Agnipath Protest: సికింద్రాబాద్ అల్లర్ల కేసు... ఎట్టకేలకు ఆవుల సుబ్బారావు అరెస్టు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. అకాడమీలో పనిచేసే శివ, హరితో పాటు మరో నలుగురిని రైల్వే పోలీసులు అరెస్టు చేసి గాంధీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించారు. అనంతరం జీఆర్పీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి బోయగూడలోని రైల్వే కోర్టులో హాజరుపర్చనున్నారు.
విధ్వంసంలో సుబ్బారావు శిష్యులదే ప్రధాన పాత్ర
ఈనెల 17న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన విధ్వంసంలో ఆవుల సుబ్బారావు పాత్ర ఉన్నట్టు పోలీసులు తేల్చారు. 16వ తేదీనే హైదరాబాద్ చేరుకున్న సుబ్బారావు.. ఆర్మీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువకులను రెచ్చగొట్టి రైల్వే స్టేషన్లో విధ్వంసం సృష్టించేలా పథక రచన చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇతనికి తెలుగు రాష్ట్రాల్లో డిఫెన్స్ అకాడమీలు ఉన్నాయి. అగ్నిపథ్ పథకం వల్ల కోచింగ్ సెంటర్లన్నీ మూతపడే పరిస్థితి నెలకొంటుందనే దురుద్దేశంతో యువకులను రెచ్చగొట్టినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈమేరకు హకీంపేట ఆర్మీ సోల్జర్స్ గ్రూప్లో పలు పోస్టులను ఆధారాలుగా చూపిస్తున్నారు. సాయిడిఫెన్స్ అకాడమీలో ఆర్మీ ఉద్యోగం కోసం శిక్షణ తీసుకుంటున్న పలువురు యువకులు విధ్వంసంలో ప్రధాన పాత్ర పోషించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. కేసులో ఏ2గా ఉన్న పృథ్వీరాజ్ కూడా ఆవుల సుబ్బారావు శిష్యుడే.
మిగతా అకాడమీల డైరెక్టర్ల పాత్రపై ఆరా..
సాయి డిఫెన్స్ అకాడమీలో ఆర్మీ ఉద్యోగం కోసం శిక్షణ తీసుకునే యువకులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. వసతికి సంబంధించి డబ్బులు వసూలు చేస్తారు. ఆర్మీ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల వద్ద రూ.2 లక్షల నుంచి 3లక్షల వరకు వసూలు చేస్తారు. ఇప్పటికే దేహదారుఢ్య, వైద్యపరీక్షలు పూర్తైన అభ్యర్థులు రాత పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్రం అగ్నిపథ్ ద్వారానే ఆర్మీ ఎంపికలు ఉంటాయని ప్రకటించగానే ఆవుల సుబ్బారావుతో పాటు మరి కొంత మంది డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్లు కలిసి విధ్వంసానికి కుట్ర పన్నినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. మిగతా అకాడమీలకు చెందిన డైరెక్టర్ల పాత్రపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.