మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం
అతడో ఇద్దరు పిల్లల తండ్రి. కూతురి వయసు ఎనిమిదేళ్లు.. కొడుకు వయసు ఆరేళ్లు. తన కూతురు కంటే ఐదేళ్ల చిన్నదైన పసిపాప అతడి పైశాచిక చర్యతో భీతిల్లిపోయింది. తీవ్ర రక్త స్రావంతో విలవిల్లాడిపోయింది.
పోక్సో చట్టం కింద కేసు నమోదు
సిరిసిల్ల పట్టణం, న్యూస్టుడే: అతడో ఇద్దరు పిల్లల తండ్రి. కూతురి వయసు ఎనిమిదేళ్లు.. కొడుకు వయసు ఆరేళ్లు. తన కూతురు కంటే ఐదేళ్ల చిన్నదైన పసిపాప అతడి పైశాచిక చర్యతో భీతిల్లిపోయింది. తీవ్ర రక్త స్రావంతో విలవిల్లాడిపోయింది. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అతడు ఎనిమిది మర మగ్గాలున్న ఆసామి. వయసు 30 సంవత్సరాలు. భార్య, పిల్లలు శుభకార్యానికి వెళ్లారు. ఆదివారం ఇంట్లో ఒక్కడే ఉండగా ఎదిరింటికి చెందిన ఓ మూడేళ్ల పసిపాప ఆడుకుంటూ కనిపించింది. చాక్లెట్ ఇస్తానని ఆశ చూపడంతో ఆమె నవ్వుతూ అతడితో పాటు ఇంట్లోకి వెళ్లింది. అత్యాచారం చేయడంతో చిన్నారి ఏడుస్తూ బయటకు వచ్చింది. తల్లిదండ్రులు ఏమైందని అడిగితే ఏడుపే సమాధానమైంది. అప్పుడు వారు ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడాన్ని గమనించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రులు సిరిసిల్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు అత్యాచారం చేసినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!