బంజారాహిల్స్‌లో విద్యుత్‌షాక్‌తో వైద్యుడి మృతి

హైదరాబాద్‌ నగరాన్ని వర్షం అతలాకుతలం చేస్తోంది. సెల్లార్‌లో నిండిన వర్షపు నీటిని మోటారు సహాయంతో తోడేందుకు యత్నించిన ఓ వైద్యుడు విద్యుత్‌షాక్‌తో మృతిచెందాడు. ఈ ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది..

Published : 15 Oct 2020 01:17 IST

జూబ్లీహిల్స్‌: హైదరాబాద్‌ నగరాన్ని వర్షం అతలాకుతలం చేస్తోంది. సెల్లార్‌లో నిండిన వర్షపు నీటిని మోటారు సహాయంతో తోడేందుకు యత్నించిన ఓ వైద్యుడు విద్యుత్‌షాక్‌తో మృతిచెందాడు. ఈ ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. శ్రీనగర్‌ కాలనీ ప్రాంతంలోని ఎస్‌బీహెచ్‌ కాలనీలో సతీశ్‌రెడ్డి అనే వైద్యుడు నివాసముంటున్నారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆయన నివసించే అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌ నీటితో నిండిపోయింది.  దీంతో ఆ నీటిని తోడే క్రమంలో మోటారు వేసేందుకు యత్నించగా విద్యుత్‌షాక్‌కు గురై కుప్పకూలిపోయారు. అపార్ట్‌మెంట్‌ వాసులు గమనించి ఆయన్ను ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే ఆయన మృతిచెందారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదుచేశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని