కారులో వచ్చి.. ఇల్లు దోచేసి
కారులో వచ్చి ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగను నిజామాబాద్ మూడో ఠాణా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇదే కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిజామాబాద్ సబ్ డివిజన్
నిందితుడిపై 18 దొంగతనం కేసులు
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ వెంకటేశ్వర్
నిజామాబాద్ నేరవార్తలు, న్యూస్టుడే: కారులో వచ్చి ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగను నిజామాబాద్ మూడో ఠాణా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇదే కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిజామాబాద్ సబ్ డివిజన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ ఆరె వెంకటేశ్వర్ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. నగరంలోని దుబ్బ ఆదర్శనగర్కు చెందిన బేగరి రాజు ఆగస్టు 17న తన ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లారు. తిరిగి 19న ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది. బీరువాలోని నగలు మాయం కావటంతో బాధితుడు మూడో ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు సీసీ టీవీ ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. ఎరుపు రంగు కారులో వచ్చి చోరీ చేసి వెళ్లినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. పాత నేరస్థుడు రాజుగౌడ్ పనిగా గుర్తించి.. అతన్ని అదుపులోకి తీసుకొన్నారు. మరో నిందితుడు కిరణ్ పరారీలో ఉన్నాడు. రాజుగౌడ్పై ఇప్పటికే 18 దొంగతనం కేసులు ఉన్నాయి. ఆయన నుంచి 4.5 తులాల బంగారు నగలు, కారు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకొన్నారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సీఐ శ్రీశైలం, ఎస్సై నరేష్, సిబ్బంది అప్సర్, వెంకట్రాం, జగన్ బృందాన్ని ఏసీపీ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బిహార్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దర్భంగా ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే