పోలీస్ దెబ్బలకే కన్నుమూశాడు!
దొంగ అనే అనుమానంతో మెదక్కు చెందిన ఖదీర్ఖాన్ అనే వ్యక్తిపై పోలీసులు తమ కర్కశత్వాన్ని ప్రదర్శించారు. నాలుగు రోజులు విపరీతంగా కొట్టాక.. నిందితుడు అతడు కాదని తెలిసి వదిలేశారు.
దొంగ అనే అనుమానంతో నా భర్తను తీసుకెళ్లి కొట్టారు
మెదక్ పట్టణానికి చెందిన సిద్ధేశ్వరి ఆవేదన
కొట్టలేదు.. ఆరోపణలపై విచారణ చేస్తున్నాం: డీఎస్పీ
ఈనాడు, సంగారెడ్డి: దొంగ అనే అనుమానంతో మెదక్కు చెందిన ఖదీర్ఖాన్ అనే వ్యక్తిపై పోలీసులు తమ కర్కశత్వాన్ని ప్రదర్శించారు. నాలుగు రోజులు విపరీతంగా కొట్టాక.. నిందితుడు అతడు కాదని తెలిసి వదిలేశారు. తీవ్ర గాయాలపాలైన భర్తను ఆసుపత్రికి తీసుకెళదామని భార్య ప్రయత్నించగా.. తమ తప్పు బయటపడకుండా ఉండేందుకు ఇంట్లోనే ఉంచాలని పోలీసులు బెదిరించారు. బలం గోలీలు తెచ్చిస్తాం.. వేసుకొంటే సర్దుకుంటుందని చెప్పారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించగా.. గాంధీలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి ప్రాంతంలో ఖదీర్ఖాన్ మృతి చెందారు. తమకు న్యాయం చేయాలని ఈనెల 6వ తేదీన కుటుంబం సభ్యులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి వేడుకున్నారు. ఖదీర్ఖాన్ భార్య సిద్ధేశ్వరి తెలిపిన వివరాలివీ..
మెదక్ పట్టణానికి చెందిన మహ్మద్ ఖదీర్ఖాన్(37) చిరు వ్యాపారి. భార్య సిద్ధేశ్వరి, ముగ్గురు పిల్లలున్నారు. గతనెల 12న హైదరాబాద్లోని చిన్నమ్మ ఇంటికి వెళ్లారు. అదే నెల 27న పట్టణంలోని అరబ్గల్లీలో నడుచుకుంటూ వెళుతుండగా పుస్తెలతాడు కొట్టేశారంటూ ఒక మహిళ మెదక్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు నిందితుడి పోలికలు ఉండడంతో ఖదీర్ఖాన్ను హైదరాబాద్లో జనవరి 29న అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 2 వరకు మెదక్ పోలీస్స్టేషన్లోనే ఉంచి చిత్రహింసలకు గురి చేశారు. అదే రోజు భార్యకు విషయం చెప్పిన పోలీసులు ఆయన్ని ఇంటికి తీసుకెళ్లాలన్నారు. ఠాణాకు వెళ్లి చూస్తే.. భర్త నడవలేని స్థితిలో ఉన్నారు. అతి కష్టంమీద ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత పోలీసులు వచ్చి తామే కొన్ని మందులు తెచ్చిస్తామని ఆయన్ను బయటకు తీసుకురావొద్దని హుకుం జారీ చేశారు. ఈనెల 8న ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తొలుత మెదక్లోని ప్రభుత్వాసుపత్రికి, అట్నుంచి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించారు. ఈనెల 12న సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేర్పించగా 16న రాత్రి 11 గంటల ప్రాంతంలో మరణించారు.
మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి కుటుంబసభ్యులకు అప్పగించాం: డీఎస్పీ
ఈ విషయమై మెదక్ డీఎస్పీ సైదులును వివరణ కోరగా.. ‘‘దొంగతనం చేశాడనే అనుమానంతో ఖదీర్ఖాన్ను మెదక్ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాంకేతికపరమైన విచారణ చేశారు. కొట్టలేదు. దొంగతనం చేయలేదని తేలడంతో మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి కుటుంబసభ్యులకు అప్పగించాం. ఆ తర్వాత కొద్దిరోజులకు అతను అస్వస్థతకు గురయ్యాడు. ఈ మధ్యలో ఏం జరిగిందో తెలియదు. పోలీసులు కొట్టారని ఆరోపణలు రావడంతో స్థానిక ఎస్సై రాజశేఖర్, కానిస్టేబుళ్లు ఆర్.పవన్కుమార్, బురుకాల ప్రశాంత్లను ఈనెల 14న ఎస్పీ రోహిణి ప్రియదర్శిని బదిలీ చేశారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది’’ అని తెలిపారు.
తలకిందులుగా వేలాడదీశారు....
ఆసుపత్రిలో ఉన్న ఖదీర్ఖాన్ను పరామర్శించేందుకు ఈనెల 9న పలువురు నేతలు, స్థానికులు ఆయన వద్దకు వెళ్లారు. తనను పోలీసులు ఎలా కొట్టారో వారికి ఆయన వివరించారు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ‘పోలీసులు.. మెదక్ ఠాణాలో వస్త్రాలు విప్పి 2 గంటల పాటు తలకిందులుగా వేలాడదీశారు. బెల్టు, కర్రలతో విపరీతంగా కొట్టారు. భరించలేకపోయా. దొంగతనం చేయలేదని ఎంత మొత్తుకున్నా వినలేదు’ అని చెప్పినట్లు ఆ వీడియోలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
అమిత్ షా వీడియో మార్ఫింగ్ .. ఐదుగురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్టు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. -
ప్రభాకర్రావు కోసం పోలీసుల వేట .. అరెస్టు వారెంట్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. -
వివాహిత ఇంటికి బాంబు పార్సిల్ పంపిన ప్రియుడు.. భర్త, కుమార్తె మృతి
వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు బాంబు పార్సిల్ పంపడంతో అది పేలి భర్త, కుమార్తె మరణించిన ఘటన గుజరాత్లోని వడాలిలో గురువారం చోటుచేసుకుంది. -
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
ముంబయి మహానగరంలో కనీస సదుపాయాలు అందక ఓ నిండు గర్భిణీ ప్రాణాలు విడిచింది. ఆసుపత్రి తీవ్ర నిర్లక్ష్యం ఓ కుటుంబానికి తీరని నష్టాన్ని మిగిల్చింది. -
వైకాపా సర్పంచి వాహనంలో ‘ఎన్నికల’ మద్యం పట్టివేత
వైకాపాకు చెందిన గ్రామ సర్పంచి వాహనంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. అధికారుల వివరాల మేరకు.. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల శివారులోని పల్నాడు బార్ అండ్ రెస్టారెంటులో గురజాల నియోజకవర్గం వీరాపురం గ్రామానికి చెందిన వైకాపా సర్పంచి సుంకర విజయరామారావు, కేసనపల్లి గ్రామానికి చెందిన గణేష్బాబు 1,056 మద్యం సీసాలు కొనుగోలు చేసి, వాహనంలో తీసుకెళ్తున్నారు. -
కానిస్టేబుల్కు విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చిన దుండగులు
కొందరు దుండగులు విషపూరిత ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆసుపత్రిపాలైన ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ముంబయిలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
హోమియోపతి మందులతో నకిలీ మద్యం తయారీ
విశాఖ నగరంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి మద్యం తయారీకి వాడుతున్న రసాయనాలు, లేబుళ్లు, సీసాలను స్వాధీనం చేసుకున్నారు. -
గుంటూరులో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్
గుంటూరులోని నెహ్రూనగర్ ప్రాంతంలో గురువారం రాత్రి గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. అడ్డొచ్చిన వారిని కొడుతూ బీభత్సం సృష్టించింది. మహిళలు, వృద్ధులనీ చూడకుండా మత్తులో ఉన్న 15 మంది దాడులకు తెగబడ్డారు. -
ఎంత డబ్బో.. ఎవరి సొమ్మో!
ఎన్నికల నిబంధనల వేళ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.40కోట్ల నగదును పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. -
పంట వ్యర్థాలకు నిప్పు.. మంటల ధాటికి రైతు బలి
వానాకాలం సాగుకు పొలాన్ని సిద్ధం చేయడానికి మొక్కజొన్న, పత్తి పంట వ్యర్థాలకు నిప్పు పెట్టిన రైతు.. మంటల వేడి, పొగ కారణంగా తనూ మృతి చెందిన విషాదకర సంఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకొంది. -
ఛత్తీస్గఢ్లో ఇద్దరిని హత్య చేసిన మావోయిస్టులు
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. వరుస ఎదురుదెబ్బలతో సతమతమవుతున్న మావోయిస్టులు బీజాపూర్ జిల్లాలోని తర్రెమ్ పోలీసుస్టేషన్ పరిధిలోని చుత్వాహి గ్రామానికి చెందిన సోదరులు మండవి జోగ(45), మండవి హుంగా(43)ను దారుణంగా హత్య చేశారు. -
ఫోన్ ట్యాప్ చేశారని ఫిర్యాదు
తమ సెల్ఫోన్లను ట్యాప్ చేశారని హైదరాబాద్ సరూర్నగర్లోని ద్వారకా తిరుమల కాలనీకి చెందిన ఇ.విజయపాల్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీపీ టి.కృపాకర్ (ప్రస్తుతం కాజీపేటలో రైల్వే డీఎస్పీ), విశ్రాంత సీఐ దాసరి భూమయ్యలపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ జిల్లా జమ్మికుంట సీఐ వి.రవి గురువారం తెలిపారు. -
చెత్త కుప్పల మంటల్లో పడి కూలీ మృతి
తగలబడుతున్న చెత్తలో పడి ఓ నిర్మాణ కార్మికుడు సజీవ దహనం అయ్యాడు. రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన దొంపక బాబు(35) భార్య సంధ్యతో కలిసి రాయదుర్గం పరిధిలోని అంజయ్యనగర్లో ఉండేవాడు. -
తెనాలిలో వైకాపా రౌడీషీటర్ అరాచకం
గుంటూరు జిల్లా తెనాలిలో వైకాపా రౌడీషీటర్ ఇద్దరిని కొట్టాడు. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. రెండో పట్టణ పోలీసుస్టేషన్లో ఏ ప్లస్ రౌడీషీటర్గా ఉన్న సముద్రాల పవన్కుమార్ అలియాస్ లడ్డూ తన మిత్రుడితో కలిసి ఐతానగర్లో బుధవారం బైకుపై వెళుతుండగా మరో ద్విచక్రవాహనదారుడు వీరికి తగిలారు. -
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవం ఖరారు
అనంతపురానికి చెందిన గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడైన మలిశెట్టి భానుకిరణ్ అలియాస్ భానుకు కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను ఖరారు చేస్తూ గురువారం హైకోర్టు తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు