే ప్రయాణం మొదలవుతుంది. ఈ టూర్ మొత్తం ఐదు రాత్రులు ఆరు పగళ్లు కొనసాగుతుంది. మే 19 (జూన్ 2 మినహా) ప్రతి శుక్రవారం హైదరాబాద్ నుంచి విమానం బయలుదేరుతుంది. మే 19, 26 తేదీలకు సంబంధించిన టికెట్ బుకింగ్లు ముగియగా.. జూన్ 9, 16, 23, 30 తేదీల్లో పరిమిత సంఖ్యలో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
విమాన ప్రయాణం ఇలా..
- హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 1:40 గంటలకు విమానం (6E- 917) బయల్దేరుతుంది. 4:40 గంటలకు శ్రీనగర్ ఎయిర్పోర్ట్కు చేరుతారు. అక్కడ ముందుగానే బుక్ చేసిన హోటల్లో బస ఉంటుంది. సూర్యాస్తమయాన్ని వీక్షించటానికి సాయంత్రం దాల్ సరస్సుకు తీసుకెళ్తారు. అక్కడున్న చార్-చినార్ (ప్లోటింగ్ గార్డెన్స్) వీక్షించొచ్చు. రుసుములు యాత్రికులే చెల్లించాలి. రాత్రి హోటల్లో బస అక్కడే ఉంటుంది.
- రెండో రోజు అల్పాహారం స్వీకరించాక బంగారు గడ్డి మైదానంగా పేరొందిన సోన్మార్గ్కు తీసుకెళ్తారు. అక్కడ మంచుతో కప్పిన ఎత్తయిన కొండలు, మంచుతో కప్పిన రోడ్లను చూసి మైమరిచిపోవచ్చు. ఈ పర్యటనలో తాజ్వాస్ గ్లేసియర్ (హిమానీనదం) ప్రధానంగా ఆకర్షణగా ఉంటుంది. వీటిని వీక్షించి తిరిగి శ్రీనగర్కు వచ్చి హోటల్లో బస చేస్తారు. అక్కడే భోజనం ఉంటుంది.
- మూడో రోజు ఉదయం గుల్మార్గ్కు బయల్దేరుతారు. అక్కడ పూలతో నిండిన రహదారుల గుండా ప్రయాణించి గుల్మార్గ్ గోండోలాకు చేరుతారు. అక్కడ రోప్వే ప్రయాణం మైమరిపిస్తుంది. దానికి యాత్రికులే ఖర్చులు భరించాల్సి ఉంటుంది. దీంతో ఆ రోజు పర్యటన పూర్తవుతుంది. రాత్రి తిరిగి శ్రీనగర్ చేరడంతో మూడోరోజు పర్యటన ముగుస్తుంది.
- నాలుగో రోజు ఉదయం పహల్గామ్కు ప్రయాణం ఉంటుంది. సముద్ర తీరానికి 2440 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో ఉండే లోయ అందాలను వీక్షించాక.. తిరుగు ప్రయాణంలో కుంకుమపువ్వు పంట అందాలు, అవంతిపూర్ శిథిలాలు వీక్షించొచ్చు. ఆ రోజు రాత్రి పహల్గామ్ హోటల్లోనే భోజనం చేసి అక్కడే సేద తీరుతారు.
- ఐదో రోజు అదే హోటల్లో అల్పాహారం చేసి శ్రీనగర్కు చేరుకుంటారు. మొఘల్ గార్డెన్స్, చెష్మషాహి, పరిమహల్, బొటానికల్ గార్డెన్, షాలిమార్ గార్డెన్స్ సందర్శనా స్థలాలను వీక్షించొచ్చు. తర్వాత దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ప్రసిద్ధ హజ్రత్బల్ను సందర్శించుకోవచ్చు. ఇక రాత్రి హౌస్బోట్లో బస ఉంటుంది.
- ఆరో రోజు ఉదయమే ఆదిశంకరాచార్య మందిరాన్ని దర్శించుకొని తిరిగి హౌస్బోట్కు చేరుకుంటారు. మధ్యాహ్నం భోజనం ముగించుకొని షాపింగ్ చేసుకోవచ్చు. ఇక అక్కడ నుంచి శ్రీనగర్ ఎయిర్పోర్ట్కు చేరుకొని 5:10 గంటలకు హైదరాబాద్కు (6E – 6216) పయనమవుతారు. 8:05 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది.
ఇవి తప్పనిసరి
- సీనియర్ సిటిజన్లు ఈ టూర్కు వెళ్లాలనుకుంటే టికెట్ బుక్ చేసుకొనేముందు తప్పనిసరిగా వైద్య పరీక్ష చేయించుకోవాలి.
- 75 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు చిన్న వయసున్న ఎస్కార్ట్/కుటుంబ సభ్యులను తోడుగా తీసుకెళ్లాలి.
- ప్రయాణానికి రెండు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలి. మీరు సమయానికి ఫ్లైట్ను అందుకోకపోతే ఐఆర్సీటీసీ ఎటువంటి బాధ్యతా వహించదు.
- ప్రయాణ పత్రాలతో పాటు 2 నుంచి 11 ఏళ్లున్న పిల్లలు వయస్సు ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. 11 ఏళ్లు దాటిన వారికి పెద్దలుగా పరిగణిస్తారు.
ప్యాకేజీలో ఏమేం ఉంటాయ్?
- ఆరు రోజులు అల్పాహారం, రాత్రి భోజనం ఉచితంగా లభిస్తుంది.
- త్రీ స్టార్ హోటల్లో బస ఉంటుంది.
- మధ్యాహ్న భోజనంతో పాటు ఇతర ఆహారపదార్థాలన్నీ యాత్రికులే చూసుకోవాలి.
- విమాన ప్రయాణంలో ఎటువంటి ఆహారం తీసుకున్నా యాత్రికులే చెల్లించాలి.
- పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే వ్యక్తులే చెల్లించాలి.
- దాల్ సరస్సు వద్ద షికారా రైడ్, గుల్మార్గ్ వద్ద గొండోలా రైడ్లకు యాత్రికులే వెచ్చించాలి.
- గైడ్ను యాత్రికులే ఏర్పాటు చేసుకోవాలి.
ప్యాకేజ్ ఛార్జీలు..
- సింగిల్ షేరింగ్ కావాలంటే ఒక్కొక్కరికీ రూ.42,895
- ట్విన్ షేరింగ్ అయితే రూ.38,200
- ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.36,845
- 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు ఒకరికి విత్ బెడ్ అయితే రూ.28,430, విత్ అవుట్ బెడ్ అయితే రూ.25,750 చెల్లించాలి.
- 2-4 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.25,750 చెల్లించాలి.
- ఐఆర్సీటీసీ క్యాన్సిలేషన్ పాలసీ ప్రకారం.. యాత్రకు 21 రోజుల ముందు టికెట్ను క్యాన్సిల్ చేసుకుంటే టికెట్ మొత్తం ధరలో 30శాతం మినహాయిస్తారు. అదే 21 నుంచి 15 రోజుల్లో అయితే 55 శాతం, 14 నుంచి 8 రోజుల్లో అయితే 80 శాతం డబ్బును మీ టికెట్ ధర నుంచి మినహాయిస్తారు. ప్రయాణానికి ఎనిమిది రోజుల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎలాంటి తిరిగి చెల్లింపులూ ఉండవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్పత్తి రంగంపై విశ్వాసం ఉంటే....
ఉత్పత్తి రంగంలో అందివస్తున్న నూతన అవకాశాలను అందిపుచ్చుకోవటం ద్వారా అధిక లాభాలు ఆర్జించే లక్ష్యంతో మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ‘మోతీలాల్ ఓస్వాల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫండ్’ అనే పథకాన్ని తీసుకువచ్చింది. -
ఈవీ ఈటీఎఫ్లలో..
గ్రో మ్యూచువల్ ఫండ్ ఒకేసారి రెండు ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)లను ఆవిష్కరించింది. గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్, గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ (ఫండ్ ఆఫ్ ఫండ్) అనే రెండు కొత్త పథకాల ఎన్ఎఫ్ఓ వచ్చే నెల 2వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. -
మధ్యస్థాయి కంపెనీల్లో
కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ నుంచి ఒక కొత్త పథకం ‘కోటక్ నిఫ్టీ మిడ్క్యాప్ 50 ఇండెక్స్ ఫండ్’ అందుబాటులోకి వచ్చింది. -
రైళ్లలో 3A, 2A గురించి తెలుసు.. మరి ఈ 3E, EA మాటేంటి?
Travel Classes: రైళ్లలో ప్రయాణం చేసే వారు వాటిలో తరగతుల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఆ వివరాలు తెలుసుకోండి.. -
కొత్తగా.. రిటర్నులు దాఖలు చేస్తున్నారా?
ఆదాయపు పన్ను రిటర్నులపై కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి అవగాహన తక్కువే ఉంటుంది. కాబట్టి, ముందుగా దీన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. -
ఈపీఎస్లో మార్పులు.. 6 నెలల సర్వీసు లేకున్నా విత్డ్రా ప్రయోజనాలు
EPS rule: ఈపీఎస్ విత్డ్రాకు సంబంధించి కేంద్రం కొన్ని మార్పులు చేసింది. -
విద్యుత్ వాహన కంపెనీల్లో
విద్యుత్తు వాహనాల (ఈవీ) రంగానికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు లాభదాయకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం విద్యుత్తు వాహనాల వినియోగం శరవేగంగా పెరుగుతూ ఉండటమే -
ఈ-టికెట్ల బుకింగ్.. ఆ ప్రచారం అవాస్తవం: రైల్వేశాఖ ప్రకటన
రైల్వే ఈ-టికెట్ల బుకింగ్పై జరుగుతోన్న ప్రచారంపై రైల్వే మంత్రిత్వశాఖ స్పందించింది. -
ఐఆర్సీటీసీ.. వ్యక్తిగత ఐడీతో టికెట్ బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే చిక్కులే!
వ్యక్తిగత ఐడీతో రైలు టికెట్లు బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
ట్రైన్ టికెట్పై GNWL30/WL8 ఉంటే దానర్థం ఏమిటి?
రైలు టికెట్లను బుక్ చేసేటప్పుడు GNWL, WL అని టికెట్లను జారీ చేస్తుంటారు. ఇంతకీ దీనర్థం ఏమిటి? -
మ్యూచువల్ ఫండ్లు.. ఒకే రంగంలో మదుపు చేస్తారా?
దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడం ఒక మార్గం. ఇందులో వైవిధ్యమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. -
ఆదాయపు పన్ను ఫారం 16 సరిచూసుకున్నారా?
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాల్సిన తరుణం వచ్చేసింది. ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు యాజమాన్యాలు ఫారం-16ను అందించాయి. -
ఎస్బీఐ ఖాతా బ్యాలెన్స్.. సులువుగా తెలుసుకుందామిలా..
SBI Balance: ఎస్బీఐ తమ ఖాతాదారులకు పలు రకాల ఆన్లైన్ సేవలను అందిస్తోంది. అకౌంట్లో బ్యాలెన్స్ తెలుసుకోవడానికి పలు సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. -
ఆదాయపు పన్ను రిటర్నులకు వేళాయె
వేతనం ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న వారు, ఆడిట్ పరిధిలోనికి రాని వారు గత ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్నులను దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. జులై 31 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. -
ఆధార్ ఉచిత అప్డేట్.. గడువు మరోసారి పొడిగింపు
Aadhaar Update: ఆధార్లో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగించింది. -
‘పీఎం కిసాన్’పై మోదీ సంతకం.. పేమెంట్ స్టేటస్ ఇలా తెలుసుకోండి..
PM Kisan: పీం- కిసాన్ నిధుల విడుదలపై ప్రధాని మోదీ సంతకం చేశారు. త్వరలో ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. -
ఆధార్ కేవైసీ ధ్రువీకరణ ఉంటే చెక్ అవసరం లేదు: ఈపీఎఫ్వో
ఈపీఎఫ్ క్లెయిమ్ల సత్వర పరిష్కారానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) మార్గం సుగమమైంది. -
₹14 వేలకే దక్షిణాది పుణ్యక్షేత్రాల దర్శనం.. 22న సికింద్రాబాద్ నుంచి రైలు
IRCTC tour package: దక్షిణాదిలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా?అయితే ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి. -
క్లెయిమ్ల విషయంలో పారదర్శకత పాటించాలి
బీమా పాలసీదారులు, వారి నామినీల హక్కులను కాపాడేందుకు, క్లెయిమ్లను పారదర్శకంగా పరిశీలించేలా బీమా సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఐఆర్డీఏఐ (భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ)కి పంజాబ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూచించింది -
ఆధార్తో పాన్ జత చేసుకున్నారా?
మీ ఆధార్, పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య)లను అనుసంధానించారా? లేకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. దీనికోసం ఆదాయపు పన్ను విభాగం ఈ నెల 31 వరకు అవకాశం ఇచ్చింది. -
పాన్, ఆధార్ అనుసంధానం.. ట్యాక్స్పేయర్లకు మే 31 లాస్ట్డేట్
PAN Aadhaar Link: ఇప్పటికీ పాన్-ఆధార్ అనుసంధానం చేయనివారు 2024 మే 31లోపు పూర్తి చేయాలని ఆదాయ పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
-
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్