TS News: జాగ్రత్త..లిఫ్టు ఇస్తారు.. ఫోను, పర్సు కొట్టేస్తారు!
ఒంటరిగా ఉన్న ప్రయాణికులకు లిఫ్టు ఇస్తున్నట్లు ఆటో, కారులో ఎక్కించుకుని పర్సులు, సెల్ఫోన్లు దొంగిలిస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
ఐదుగురు సభ్యుల ముఠా అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ చందనదీప్తి
రెజిమెంటల్బజార్, న్యూస్టుడే: ఒంటరిగా ఉన్న ప్రయాణికులకు లిఫ్టు ఇస్తున్నట్లు ఆటో, కారులో ఎక్కించుకుని పర్సులు, సెల్ఫోన్లు దొంగిలిస్తున్న ఐదుగురు ముఠా సభ్యులను చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. వివరాలను ఉత్తరమండలం డీసీపీ చందనదీప్తి వెల్లడించారు. చాంద్రాయణగుట్టవాసి ఫారూక్ఖాన్(29) ఆఫీజ్బాబానగర్వాసులు మహమ్మద్ ఖలీద్(23), సయ్యద్ ఖాజా(22) సల్మాన్ షరీఫ్(22), షేక్ ఇస్మాయిల్(19)లు స్నేహితులు. విలాసాల కోసం చోరీల బాటపట్టారు. అద్దెకు ఆటో, కార్లు తీసుకుని నగరంలో అత్తాపూర్, మెహిదిపట్నం, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో ఒంటరిగా ఉన్న ప్రయాణికులను లిఫ్టు పేరిట ఎక్కించుకుంటున్నారు. ముఠా సభ్యులు ప్రయాణికుల మాదిరిగానే కూర్చొని సెల్ఫోన్, పర్సులు దొంగిలిస్తారు. ఈనెల 21న చిక్కడపల్లిలో ఉండే అడ్వొకేట్ సంజీవ్రావు వద్ద నిందితులు సెల్ఫోన్, పర్సు కాజేశారు. ఆయన ఫిర్యాదుతో టాస్క్ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో రెండునెలలుగా ఇదే తరహాలో సెల్ఫోన్లను దొంగిలించినట్లుగా అంగీకరించారు. నిందితుల నుంచి 6సెల్ఫోన్లు, రూ.3500, కారు స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.