e-Luna: ఈ ఐకానిక్ టూవీలర్స్ మళ్లీ వస్తున్నాయ్!
బజాజ్ చేతక్ బాటలోనే మరో రెండు కంపెనీలు సరికొత్త ప్రయాణానికి సిద్ధమయ్యాయి. కెనటిక్, ఎల్ఎంఎల్ కంపెనీలు రీ ఎంట్రీ ఇవ్వనున్నాయి. త్వరలో విద్యుత్ ద్విచక్ర వాహనాలు తీసుకురాబోతున్నాయి.
Two wheelers | ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు టూవీలర్ మార్కెట్ను ఏలిన కొన్ని మోడళ్లు వివిధ కారణాలతో కాలగర్భంలో కలిసిపోయాయి. ఉత్పత్తి నిలిచిపోయినా వాటి పేర్లు మాత్రం చాలామంది మదిలో ఇప్పటికీ నిలిచే ఉన్నాయి. మార్కెట్లోకి కొత్తగా ఎన్ని మోటార్ సైకిళ్లు, స్కూటర్లు వచ్చినా.. వాటికున్న ఆ గుర్తింపే వేరు. ఎప్పుడైనా రోడ్డుపై కనిపిస్తే ‘ఇదే మా ఫస్ట్ బైక్’.. ‘దీనిపైనే మా నాన్న స్కూలుకు తీసుకెళ్లేవారు’ అంటూ ఇప్పటికీ గుర్తు చేసుకునేవారెందరో. అలా అంతరించిపోయిన బ్రాండ్లు మళ్లీ పురుడు పోసుకుంటున్నాయి. మళ్లీ కొత్త అవతారంలో రీఎంట్రీ ఇస్తున్నాయి.
లూనా.. ఈ పేరు చాలామందికి గుర్తే. సైకిల్కు, మోటార్సైకిల్కు మధ్యస్థంగా ఉండే ఈ 50 సీసీ మోపెడ్ ఒకప్పుడు ప్రతిచోటా దర్శనమిచ్చేది. ఈ శతాబ్దం ప్రారంభంలో లూనా ఉత్పత్తిని కైనటిక్ నిలిపివేసింది. ఇప్పటితరానికి బహుశా దీని గురించి పరిచయం కూడా ఉండకపోవచ్చు. అలాంటి లూనా మళ్లీ రోడ్లపైకి రానుంది. ఇ-లూనా (e-Luna) రూపంలో ఎంట్రీ ఇవ్వనుంది. ఫిబ్రవరిలో దీన్ని లాంచ్ చేయనున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కైనటిక్ గ్రీన్ సంస్థ దీన్ని తీసుకొస్తోంది.
అమ్మకానికి ‘అమెజాన్’ పుట్టినిల్లు..!
మార్కెట్ పోటీని తట్టుకోలేక కనుమరుగైన మరో బ్రాండ్ ఎల్ఎంఎల్ (LML). దీని పూర్తి పేరు లోహియా మెషినరీ లిమిటెడ్. ఒకప్పుడు బజాజ్ చేతక్కు పోటీగా స్కూటర్తో పాటు, బైకులను విడుదల చేసిన కంపెనీ.. తర్వాత దివాలా తీసింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ రూపంలో మళ్లీ రాబోతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్టార్ పేరిట ప్రీమియం సెగ్మెంట్లో ఓ విద్యుత్ స్కూటర్ను ఎల్ఎంఎల్ తీసుకురానుంది.
ఓ విధంగా ఈ రెండు కంపెనీలకు బజాజ్ స్ఫూర్తి అని చెప్పాలి. ఒకప్పుడు చేతక్ పేరిట ఫ్యామిలీ స్కూటర్లను విక్రయించిన బజాజ్.. తర్వాత దాని ఉత్పత్తిని నిలిపివేసింది. చేతక్కు ఉన్న బ్రాండ్ నేమ్ను వినియోగించుకునేందుకు చేతక్ పేరుతో విద్యుత్ స్కూటర్ను తీసుకొచ్చింది. ఆ పేరు ఓ విధంగా బజాజ్కు బాగానే ఉపయోగపడింది. ఇదే తరహాలో కైనటిక్ గ్రీన్, ఎల్ఎంఎల్ సంస్థలు కొత్త అవతారంతో విద్యుత్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నాయి. ఇప్పటికే ఈ మార్కెట్లో ఓలా, టీవీఎస్, బజాజ్, ఏథర్ దూసుకెళ్తున్నాయి. హోండా, యమహా, సుజుకీ సైతం త్వరలో ఈ సెగ్మెంట్లోకి అడుగుపెట్టనున్నాయి. మరి ఐకానిక్ బ్రాండ్లు ఏమేర రాణిస్తాయో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
electric scooter: భారత్ మార్కెట్లోకి మరో కొత్త విద్యుత్ స్కూటర్ వచ్చేసింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన యాంపియర్ ఈ స్కూటర్ను లాంచ్ చేసింది. -
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
Mahindra XUV 3XO: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎక్స్యూవీ 3XOను లాంచ్ చేసింది. దీని ధర రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ధరలు తగ్గించిన ఓలా.. ఎస్1X ఇక రూ.69,999 నుంచే!
ఓలా తన ఎస్1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి. -
2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. -
ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్.. ఎస్1 ఎక్స్ సిరీస్లో ఈ ఫీచర్లతో!
Ola Electric: ఓలా మరో స్కూటర్ తీసుకురాబోతోంది. ఎస్1 ఎక్స్ సిరీస్లో అప్డేట్ చేసిన వెర్షన్ వస్తోంది. -
విపణిలోకి ఎంజీ హెక్టార్ బ్లాక్స్టార్మ్
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) మోటార్ సంస్థ, తమ హెక్టార్ మోడల్లో సరికొత్త బ్లాక్స్టార్మ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. -
స్విఫ్ట్, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N250
Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త N250ని లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు
Jeep Compass: జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్ ఫినిష్తో తీర్చిదిద్దింది. -
2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!
Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. -
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 160 km
ఏథర్ సంస్థ రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ.. టాటా టెక్ జాయింట్ వెంచర్
BMW-Tata Tech: జాయింట్ వెంచర్ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్స్తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు. -
వాహన బీమా సంస్థల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో సాధారణ బీమా సంస్థలకు సంబంధించి.. వాహన బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
Force Motors: ఆటో మొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ వ్యవసాయ ట్రాక్టర్ల వ్యాపారం నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
Xiaomi Car: షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో!
Xiaomi Car: షావోమి కార్ల ఆర్డర్లు చైనాలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ కారు ధరపై సోమవారం ఆసక్తిక విషయం వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM