Tata Punch EV: టాటా పంచ్ ఈవీ వచ్చేసింది.. సింగిల్ ఛార్జ్తో 421km రేంజ్
Tata Punch EV: టాటా మోటార్స్ నుంచి పంచ్ ఈవీ విడుదలైంది. దీని ప్రారంభ ధర రూ.10.99 లక్షలు. సింగిల్ ఛార్జ్తో గరిష్ఠంగా 421 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
Tata Punch EV | ఇంటర్నెట్ డెస్క్: టాటా మోటార్స్ (Tata motors) అనుబంధ టాటా పాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మరో కొత్త విద్యుత్ కారును విడుదల చేసింది. టాటా పంచ్ ఈవీ (Tata Punch EV) పేరుతో కొత్త వాహనాన్ని పరిచయం చేసింది. దీని ధర రూ.10.99 లక్షలు (ఎక్స్షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.14.49 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ ధరలు లిమిటెడ్ పీరియడ్ మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఇప్పటికే ఈ కారు బుకింగ్స్ ప్రారంభం కాగా.. జనవరి 22 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
టాటా అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ ప్యూర్ ఈవీ ఆర్కిటెక్చర్పై పంచ్ ఈవీ రూపొందింది. ఈ కారు స్టాండర్డ్, లాంగ్ రేంజ్ వేరియంట్లలో లభిస్తుంది. స్టాండర్డ్ వేరియంట్లో 25kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ ఛార్జ్తో 315 కిలోమీటర్లు (MIDC) రేంజ్ ఇస్తుంది. లాంగ్ రేంజ్ మోడల్లో 35 kWh బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. ఇది సింగిల్ ఛార్జ్పై 421 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మోటార్, బ్యాటరీ ప్యాక్ ఐపీ67 రేటింగ్తో వస్తున్నాయి. ఎనిమిదేళ్లు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల (ఏది ముందైతే అది) వారెంటీతో వస్తోంది.
Fastag: మీ ఫాస్టాగ్ స్టేటస్ ఏంటి? కేవైసీ ఎలా పూర్తి చేయాలి?
టాటా స్టాండర్డ్ వేరియంట్ను 3.3kW ఏసీ హోమ్ వాల్ బాక్స్తో అయితే 9.4 గంటలు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అదే 7.2kW ఏసీ హోమ్ వాల్ బాక్స్ ఛార్జర్తో అయితే 3.6 గంటలు, 15ఏ ప్లగ్తో అయితే 9.4 గంటలు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. 50kW డీసీ ఫాస్ట్ ఛార్జర్తో కేవలం 56 నిమిషాల్లోనే 10-80 శాతం ఛార్జ్ చేయొచ్చని కంపెనీ పేర్కొంది. లాంగ్ రేంజ్ వేరియంట్ను 3.3 kW ఏసీ హోమ్ ఛార్జర్ బాక్స్ లేదా 15ఏ ప్లగ్పాయింట్తో ఛార్జ్ చేయాల్సి వస్తే 10-100 శాతం ఛార్జ్ అవ్వడానికి 13.5 గంటల సమయం పడుతుంది. 7.2kW ఏసీ హోమ్ వాల్బాక్స్ ఛార్జర్తో అయితే 5 గంటలు, 50kW డీసీ ఫాస్ట్ ఛార్జర్తో అయితే కేవలం 56 నిమిషాల్లో 10-80 శాతం ఛార్జ్ చేయొచ్చని టాటా మోటార్స్ పేర్కొంది.
పంచ్ ఈవీ స్మార్ట్, స్మార్ట్+, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్+ పేరిట మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుంది. ఎకో, సిటీ, స్పోర్ట్స్ పేరిట మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. 190 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఈ కారు సొంతం. ఎంపవర్డ్ రెడ్, సీవీడ్, ఫియర్లెస్ రెడ్, డేటోనా గ్రే, ప్రిస్టైన్ వైట్ రంగుల్లో లభిస్తుంది. ఇందులో 16 అంగుళాల డైమండ్కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. క్యాబిన్ను విశాలంగా ఉండేలా తీర్చిదిద్దారు. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఏక్యూఐ డిస్ప్లేతో కూడిన ఎయిర్ప్యూరిఫైయర్, వాయిస్ అసిస్టెంట్తో కూడిన ఎలక్ట్రిక్ సన్రూఫ్, యూఎస్బీ టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ వంటి సదుపాయాలు ఉన్నాయి. 10.25 అంగుళాల టచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10 అంగుళాల డిజిటల్ ఇన్స్ర్టుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. ఆరు వేర్వేరు భాషల్లో 200 వాయిస్ కమాండ్స్కు ఇది సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ స్మార్ట్ఛార్జర్ సదుపాయం కూడా ఉంది. ఇందులో ఆరు ఎయిర్బ్యాగులను ఇస్తున్నారు. SOS కాలింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటర్ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లను టాటా ఆఫర్ చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
Bajaj Pulsar NS400Z: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో పల్సర్ ఎన్ఎస్400Z పేరుతో మరో కొత్త పల్సర్ను లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
ఒకాయా ఇ-బైక్ డిస్రప్టర్
దిల్లీకి చెందిన ఒకాయా సంస్థ ప్రీమియం బ్రాండ్ ఫెరాటో, సరికొత్త విద్యుత్ బైక్ ‘డిస్రప్టర్’ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.1,59,999. విద్యుత్ వాహన రాయితీల తర్వాత దిల్లీలో ఈ బైకు రూ.1.40 లక్షలకు లభించనుంది. -
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
electric scooter: భారత్ మార్కెట్లోకి మరో కొత్త విద్యుత్ స్కూటర్ వచ్చేసింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన యాంపియర్ ఈ స్కూటర్ను లాంచ్ చేసింది. -
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
Mahindra XUV 3XO: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎక్స్యూవీ 3XOను లాంచ్ చేసింది. దీని ధర రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ధరలు తగ్గించిన ఓలా.. ఎస్1X ఇక రూ.69,999 నుంచే!
ఓలా తన ఎస్1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి. -
2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. -
ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్.. ఎస్1 ఎక్స్ సిరీస్లో ఈ ఫీచర్లతో!
Ola Electric: ఓలా మరో స్కూటర్ తీసుకురాబోతోంది. ఎస్1 ఎక్స్ సిరీస్లో అప్డేట్ చేసిన వెర్షన్ వస్తోంది. -
విపణిలోకి ఎంజీ హెక్టార్ బ్లాక్స్టార్మ్
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) మోటార్ సంస్థ, తమ హెక్టార్ మోడల్లో సరికొత్త బ్లాక్స్టార్మ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. -
స్విఫ్ట్, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N250
Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త N250ని లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు
Jeep Compass: జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్ ఫినిష్తో తీర్చిదిద్దింది. -
2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!
Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. -
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 160 km
ఏథర్ సంస్థ రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ.. టాటా టెక్ జాయింట్ వెంచర్
BMW-Tata Tech: జాయింట్ వెంచర్ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్స్తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు. -
వాహన బీమా సంస్థల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో సాధారణ బీమా సంస్థలకు సంబంధించి.. వాహన బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
Force Motors: ఆటో మొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ వ్యవసాయ ట్రాక్టర్ల వ్యాపారం నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు