Fire Accident: ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో అగ్నిప్రమాదం..8 మృతదేహాల వెలికితీత
మహారాష్ట్రలోని రాయ్గడ్ జిల్లాలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో ఇప్పటి వరకు 8 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు.
ముంబయి: మహారాష్ట్రలోని రాయ్గడ్ జిల్లాలోని మహద్ ప్రాంతంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో ఇప్పటి వరకు 8 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు. మరో ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉందని, సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. స్థానిక బ్లూజెట్ హెల్త్కేర్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలతోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేశాయి. రసాయన పదార్థాలకు నిప్పు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నట్లు రాయ్గడ్ జిల్లా ఎస్పీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.