Vande Bharat Express: వందేభారత్ రైలు ఢీ.. జింక ఎగిరొచ్చి మీదపడటంతో వ్యక్తి మృతి
వేగంగా వెళ్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలపై ఉన్న నీల్గాయ్ జింకను ఢీకొట్టింది.
రాజస్థాన్: వేగంగా వెళ్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలపై ఉన్న నీల్గాయ్ జింకను ఢీకొట్టింది. ఆ జింక గాల్లో ఎగిరి సమీపంలో ఉన్న ఓ వ్యక్తిపై పడింది. రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లా కలిమోరి రైల్వే లెవల్ క్రాసింగు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో జింకతోపాటు ఆ వ్యక్తి అక్కడిక్కక్కడే మృతిచెందారు. దీంతో రైలును కొద్దిసేపు నిలిపివేశారు. జింక మీద పడి మరణించిన వ్యక్తిని రైల్వే విశ్రాంత ఉద్యోగి శివదయాళ్గా పోలీసులు గుర్తించారు. ఆయన మృతదేహాన్ని రాజీవ్గాంధీ జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించి, కుటుంబసభ్యులకు సమాచారం చేరవేశారు. రైలు దిల్లీ నుంచి అజ్మేర్కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.