హోమియో మందుల డబ్బా మింగి బాలుడి మృతి

ఆ తల్లికి 20ఏళ్ల తరువాత లేక లేక బిడ్డ పుట్టాడు. ఆదివారం ఆ బిడ్డ అనూహ్యంగా కన్ను మూయడంతో ఆ మాతృమూర్తి కన్నీటి పర్యంతమయ్యారు.

Published : 02 Jan 2023 06:47 IST

సి.బెళగల్‌, న్యూస్‌టుడే: ఆ తల్లికి 20ఏళ్ల తరువాత లేక లేక బిడ్డ పుట్టాడు. ఆదివారం ఆ బిడ్డ అనూహ్యంగా కన్ను మూయడంతో ఆ మాతృమూర్తి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా సి.బెళగల్‌ మండలం చింతమానుపల్లెలో చోటుచేసుకుంది. కుటుంబీకుల వివరాల మేరకు.. చింతమానుపల్లె గ్రామం దళితవాడలో నివాసముంటున్న నల్లన్న, సువర్ణమ్మ కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు. వివాహమైన 20 ఏళ్ల అనంతరం పుట్టిన బిడ్డ ప్రదీప్‌ను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా బాలుడి ముద్దు మాటలు వింటూ మురిసిపోయారు. ఇంట్లో వారంతా మాట్లాడుతూ.. సందడి చేస్తుండగా 10 నెలల ఆ చిన్నారి సమీపంలో ఉన్న హోమియో మందులు వేసే చిన్న డబ్బా మింగేశాడు. అది గొంతులో ఇరుక్కుపోయి ఊపిరి ఆడకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని