IRCTC tour package: వేసవి సెలవుల్లో కేరళ అందాలు.. IRCTC ప్యాకేజీ వివరాలివే..
IRCTC kerala package: ఈ వేసవి సెలవుల్లో కేరళ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మీ కోసమే ఐఆర్సీటీసీ కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ఆ వివరాలు ఇవీ..
![](https://assets.eenadu.net/article_multiple_images/123078817_kerala1a.jpg)
కేరళ హిల్స్ అండ్ వాటర్...
KERALA HILLS & WATERS పేరిట ఐఆర్సీటీసీ ఈ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. మే 9 నుంచి జూన్ 27 వరకు ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ రైలు ప్రయాణిస్తుంది. గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, తెనాలి రైల్వేస్టేషన్లలో టూరిస్టులు ఈ రైలు ఎక్కొచ్చు. కేరళ ప్రయాణం ముగించుకున్నాక మళ్లీ అయా రైల్వే స్టేషన్లలో దిగే వెసులుబాటు ఉంది. ఈ టూర్ మొత్తం ఐదు రాత్రులు ఆరు పగళ్లు కొనసాగుతుంది. మే9 నుంచి వారానికోసారి సికింద్రాబాద్ నుంచి ఈ రైలు బయల్దేరుతుంది. మీకు అనువైన సమయం, టికెట్లు అందుబాటును బట్టి మీకు నచ్చిన తేదీని ఎంచుకోవచ్చు. మే 9, 16, 23, 30... ఇలా జూన్ 27 వరకు శబరి ఎక్స్ప్రెస్లో ప్రతి మంగళవారం ప్రయాణం ఉంటుంది. త్రీటైర్ ఏసీ, స్లీపర్ క్లాసుల్లో ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వాస్తవానికి రెగ్యులర్ నడిచే ట్రైనే అయినప్పటికీ.. మంగళవారం రోజు పర్యాటకులకు కేటాయించారు.
కేరళ ప్రయాణం ఇలా..
- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నిర్దేశిత తేదీల్లో ఈ రైలు మధ్యాహ్నం 12.20 గంటలకు బయల్దేరుతుంది. శబరి ఎక్స్ప్రెస్ (ట్రైన్ నం.17230)లో ప్రయాణించాల్సి ఉంటుంది.
- రెండో రోజు మధ్యాహ్నం 12:55 గంటలకు ఎర్నాకుళం రైల్వే స్టేషన్కు రైలు చేరుకుంటుంది. అక్కడ ఐఆర్సీటీసీ సిబ్బంది మున్నార్కు చేరుస్తారు. ముందుగానే బుక్ చేసిన హోటల్లో బస ఉంటుంది. అక్కడ విశ్రాంతి తీసుకొని ఆ రోజు రాత్రి మున్నార్ హోటల్లో సేద తీరాలి.
- మూడో రోజు ఉదయం హోటల్లోనే అల్పాహారం తీసుకున్నాక ఎరవికులం నేషనల్ పార్క్, టీ మ్యూజియం, మట్టుపెట్టి డ్యామ్ వీక్షించడంతో ఆ రోజు పర్యటన పూర్తవుతుంది. రాత్రి మళ్లీ హోటల్లో బస చేయాలి.
- నాలుగో రోజు ఉదయం అలెప్పీ చేరుకుంటారు. అక్కడ హోటల్లో బ్రేక్ఫాస్ట్ ముగించుకున్నాక అలెప్పీ అందాలను వీక్షించటానికి వెళ్తారు. దాంతో నాలుగో రోజు పర్యటన ముగుస్తుంది. రాత్రి మళ్లీ హోటల్లో బస ఉంటుంది.
- ఐదో రోజు అలెప్పీ నుంచి ఎర్నాకుళం రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 11:20 గంటలకు శబరి ఎక్స్ప్రెస్ ఎక్కాలి.
- ఆరో రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో యాత్ర పూర్తవుతుంది.
ప్యాకేజ్ ఛార్జీలు..
- సింగిల్ షేరింగ్ కావాలంటే ఒక్కొక్కరికీ రూ.32,230
- ట్విన్ షేరింగ్ అయితే రూ.18,740
- ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.15,130
- 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు ఒకరికి బెడ్తో అయితే రూ.8,730, బెడ్ లేకుండా అయితే రూ.6,530 చెల్లించాలి.
భోజనం టూరిస్టులదే..
🚆 ఎంచుకున్న ప్యాకేజీని బట్టి రైళ్లో 3 ఏసీ, స్లీపర్ క్లాస్ ప్రయాణం ఉంటుంది.
🚆 ప్యాకేజీని బట్టి ప్రయాణానికి ఏసీ వాహనం సమకూరుస్తారు.
🚆 కేరళలో మూడు రాత్రులు ఉండడానికి గదులు, ఉదయం అల్పాహారం ఉచితంగా లభిస్తుంది.
🚆 ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.
🚆 టోల్, పార్కింగ్ ఛార్జీలు వంటివి ప్యాకేజీలో అంతర్భాగంగానే ఉంటాయి.
🚆 మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం వంటివన్నీ యాత్రికులే చూసుకోవాలి.
🚆 పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే వ్యక్తులే చెల్లించాలి.
🚆 బోటింగ్, హార్స్ రైడింగ్ వంటివి ప్యాకేజీలో ఉండవు.
🚆 గైడ్ను యాత్రికులే ఏర్పాటు చేసుకోవాలి.
- ఐఆర్సీటీసీ క్యాన్సిలేషన్ పాలసీ ప్రకారం.. యాత్రకు 15 రోజుల ముందు టికెట్ను క్యాన్సిల్ చేసుకుంటే ఒక్కో టికెట్కు రూ.250 క్యాన్సిలేషన్ ఛార్జీగా నిర్ణయించారు. అదే 8 నుంచి 14 రోజుల్లోపు అయితే టికెట్ మొత్తం ధరలో 25 శాతం, 4 నుంచి 7 రోజుల్లోపు అయితే 50 శాతం డబ్బును మీ టికెట్ ధర నుంచి మినహాయిస్తారు. ప్రయాణానికి నాలుగు రోజుల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎలాంటి తిరిగి చెల్లింపులూ ఉండవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్పత్తి రంగంపై విశ్వాసం ఉంటే....
ఉత్పత్తి రంగంలో అందివస్తున్న నూతన అవకాశాలను అందిపుచ్చుకోవటం ద్వారా అధిక లాభాలు ఆర్జించే లక్ష్యంతో మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ‘మోతీలాల్ ఓస్వాల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫండ్’ అనే పథకాన్ని తీసుకువచ్చింది. -
ఈవీ ఈటీఎఫ్లలో..
గ్రో మ్యూచువల్ ఫండ్ ఒకేసారి రెండు ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)లను ఆవిష్కరించింది. గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్, గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ (ఫండ్ ఆఫ్ ఫండ్) అనే రెండు కొత్త పథకాల ఎన్ఎఫ్ఓ వచ్చే నెల 2వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. -
మధ్యస్థాయి కంపెనీల్లో
కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ నుంచి ఒక కొత్త పథకం ‘కోటక్ నిఫ్టీ మిడ్క్యాప్ 50 ఇండెక్స్ ఫండ్’ అందుబాటులోకి వచ్చింది. -
రైళ్లలో 3A, 2A గురించి తెలుసు.. మరి ఈ 3E, EA మాటేంటి?
Travel Classes: రైళ్లలో ప్రయాణం చేసే వారు వాటిలో తరగతుల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఆ వివరాలు తెలుసుకోండి.. -
కొత్తగా.. రిటర్నులు దాఖలు చేస్తున్నారా?
ఆదాయపు పన్ను రిటర్నులపై కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి అవగాహన తక్కువే ఉంటుంది. కాబట్టి, ముందుగా దీన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. -
ఈపీఎస్లో మార్పులు.. 6 నెలల సర్వీసు లేకున్నా విత్డ్రా ప్రయోజనాలు
EPS rule: ఈపీఎస్ విత్డ్రాకు సంబంధించి కేంద్రం కొన్ని మార్పులు చేసింది. -
విద్యుత్ వాహన కంపెనీల్లో
విద్యుత్తు వాహనాల (ఈవీ) రంగానికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు లాభదాయకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం విద్యుత్తు వాహనాల వినియోగం శరవేగంగా పెరుగుతూ ఉండటమే -
ఈ-టికెట్ల బుకింగ్.. ఆ ప్రచారం అవాస్తవం: రైల్వేశాఖ ప్రకటన
రైల్వే ఈ-టికెట్ల బుకింగ్పై జరుగుతోన్న ప్రచారంపై రైల్వే మంత్రిత్వశాఖ స్పందించింది. -
ఐఆర్సీటీసీ.. వ్యక్తిగత ఐడీతో టికెట్ బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే చిక్కులే!
వ్యక్తిగత ఐడీతో రైలు టికెట్లు బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
ట్రైన్ టికెట్పై GNWL30/WL8 ఉంటే దానర్థం ఏమిటి?
రైలు టికెట్లను బుక్ చేసేటప్పుడు GNWL, WL అని టికెట్లను జారీ చేస్తుంటారు. ఇంతకీ దీనర్థం ఏమిటి? -
మ్యూచువల్ ఫండ్లు.. ఒకే రంగంలో మదుపు చేస్తారా?
దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడం ఒక మార్గం. ఇందులో వైవిధ్యమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. -
ఆదాయపు పన్ను ఫారం 16 సరిచూసుకున్నారా?
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాల్సిన తరుణం వచ్చేసింది. ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు యాజమాన్యాలు ఫారం-16ను అందించాయి. -
ఎస్బీఐ ఖాతా బ్యాలెన్స్.. సులువుగా తెలుసుకుందామిలా..
SBI Balance: ఎస్బీఐ తమ ఖాతాదారులకు పలు రకాల ఆన్లైన్ సేవలను అందిస్తోంది. అకౌంట్లో బ్యాలెన్స్ తెలుసుకోవడానికి పలు సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. -
ఆదాయపు పన్ను రిటర్నులకు వేళాయె
వేతనం ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న వారు, ఆడిట్ పరిధిలోనికి రాని వారు గత ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్నులను దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. జులై 31 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. -
ఆధార్ ఉచిత అప్డేట్.. గడువు మరోసారి పొడిగింపు
Aadhaar Update: ఆధార్లో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగించింది. -
‘పీఎం కిసాన్’పై మోదీ సంతకం.. పేమెంట్ స్టేటస్ ఇలా తెలుసుకోండి..
PM Kisan: పీం- కిసాన్ నిధుల విడుదలపై ప్రధాని మోదీ సంతకం చేశారు. త్వరలో ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. -
ఆధార్ కేవైసీ ధ్రువీకరణ ఉంటే చెక్ అవసరం లేదు: ఈపీఎఫ్వో
ఈపీఎఫ్ క్లెయిమ్ల సత్వర పరిష్కారానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) మార్గం సుగమమైంది. -
₹14 వేలకే దక్షిణాది పుణ్యక్షేత్రాల దర్శనం.. 22న సికింద్రాబాద్ నుంచి రైలు
IRCTC tour package: దక్షిణాదిలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా?అయితే ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి. -
క్లెయిమ్ల విషయంలో పారదర్శకత పాటించాలి
బీమా పాలసీదారులు, వారి నామినీల హక్కులను కాపాడేందుకు, క్లెయిమ్లను పారదర్శకంగా పరిశీలించేలా బీమా సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఐఆర్డీఏఐ (భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ)కి పంజాబ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూచించింది -
ఆధార్తో పాన్ జత చేసుకున్నారా?
మీ ఆధార్, పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య)లను అనుసంధానించారా? లేకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. దీనికోసం ఆదాయపు పన్ను విభాగం ఈ నెల 31 వరకు అవకాశం ఇచ్చింది. -
పాన్, ఆధార్ అనుసంధానం.. ట్యాక్స్పేయర్లకు మే 31 లాస్ట్డేట్
PAN Aadhaar Link: ఇప్పటికీ పాన్-ఆధార్ అనుసంధానం చేయనివారు 2024 మే 31లోపు పూర్తి చేయాలని ఆదాయ పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
-
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్