Hyderabad: 30 కేసుల్లో నిందితుడు.. పారిపోయేందుకు పోలీస్స్టేషన్ 2వ అంతస్తు నుంచి దూకి..
హైదరాబాద్ ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్ నుంచి ఓ నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. పీఎస్ రెండో అంతస్తు వెనక నుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
ఎస్ఆర్ నగర్: హైదరాబాద్ ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్ నుంచి ఓ నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. పీఎస్ రెండో అంతస్తు వెనక నుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. నిందితుడిని పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం కృష్ణ అనే పాత నేరస్తుడిని విచారణ నిమిత్తం అమీర్పేటలో అదుపులోకి తీసుకుని ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్కు తీసుకువచ్చారు. పలువురు అమ్మాయిలను మోసం చేసిన కేసులతో కలిపి కృష్ణపై దాదాపు 30 కేసులు ఉన్నట్లు తేలడంతో పోలీసులు ఠాణాకు తీసుకువచ్చారు. ఇవాళ మధ్యాహ్నం 3గంటల సమయంలో తప్పుంచుకునే ప్రయత్నంలో పోలీసు స్టేషన్లోని రెండో అంతస్తు నుంచి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పంజాగుట్ట ఏసీపీ గణేష్.. ఎస్ఆర్ నగర్ పోలీసుస్టేషన్కు చేరుకుని విచారణ జరుపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధిక వడ్డీల ఆశజూపి.. భారీ మోసం!
తమ సంస్థలో పెట్టుబడులు పెడితే.. అధిక వడ్డీతో పాటు తక్కువ సమయంలోనే భారీగా ఆర్జించవచ్చని మాయమాటలతో నమ్మించిన దంపతులు బోర్డు తిప్పేసిన ఘటన హైదరాబాద్ ఉప్పల్లో చోటుచేసుకుంది. -
కోల్కతాలో కుప్పకూలిన అయిదంతస్తుల భవనం.. తొమ్మిది మంది మృతి
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మాణంలో ఉన్న ఓ అయిదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
హార్డ్డిస్కులను అడవిలో పడేసిన ప్రణీత్రావు!
పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్సైబీ)లోని హార్డ్డిస్కులను కట్టర్లతో కత్తిరించి, వికారాబాద్ అడవిలో పడేసినట్లు రెండోరోజు విచారణలో డీఎస్పీ ప్రణీత్రావు ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. -
పెళ్లి కారు, ట్రాక్టర్ ఢీ.. బిహార్లో 9 మంది మృతి
బిహార్లోని ఖగారియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, పెళ్లి కారు ఢీ కొన్న ఘటనలో 9 మంది మరణించారు. -
నకిలీ ఔషధ రాకెట్ కేసులో ఈడీ దాడులు
దేశ రాజధాని దిల్లీలో బయటపడిన నకిలీ ఔషధ రాకెట్ గుట్టును ఛేదించే క్రమంలో ఈడీ దాదాపు 10 ప్రదేశాల్లో దాడులు చేసింది. ముఠా ప్రధాన సూత్రధారులు విపిల్ జైన్, నీరజ్ చౌహన్, సూరజ్ షాత్, అభినవ్, తుషార్ చౌహాన్లతో సహా వారి సహచరుల ఇళ్లల్లోను ఈడీ దాడులు చేసింది. -
రూ.5.73 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఈదులగూడ వద్ద సోమవారం పట్టణం నుంచి కోదాడ వైపు వెళ్తున్న టీఎస్ 09 యూఈ 2479 నంబరు గల బొలేరో వాహనంలో రూ.5.73 కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ చందనా దీప్తి పేర్కొన్నారు. -
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ వద్ద చోరీ.. ఆపై అడ్డంగా దొరికారు
ఓ వ్యక్తి మెడలో ఉన్న గొలుసును చోరీ చేసిన ఇద్దరు దొంగలు చివరకు పోలీసుల చేతికి చిక్కి, కటకటాల పాలయ్యారు.