Mahaboobnagar: ప్లాస్టిక్‌ పరిశ్రమలో ప్రమాదం.. 13 మందికి తీవ్ర గాయాలు

మహబూబ్‌నగర్‌జిల్లాలోని ప్లాస్టిక్‌ తయారీ పరిశ్రమలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

Updated : 16 Jul 2023 22:37 IST

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌జిల్లాలోని ప్లాస్టిక్‌ తయారీ పరిశ్రమలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జడ్చర్ల సమీపంలోని బాలనగర్‌లో ఉన్న  శ్రీనాథ్‌ రోటా ప్యాక్‌ ప్లాస్టిక్‌ పరిశ్రమలో ఫర్నేస్‌ పేలుడుతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈఘటనలో పరిశ్రమలో పనిచేస్తున్న 13 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను షాద్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో  మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని